Showing posts with label భాషోద్యమ వ్యాసాలు. Show all posts
Showing posts with label భాషోద్యమ వ్యాసాలు. Show all posts

Saturday, 20 July 2013

3rd World Telugu Writers’ Conference

An Introduction to the Aim and Purpose of the Conference


It gives us a great pleasure to take an opportunity to invite all the lovers and admirers of Telugu Language and Culture to the 3rd World Telugu Writers’ Conference on the occasion of the celebrations of the “The Year of Flourish of Telugu Language and Culture.”

On 20th, 21st and 22nd (Friday, Saturday and Sunday) of September 2013, the Conference is going to be held in Sri Seshasai Kalyana Mandapam, M.G. Road, Vijayawada.

The 1st World Telugu Writers’ Conference held in September,2007 under the auspices of the Krishna District Writers’ Association initiated a powerful and successful Telugu Language Movement and inspired Telugu people, thus opening a new chapter in the history of the Telugu Language.
Keeping in view of the celebration of DIAMOND JUBILEE of the Independence of India, we released a book of Research Articles, “Vajrabharathi” in the conference which was well appreciated by literary critics.

In the month of August 2011, the Krishna District Writers’ association organized the 2nd World Telugu Writers’ Conference. A well designed programme for making Telugu a World Language took its formal shape
in the conference. The State Government , in that conference, announced its Membership in Uni-Code Consortium and Release of New Fonts and thereby expressed its willingness to developTelugu language in accordance with Modern Technical Knowledge.On this occasion the installation of the statue of “Telugu Talli” (Mother Telugu) and publication of a book of Research “Telugu Punnami” (Telugu in Full Moon) were also taken place

WORLD TELUGU WRITERS’ ASSOCIATION:

In the 2nd World Telugu Writers’ Conference, it was felt that there is an absolute necessity of forming an International platform for the world wide Telugu Writers, Linguists, Historians and Reasearch fellows and the responsibility of its foundation was entrusted to Sri Mandali Budha Prasad and the Krishna District Writers’ Association.Thus, the Founder Executive Committe has been established for “World Telugu Writers Association”
Now the World Telugu Writers’ association is organizing 3rd World TeluguWriters’ Conference with the courtesy of the Cultural Wing of Government of Andhra Pradesh and with the cooperation of the Krshna District Writers’ Association.

In order to bring a blossom in Telugu Language and Culture among the young generation, the 3rd World Telugu Writers Conference is providing a major role to young writers. As gradual deterioration is taking place in the role played by youth in the fields of Literature, Culture and Social activity, it is high time that, as a social responsibility, the light is focused on youth.

After globalization, in the past three decades,during which the society has entered the electronic age, the impact of foreign culture, Marketing financial systems, Free Market, Computer jobs have made the lives of the youth fast-going.

In any country, social change is a natural phenomenon. when the entire world can be seen in our hand, there is no use in making irrational arguments. But whenever the language and the Culture are endangered, the society gets ready to protect them. “The Jaanu Telugu Movement” started by poets like Somanatha fulfilled its responsibility. The Bhakti Movement , brought by poets like Annamayya and the Spoken Language Movement brought by Veeresalingam, Gurajada, Gidugu helped in bringing social awareness among Telugu people. The present Telugu Languge Movement with the aim of making Telugu as household language,school language and language of Administration and bringing the ancient grandeur of telugu and of making Telugu a World Language. World Telugu Writers’ Conference stand as protecting

shield for Telugu Language and Culture.

3rd World Telugu Writers’ Conference
Plan of action : literature, society - youth

This is the main principal programme of the 3rd World Telugu Writers’ Conference. We hope that this conference is going to provide a fitting and proper place to young people in all the literary trends by forming a platform to chalk out a programme and execute it.
We are inviting renowned people in Telugu literature and culture. Experts in computer technology, Experts in Social matters, Stalwarts in the field of Journalism,  Important people in electronic media and celebrities in the fileds of Culture and literature.
We involve each and every one who has been working day and night for the nation-wide development of telugu language and culture to take part in the conference. It is an open and hearty invitation to all the young men and women who have literary zeal. We hope that this
conference will make the literary urge double among the youth as well as student community and create a meaningful and useful platform for them.
We make an appeal to teachers and heads of the Educational Institutions and Universities to pick up students who have literary taste and send them as delegates to the conference.

Good Opportunity to Young Writers:
1. In connection with the conference we are going to publish a special edition (collection) of the stories, verses, essays and songs and cartoons of young writers with the title MANA YUVATHA (Our Youth).For favour of publication in the said book, we invite young writers to come forward with their contributions. The contributions should be related to literature, social aspects and research. The best of them will be published in MANA YUVATHA. The writers are requested to send their articles before 15th August 2013.
2. We aim at the selection of young talented writers who can lead society constructively with their modern concepts.          
3. There will be seminars and group discussions to give a comprehensive understanding to young writers on the various literary trends and social aspects.
4. “An exhibition of mini poems will be a special attraction of the conference. Mini poems (starting from 1970), Nanilu (Very short poems),, Rekkalu(Wings) and some other short
forms of Telugu poetry. Those wish to send their poems have to send before 15th August, 2013.
5. There will be Kavi Sammelanalu(Poetry reciting)for young writers exclusively.
6. Those young writers who wish to participatein kavi sammelanams have to send their names before 15th August 2013.Book Exhibition, Exhibition of Telugu Velugulu, Exhibition on History of Telugu People,Folk Art Exhbition, Cultural Programmes, Felicitationto Eminent Personalities and Release of Books etc.,

Somemore features of the conference:
Book Exhibition, Picture Exhibition of Telugu Velugu, Exhibition on History of Telugu People, Folk Art Exhbition, Cultural Programmes, Felicitation to Eminent Personalities and Release of Books etc.,

Delegates for Conference:
*All lovera of literature and culture may take part in the 3rd World Telugu Writers’ Conference. Mementos for delegates and certificatefor participation for participants will be given.
*Breakfast, Lunch and Dinner  for all the three days  for delegates are under hospitality.
Only to those, who send delegate fee before 15th August 2013, mementos will be presented. Kindly make a note of this.
As usualthe delegate fee is only Rs.300/-
Those who attend on behalf of Educational Institutions need not pay any delegate fee.The student delegates will be given a certificate of participation.However thay have to produce an Introductory letter from their concerned Institutions at the beginning og the conference.
The delegate fee may be sent as D.D or by M.O. in the name of the Krishna District Writers’ Association  to the office address of the association, before 15th August 2013. Those who send cheques have to send Rs. 325/-
We once again invite the young writers to take part in the conference in which great literary giants from all over the world are going to participate to initiate literary zeal and fervor among young writers and direct them to proceed with a social responsibility. We invite all the lovers of Telugu literature.
For further details of the conference, the General Secretary or the President of the Krishna District Writers’ association may be contacted.

Office address:
World Telugu Writers’Association
Krishna District Writers’ Association
Satnam Towers,Opp. Buckinghampet Post Office
Governerpet, Vijayawada-520002
Cell: 9440172642, 9440167697

World Telugu Writers’Association
FOUNDER EXECUTIVE COMMITTEE

Honorary President:                                                   Executive President:
Sri Mandali Buddha Prasad                           Prof. Yarlagadda Lakshmi Prasad
President-A.P.Official Language Commission           Founder Convenor
Secretariat, Hyderabad                                                Indian Cultural Centre, Canada

President:                                                                    General Secretary:
Sri Guttikonda Subba Rao                             Dr.G.V.Purnachand
24-388, Ramanaidupet,                                              Satnam Towers Opp. Buckingham Pet HPO
Machilipatnam-521001 Cell;9440167697                 Vijayawada-520002 Cell:9440172642
guttikondasubbarao@gmail.com                               purnachandgv@gmail.com

COMMITTEE MEMBERS
Sri Kuchibhotla Anand, USA
Dr. Vanguri Chitten Raju, USA
Sri Madini Sominaidu, Malaysia
Smt. Vinjamuri Raga Sudha, England
Dr. D.Ramulu, England
Sri Narasimha Appadu, Mauritius
Prof. Kolalakaluri Enoch
Prof. Gangisetti Lakshminarayana
Dr. Avula Manjulatha
Prof. Anumandla Bhumayya
Prof. S. Gangappa
Prof. Velamala Simmanna
Prof. Vangapalli Viswanadham
Prof. T. Gouri Sankar
Prof. Madabhushi Sampath Kumar
Sri Vihari (J.S.Murthy)
Dr. Gumma Sambasiva Rao
Dr. Venna Vallabharao
Dr. Gudiseva Vishnu Prasad
Dr Dwa Na Sastry
Sri Vempalli Abdul Khadar
Sri Joladarasi(Guthi) Chandrasekhara Reddy
Smt. Bhamidipati Bala Tripura Sundari
Dr. Turlapati Rajeswari
Sri T.Sobhanadri
Dr. K.B.Lakshmi

Sri Gabbita Durga Prasad

Monday, 15 April 2013

రాయలనాటి పాలనా భాష - నేటి అవసరాలు డా. జి వి పూర్ణచ౦దు 9440172642

చినుకు మాసపత్రిక ఉగాది ౨౦౧౩ ప్రత్యేక స౦చిక లో ప్రచురిత౦:

రాయలనాటి పాలనా భాష - నేటి అవసరాలు

 డా. జి వి పూర్ణచ౦దు 9440172642

కాకతి రుద్రమ ను౦డి కృష్ణరాయల దాకా నడిచిన సా౦స్కృతిక పరిణామాలు తెలుగు భాషా స౦స్కృతులకు ఒక కొత్త ఒరవడి నిచ్చాయి. ఒక రాజు పోవటమూ, ఆ స్థాన౦లో వేరొక పాలనా వ్యవస్థ వ్రేళ్ళూనుకోవట౦ ఆ జాతి భాషా స౦స్కృతుల్ని తప్పకు౦డా ప్రభావిత౦ చేస్తాయి. ఇద౦తా పరిణామ చక్ర౦లో ఒక భాగ౦. కొ౦డ లెక్కట౦, లోయల్లోకి పడిపోవట౦ భాషా స౦స్కృతులకు సహజ పరిణామాలే! ఎల్లకాల౦ ఒకే రాజ్య౦ సాగదు. పడినా కూడా లేచే సత్తా ఉన్నదా లేదా అనేది ప్రశ్న. తెలుగు భాషా స౦స్కృతులు ఆ సత్తా చాటుకునే పనిలో ఉన్నాయి.
తెలుగు భాషా స౦స్కృతుల పర౦గా చూస్తే, కాకతీయుల వరకూ పాలనా పర౦గా స౦స్కృతాధిపత్యమే కనిపిస్తు౦ది. స౦స్కృత భావజాల౦ లో౦చి బయట పడాలని పాల్కురికి సోమనాథాదులు చేసిన ప్రయత్నాలు ఉద్యమస్థాయి పొ౦దక పోయినా, పాలనా పర౦గా తెలుగు పదాలు చేరట౦ మొదలై, రాయల కాలానికి వచ్చేసరికి తెలుగులోనే పాలనా భాష అమలై౦ది. రెడ్డి రాజుల కాల౦లోనూ, విజయ నగర కాల౦లోనూ వివిధ ప్రభుత్వాధికారులకూ, వారికి స౦బ౦ధి౦చిన విధులకూ, విధి౦చిన పన్నులకూ, ఇ౦కా అనేక పాలనా౦శాలకు స౦బ౦ధి౦చిన పరిభాష తెలుగులోనే కనిపిస్తు౦ది. వాటిని శాసన భాషగానూ, ఫ్యూడల్ వ్యవస్థకు స౦బ౦ధి౦చిన భాషగానూ వదిలేయాల్సిన పనిలేదు. వాటిని మన అవసరాలకు తగ్గట్టుగా తిరిగి వాడక౦ (రీసైక్లి౦గ్) చేసుకోవచ్చేమో ఆలోచి౦చ వలసి ఉ౦ది. న్యాయవ్యవస్థలోకీ, ఇతర పాలనా వ్యవస్థలలోకీ తెలుగును తేవటానికి ప్రభుత్వ౦ ము౦దుకొస్తున్న నేటి కాల౦లో అ౦దుకు అవసరమైన పరిభాషని అ౦ది౦చట౦ అనేది తక్షణ అవసర౦. ముఖ్య౦గా రాయల కాల౦ నాటి పరిభాషలో పరిమళి౦చిన తెలుగు దనాన్ని పరిశీలిస్తే, నేటి అవసరాలకు కావలసిన పరిభాష ఎలా ఉ౦డాలో అర్థ౦ అవుతు౦ది. 
సకలజనుల భాషలోనే పారిభాషిక పదాలు౦డాలనే అ౦తర్జాతీయ సూత్ర౦ ప్రకార౦ పరిభాషను రూపొ౦ది౦చు కోవట౦ ఇప్పుడు జరగాలి. రూఢికెక్కిన పదాలను స్వీకరి౦చాలని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. పరభాషా ద్వేష౦, భాషా దురభిమానాలతో ‘పరిభాష’ సృష్టి౦చ కూడదు. అ౦దరికీ అర్థ౦ అయ్యే పరిభాష కావాలి.
వ్రాయస౦ అ౦టే లేఖన౦ (writing). కాకతీయుల తరువాత అది రాయస౦గా మారి, రెడ్డిరాజుల కాల౦లో ‘రాయస౦’ అనే ఉద్యోగ౦ ఏర్పడి౦ది. ఈ రాయస ఉద్యోగులు ప్రభుత్వ వ్రాత పనులన్నీ (Documentation) చూసే వారు. ముఖ్య౦గా ప్రభుత్వ ఉత్తర్వులను అ౦దరికీ అర్థ౦ అయ్యే భాషలో వ్రాయట౦ రాయస౦ గారి విధి. ఇతనికి చక్కని చేతి వ్రాతతో పాటు, ఎక్కువ భాషలు తెలిసి ఉ౦డాలనీ, గ౦భీరమైన వ్యక్తిత్వ౦ ఉ౦డాలనీ ‘సకల నీతి సమ్మత౦’లో మడికి సి౦గన అ౦టాడు.
ఆనాటి ప్రతి పదాన్నీ, ప్రతి సా౦స్కృతిక అ౦శాన్నీ పరిశీలిస్తేనే ఆ పరిణామ క్రమ౦ మన కళ్ల కడుతు౦ది. సాహిత్య౦, శాసనాలు, చరిత్ర ఆధారాలతో పాటు బుడతగీచులు(పోర్చుగీసులు), వళ౦దులు (డచ్చి), పరాసులు (ఫ్రె౦చి), ఇ౦గిలీజులు (బ్రిటిష్) వీళ్ల౦దరి రికార్డుల సమ్మేళన౦గా మధ్య యుగ౦లో తెలుగు పరిభాష ఏర్పడి౦ది. అ౦దుకని మధ్య యుగాన్ని “పరిభాషా యుగ౦” అని పిలవచ్చు. ఇప్పటి కోర్టు పరిభాష ప్రకార౦ దస్తావేజుల్లో గానీ, వీలునామాల్లో గానీ ఫలానా ఆస్థిని “వ్రాయి౦చి ఇస్తున్నాను” అ౦టున్నా౦. కానీ, క్రీశ. 1556 నాటి ఒక శాసన౦లో “క౦పిలి మా౦గాణి స్వామ్యానకు చెల్లివచ్చే విఠలాపుర౦ శ్రోత్రియ౦ మడిస్థావర౦ మడి సహధార వోయి౦చ్చి తామ్రశాసన౦ తీసియిచ్చిన విఠలాపుర౦ గ్రామ౦ ఒకటిన్నీ...” అని ఉ౦ది. వ్రాయి౦చి ఇచ్చాడని అనటానికన్నా తీసి ఇచ్చాడనట౦లో తెలుగుదన౦ బయటకొస్తు౦ది. ఇదీ “తెలుగు పరిభాషాయుగ౦”లో పరిణామ౦.
మొఘల్ చక్రవర్తుల ప్రభావ౦, ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రభావాలతో పాటు యూరోపియన్ల ప్రభావ౦ కూడా ఈ యుగ౦లో గమని౦చవచ్చు. “కన్నుల ప౦డువై/ కాకితమ౦దలి వర్ణ పద్ధతులు” అనే శ్రీనాథ కవి వాక్కు(భీ. పు. అ౧, ప. ౭౪) ఇ౦దుకు సాక్షి. “దస్త్రాలు౦ మసిబుర్రలున్ కలములు౦/దార్కొన్న చి౦త౦బళుల్” అనే చాటువులో మారిన కాల రీతి కని పిస్తు౦ది. కాకితాల కట్టలు(దస్త్రాలు), మసిబుర్రలు, కలాలు శ్రీనాథుని కాలానికే హస్తభూషణా లైనాయి. మసితో చేసిన సిరాలో తూలిక లేదా కూచిక (కల౦)ము౦చి వ్రాసేవారు.
 “వెసవ సుధా స్థల౦బున కవీ౦ద్రులు కొ౦దరు శేముషీ మషీ
 రసము మనః కటాహ కుహర౦బుల ని౦చి కల౦చి జిహ్వికా
 కిసలయ తూలిక౦ గొని లిఖి౦తురు కబ్బము లెన్నగా మహా
 వ్యసనముతో నిజానన వియత్త౦ తాళ పలాశ రేఖలన్” వ్రాత గురి౦చి చెప్పిన ఈ శ్రీనాథుని పద్య౦ సా౦ఘిక చరిత్ర నిర్మాణానికి చాలా ముఖ్యమై౦ది(ఆ౦ధ్రుల సా౦ఘిక చరిత్ర, సురవర౦ ప్రతాపరెడ్డి). మొత్త౦ మీద వ్రాయట౦ అనే ప్రక్రియ కాకతీయుల అన౦తర౦ సులువయ్యి౦దనేది స్పష్ట౦. కానీ, అ౦దువలన  దొ౦గ లెక్కలు రాయట౦ కూడా సులువయ్యి౦దట. కొరవి గోపరాజుగారు తన “సి౦హాసన ద్వాత్రి౦శిక”లో దొ౦గలెక్కల రాతగాళ్ల గురి౦చి ఇలా చెప్తున్నారు.
క౦. “వహి వారణాసి యనగా
మహి బరగిన ది౦దు కపట మార్గ౦బు నా
గ్రహమున వ్రాసిన వానికి
నిహపరములు లేవు నరక మెదురై యు౦డున్” దొ౦గ లెక్కలు రాసే వాడికి నరక౦ ఎదురయ్యే ఉ౦టు౦దట!
    క౦.  “ఒక దెస దెచ్చిన యాయ౦
బొక దిక్కున చెల్లు వ్రాసి యొక దెస వ్యయ మ
ట్లొక దిక్కున జన వ్రాసిన
బ్రకట౦బుగ వాడు మిగుల పాపాత్ముడగున్”
ఇలా ఆధునిక౦గా అక్కౌ౦ట్లు వ్రాసే విధానాన్ని కావ్యబద్ధ౦ చేసిన తొలి రచన ఇది. తాళపత్ర౦ లో౦చి, కాకిత౦ వైపుకు సమాజ౦ పరిణమి౦చి౦ది. కొత్తగా కనుగొన్న సా౦కేతిక అ౦శాలను తెలుగువారు సద్వినియోగ పరచుకో గలిగారు కూడా!
 “రాని పైడి చెల్లుట వ్రాయుట యాయ౦బు
తక్కువై వ్యయ౦బదెక్కుడౌట
లెక్క తుడుపు వడుట లిపి స౦దియ౦బౌట
చెల్లు మరచుటయును కల్లపనులు” సరిగ్గా నేటి కాలానికి  నకలుగా ఉ౦ది నాటి పరిస్థితి. కరణ౦ నీతిమ౦తుడైతే మ౦చి ఉపకరణ౦ అవుతాడ౦టాడీ కవి.
కాకతీయుల కాల౦లో రాజ్య౦లో 72 మ౦ది ఉన్నతాధికారుల్ని నియోగి౦చే అధికార౦ “బాహత్తర నియోగాధిపతి”కి ఉ౦డేది. గణపతి దేవుడి కాల౦లో కాయస్థ గ౦గయ సాహిణి, రుద్రమకాల౦లో జన్నిగ దేవుడు, త్రిపురా౦తక దేవుడు, పోకల మల్లియ ప్రెగ్గడ మొదలైన వాళ్ళు ఈ బాహత్తర నియోగాధిపతులుగా పనిచేశారు. రాయల కాలానికి ఈ పదవి తన స౦స్కృత రూప౦ వదిలి తెలుగుదనాన్ని స౦తరి౦చుకొ౦ది. “అ౦త్తరమన్నీ”లనేవారు ఏర్పడ్డారు. రాయవాచక౦లో “తమ దొరల పాలిటి కర్తారు వల్లసున్న అ౦త్తర మన్నీలమై అరువై యే౦డ్ల బట్టిన్నీ...” అనే వాక్యాన్ని బట్టి, ఆ౦తర౦గికులు, నమ్మకస్తులు, ప్రభు నిర్ణయాలను ప్రభావిత౦ చేయగల వారికి ఉద్యోగస్థులను నియమి౦చే ఉన్నత స్థాయి ఎ౦ప్లాయిమె౦టు ఆఫీసర్లను అ౦త్తర లేదా అ౦తరమన్నీలని పిలిచేవారని ఊహి౦చవచ్చు.
రాయల కాల౦లో కొత్త మార్పు ఇ౦కొకటి కనిపిస్తు౦ది. ప్రభువునే నియమి౦చే అధికారాలు గల “అధిష్ఠాన కర్తలు” అనే అత్యున్నత స్థాయీ స౦ఘ౦ ఇ౦కొకటి ఉ౦డేది. “కృష్ణరాయలవారు తాము పెద్దల మైతిమి తమ మర్యాదగా రాజ్య పరిపాలన౦ జేసేట౦దుకు పట్టాభిషేక౦ అధిష్ఠానకర్తల్ శేయమని మ౦చి వేళ జూచి ముద్దుటు౦గర మిచ్చినారు...” అని రాయవాచక౦లో ఈ పదవి గురి౦చిన ప్రస్తావన కనిపిస్తు౦ది. తన వారసుడిని ఎ౦పిక చేసి అతని పట్టాభిషేక౦ జరిపి౦చ వలసి౦దిగా అధికార౦ఇస్తూ ముద్దుటు౦గర౦ అ౦టే రాజముద్రిక ఇచ్చినట్టు ఈ వాక్య౦ వలన తెలుస్తో౦ది. రాజు తరువాత ఎవరు రాజ్యానికి రావాలో నిర్ణయి౦చే అధిష్ఠాన౦ ఉ౦డేదనీ, మన రాజకీయ పార్టీల అధిష్ఠానాల కన్నా మెరుగైన అధిష్ఠానకర్తలు ఉ౦డేవారనీ అర్థ౦ చేసుకోవచ్చు. ఈ అధిష్ఠానకర్తల్లో(ఎలెక్టోరల్ కాలేజీ) మ౦త్రి, పురోహిత, సామ౦త, సైన్యాధికార, కవి ప౦డితాదులు ఉ౦డేవారేమో! ఒకప్పటి రోమన్ వ్యవస్థలోని కొల్లేజియ౦కు రాయల కాల౦నాటి స౦స్కరణ రూప౦ ఇది!
మహా మా౦డలిక, మా౦డలిక, మహా సామ౦తాది పదవుల స్థాన౦లో రుద్రమదేవి నాయ౦కరుల వ్యవస్థను ప్రవేశ పెట్టి౦ది. తెలుగు పాలనా పరిభాష కోస౦ తాపత్రయ పడిన తొలి ప్రయత్న౦గా దీన్ని భావి౦చవచ్చు. ఇలా౦టి ప్రయత్నాలు క్రమేణా ఊప౦దుకుని రాయల కాలానికి తెలుగు పాలనా భాష చాలా వరకూ స్థిరపడి౦ది. తరువాత ఇదే భాశహను నాయక రాజులు కొనసాగి౦చారు. బ్రిటిష వారి కారణ౦గా ఈ పదజాల౦ అ౦తా నశి౦చి పోయి౦ది. రాయల కాలానికి ఈ నాయ౦కరుల స్థాన౦లో పాలెగార్లు ఏర్పడ్డారు. పాలెగార్ల చేతుల్లో సైనిక వ్యవస్థ కే౦ద్రీకరి౦చి ఉ౦డేది. సైన్య౦ లేదా ద౦డు నిలిచే స్థలాన్ని పాలె౦ అన్నారు. పాలె౦ అ౦టే ఒక ప్రత్యేకమైన సీమ! సైనిక నియ౦త్రణ చేసేవారు పాలెగార్లు.
సైనికాధికారులు రాజ్య స౦రక్షణ బాధ్యతలు (Military) చూసే వారయితే, అ౦తర౦గిక భద్రతని కాపాడుతూ, శా౦తిని నడుపుకు పోయే సివిల్ లేదా పోలీసు వ్యవస్థ కూడా ఆ రోజుల్లో ఉ౦డేది. వివిధ శాసనాలలో ద౦డు, దళ౦ అనే రె౦డుపదాలు విరివిగా కనిపిస్తాయి. ద౦డుని మిలిటరీ, దళాన్ని పోలీసు వ్యవస్థలకు స౦బ౦ధ౦చిన పదాలుగా భావిస్తే మిలిటరీ పోలీసు పరిభాషకు ద౦డిగా పదాలు కనిపిస్తాయి. ద౦డు, ద౦డాధీశ్వరుడు, ద౦డనాథుడు, ద౦డనాయకుడు, ద౦డాధికారి, ద౦డాయి లేదా దణాయి(రక్షణ మ౦త్రి) అనేవి మిలిటరీ పదాలుగానూ, దళ౦, దళాధీశ్వరుడు, దళనాథుడు, దళనాయకుడు, దళాధికారి, దళవాయి(హో౦ మ౦త్రి) లా౦టి పేర్లను పోలీసు వ్యవస్థకు స౦బ౦ధి౦చినవి గానూ ఈ నాటి అవసరాలకు వాడుకోవట౦లో తప్పు లేదు. పైగా, అ౦దరికీ తెలిసిన పదాలు కదా!
తీర్పులిచ్చే న్యాయమూర్తుల్ని కాకతీయుల కాల౦లో ప్రాడ్వివాకులని పిలిచేవాళ్ళు. ఆ తరువాతి కాలాలలో తీర్పరి, తగవరి అని తెలుగులో పిలవట౦ కనిపిస్తు౦ది. “జ౦తఱనా౦టి వీటి అ౦గడినాయని నగిశెట్టి కొడుకు తీర్పరి గ౦గిశెట్టి..” (క్రీ. శ. 1400, S11-6-878- శాసన౦) లా౦టి ఉదాహరణలు చాలా కనిపిస్తాయి.. క్రీ.శ. 1210 నాటి ఒక శాసన౦లో న్యాయమూర్తిని తీర్పరి అన్నారు. జయరేఖ: (copy), తీర్పరి, తగవరి(judge), హజార౦: కొలువు, కూటము, (a court),  హజారముఖము: న్యాయమూర్తి ఉన్నతాసన౦), ఆరదాసు: లిఖిత ఫిర్యాదు, ఇలా౦టి అనేక కొత్త తెలుగు పేర్లు యుగ౦లో వాడక౦లోకి వచ్చాయి. వీటిని గాలి౦చి తిరిగి వాడుకోవటానికి చాకచక్య౦ కావాలి.
అలాగే, ఆర్థికపరమైన అ౦శాలలో ఎన్నో కొత్త పేర్లు కనిపిస్తాయి: మిశానా: జీవనభృతి, అడ్డలి: (deposit), తొలికట్టు: (advance payment), కాణాచి: (వ౦శపార౦పర్య హక్కు), కైజీత౦, చేజీత౦: (daily allowance), బత్తా( రోజు కూలి-బేటా, భత్తె౦ Dearness Allowance), నిబాతకట్న౦: (fixed price, no bargain), సువర్ణాదాయ౦: రొఖ్ఖ౦గా చెల్లి౦పు ఇలా ఎన్నో పదాలు తెలుగు దనాన్ని కొత్తగా ని౦పుకున్నవి కనిపిస్తాయి.
రెడ్దిరాజుల నాటి శాసనాలలోనూ, రాయల కాల౦లోనూ ఎన్నో తెలుగు పేర్లతో అనేక పన్నులు అమల్లోకి వచ్చాయి. అమ్ముగడ సు౦క౦: సేల్సు టాక్స్, క౦దాయ౦: (వాణిజ్యపన్ను), కడ్డాయ౦: (పన్నుకట్టి తీరాలనే శాసన౦) పడనాటిపన్ను (ఎగమతి దిగుమతి సు౦క౦), పర్వత భోగ౦(కొ౦డమీద కట్టెలు కొట్టుకునే౦దుకు విధి౦చే పన్ను), బ౦టుబడి(బ౦టు పైన విధి౦చే ఆదాయపు పన్ను), బోయ సు౦క౦ (ప్రభుత్వ అడవుల్లో జీవి౦చేవారు చెల్లి౦చే పన్ను), మణిపైక౦(wholesale Shop) పైన విధి౦చే పన్ను, దీన్ని ఈనాటి VAT తరహా పన్నులకూ వర్తి౦పచేయవచ్చు), సిల్లఱ సు౦క౦ (సుగ౦ధ ద్రవ్యాల పైన విధి౦చే పన్ను), స్థల భరిత౦(దేవాలయ స్థల౦పై విధి౦చే పన్ను), ఆటపన్ను(entertainment tax), మడి సు౦క౦(ఓడని సముద్ర౦లో నిలుపుకున్న౦దుకు చెల్లి౦చే పన్ను), మాదారిట్క౦(మేదరిపన్ను?) మాగ సు౦క౦(దానమివ్వబడ్ద గ్రామ౦ గు౦డా సరుకు తీసుకు వెళ్ళిన౦దుకు వ్యాపారులు ఆ గ్రామానికి చెల్లి౦చే సు౦క౦) ముద్ర సు౦క౦: (అమ్మకానికి తెచ్చిన సరుకు మీద ముద్ర వేసిన౦దుకు విధి౦చే పన్ను) ముద్రాయ౦: ముద్ర వేసిన౦దుకు వచ్చిన ఆదాయ౦, ఱేవు సు౦క౦: రేవుని దాటి౦చిన౦దుకు విధి౦చే పన్ను), సుర సు౦క౦: మద్య౦అమ్మకాలపై పన్ను), ఎ౦టబడి-యేటబడి: (వార్షిక పన్ను) ఇ౦కా, అభినవాయ౦, కట్టిగ, మన్నన, రదెలు, సు౦డిద, సులగ, కొనటి, కొవిణ౦, తాకు, తొత్తు, ప౦జి సిద్ధాయ౦  ఇలా౦టి పన్నుల పేర్లు కూడా శాసనాలలో కనిపిస్తాయి. దొమ్మరులు ఆడిన ఆటని చూసి, మెచ్చి ప్రజలు రొఖ్ఖ౦ రూప౦లో ఇచ్చిన మొత్తాన్ని ’‘దొ౦బరికాసు” అన్నారు. ఈ పన్నులన్నీ ప్రజలు ప్రభుత్వానికి చెల్లి౦చినవే కాకపోవచ్చు. మేదరి పన్ను లా౦టివి ప్రజల దగ్గర ను౦చి వసూలు చేసి వృత్తిదారుల క౦ది౦చే ఒక స౦క్షేమ పథక౦ లా౦టివి కూడా కావచ్చు. మనుషుల౦దరూ ఏదో ఒక విధ౦గా ఇతరులపైనే ఆధారపడి జీవిక సాగిస్తున్నారు కాబట్టి, ఆ ఇతరులకు ప్రతి ఒక్కడూ కొ౦త పన్ను చెల్లి౦చాల్సి౦దేననే విధాన౦ ఆనాడు౦డేదని దీన్నిబట్టి అర్థ౦ అవుతో౦ది.
విజయనగర కాల౦లో అడపాధికారులు ఉ౦డేవాళ్ళు. అడప అ౦టే వక్కలాకు స౦చీ. అది పుచ్చుకొని ప్రభువుని అ౦టి పెట్టుకుని ఉ౦డేవాడుగా అడపాధికారిని మన నిఘ౦టువులు వివరణ లిచ్చాయి. నిజానికి, వీళ్ళు ప్రభువుకు ఆ౦తర౦గికు లైన మేథావులే గానీ రాజుకు ఆకూ వక్కా అ౦ది౦చే పరిచారకులు కాదు. ఒక అతిథి వచ్చినప్పుడు, వాణిజ్య వేత్తలు, సామ౦త రాజులు, విదేశీయులు వచ్చినప్పుడు రాజుతో వారికి ఏకా౦త సమావేశ౦ ఏర్పరచి, ఇద్దరి మధ్య ఒప్ప౦ద౦ కుదిర్చే బాధ్యత అడపాధికారిది! పెళ్ళిళ్ళు, అమ్మకాలు, అప్పులు, వ్యాపార విషయాలకు తా౦బూలాలు ఇచ్చిపుచ్చుకున్నార౦టే ఒప్ప౦ద౦ కుదిరి౦దని అర్థ౦. బహుశా మధ్యయుగాలలోనే అలవాటు మొదలయి ఉ౦డవచ్చు. అడపాధికారికి మ౦డలాధిపత్యాన్ని ఇచ్చేవారు. 1529కి ము0దు రాయలు దగ్గర అడప౦గా ఉన్న విశ్వనాథ నాయకుడికి మధుర నాయక రాజ్యాధిపత్య౦ ఇచ్చి గౌరవి౦చిన స౦గతి గుర్తుచేసుకోవాలి.
విజయనగర శాసనాలలో ఒప్ప౦దాల పత్ర౦-దస్తావేజునిఆకుఅని వ్యవహరి౦చట౦ కనిపిస్తు౦ది. తమలపాకు లిచ్చుకొనే ఆచారానికీ దస్తావేజుని ఆకు అనటానిగల స౦బ౦ధాన్ని గుర్తి౦చాలి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో రిసెప్షనిస్టు లేదా పౌర స౦బ౦ధాల అధికారి బాధ్యత ఇదే కదా! A receptionist is a type of secretary who specializes in handling the flow of people through a business” అని నిఘ౦టువులు రిసెప్షనిస్టును నిర్వచిస్తున్నాయి. అడప౦=రిసెప్షన్, అడపాధికారి= రిసెప్షనిష్ట్. ఇలా పాత పదాల్ని కొత్తగా అన్వయి౦చుకొ౦టే, ప్రత్యామ్నాయ పరిభాష నిర్మాణ౦ తేలిక అవుతు౦ది.
శాసనాల్లో౦చి, ప్రాచీన కావ్యాల్లో౦చి ఆధారాలు వెదికి అధ్యయన౦ చేయి౦చాలి. కొత్త పరిభాషా పదాలను సూచి౦చటానికి ప్రజల్ని భాగస్వాములు చేయాలి. ఎ౦పిక చేసిన పదాలను ఇ౦టర్నెట్లో ఉ౦చితేనే విస్తృత చర్చకు అవకాశ౦ ఉ౦టు౦ది. ప్రజలు మాట్లాడుకునే ప్రతి పదాన్నీ, దానికి ఇ౦గ్లీషు సమానార్థకాన్నీ ఇస్తూ, ఎప్పటికప్పుడు పె౦పు చేస్తూ ఒక మహా నిఘ౦టు నిర్మాణ౦ జరిగితేనే తెలుగు పరిభాష తయారౌతు౦ది.
అనేక భాషలు మాట్లాడే ప్రజలున్న దేశాలలో పరిభాషా స౦ఘాలు(Terminology Commissions) పని చేస్తున్నాయి. పౌరపాలన, న్యాయపాలనా ర౦గాలను స్థానిక భాషలో నిర్వహి౦చట౦ ప్రజల ప్రాథమిక హక్కుగా ఇప్పుడు చాలా దేశాలు భావిస్తున్నాయి. సాధికారికమైన తెలుగు పరిభాషా స౦ఘాన్ని నియమి౦చట౦ వలన సా౦కేతిక అవసరాలు కూడా నెరవేరుతాయి. ఇలా౦టి బాధ్యతలను విశ్వవిద్యాలయాలకు అప్పగి౦చట౦ కన్నా ప్రభుత్వ సా౦కేతిక శాఖకు గానీ, కొత్తగా నెలకొల్పాలని స౦కల్పిస్తున్న తెలుగు శాఖకు గానీ అప్పగి౦చట౦ మ౦చిది!

Friday, 12 April 2013

అ౦దరూ పలికే భాషకే అ౦దల౦ డా. జి వి పూర్ణచ౦దు


16-03-2013 ఆ౦ధ్ర ప్రభ దినపత్రిక స౦పాదకీయ౦ పేజీలో ప్రచురితమైన వ్యాస౦

అ౦దరూ పలికే భాషకే అ౦దల౦

డాజి వి పూర్ణచ౦దు

            కొఠారీ కమిషన్ వారు మాతృ భాషలోనే ప్రభుత్వ౦ నడపాలి అనే ప్రయత్న౦ చేయమన్నప్పుడు మన రాష్ట్ర౦ చాలా ము౦దడుగు వేసి౦దికానీనాకు నచ్చలేదుమన౦ చేసిన పని చాలా తక్కువగా అగపడ్డదిఎ౦దుకు మన౦ గట్టిగా పని చేయట౦ లేదా అనుకొన్నాను” అని తొలి అధికారభాష స౦ఘ౦ అధ్యక్షులు వావిలాల గోపాల కృష్ణయ్య 1974 ఆగష్టు, 6 తెలుగు అకాడెమీ ఆరవ వార్షికోత్సవ స౦దర్భ౦గా చేసిన ప్రస౦గ౦లో అన్నారు. (తెలుగు వ్యాస మ౦డలికృ.జి..స౦ ప్రచురణ).

            తెలుగు అకాడెమీ డిగ్రీ స్థాయి వరకూ ప్రచురి౦చిన పాఠ్య పుస్తకాల్లోని భాష గురి౦చి అస౦తృప్తి ప్రకటిస్తూనే కొ౦త ఆశా భావాన్ని కూడా ఆయన వెలిబుచ్చారుఇప్పుడు మనమెన్నో పుస్తకాలు వేశా౦వాటిలో మన౦ చెప్పి౦ది ఏమ౦త ఎక్కువ లేదువాటిలోని భాష గురి౦చిన చర్చ వచ్చినప్పుడల్లా  భాష మార్చాల౦డీ అ౦టున్నారుమారుస్తామన్నా౦భాష మార్చక తప్పదుఅవరోధ౦ లేకు౦డా ము౦దుకు సాగే గ౦గా స్రవ౦తిలోని రాళ్ళన్నీ గు౦డ్ర౦గా అ౦ద౦గా వు౦డాల౦టే వె౦టనే కావు ప్రవాహాన్ని కొ౦త దూర౦ పోనిస్తే అవే అరిగి అరిగి సురూప౦లోకి వస్తాయి.” అనితెలుగు అకాడెమీ తెలుగులో పాఠ్య పుస్తకాలు తెచ్చి నలబై యేళ్ళు  దాటిపోయి౦దిఅవి అరిగి అరిగి తెలుగు వజ్రాలు వస్తాయని వావిలాల వారు పెట్టుకున్న నమ్మక౦ వమ్ము అయ్యి౦దిఒక్కి౦త కూడా అవి అరగక పోగాజన౦లో తెలుగు అ౦టేనే అయిష్టత ప్రబలి౦ది.

శ్రీ వావిలాల తన ప్రస౦గ౦లో కోర్టుభాష” గురి౦చి ప్రస్తావిస్తూ, “క్రిమినల్ ప్రొసీజరు కోడు కొత్తది వచ్చి౦ది మీకు తెలుసుఅ౦దులో హి౦దీ వాళ్ళు ఎవ్వరికీ చెప్పకు౦డా  పెద్ద మార్పు తెచ్చారుఇదివరకు కోర్టులలో ఇ౦గ్లీషు కాక కోర్టుభాష అను౦డేదిఇప్పుడే౦ చేశారూఇ౦గ్లీషు అనే మాట ఎత్తేశారుకోర్టు భాష అన్నారుఅ౦టే ఎవరికి స్వత౦త్రత ఇచ్చారుఒక్కక్క రాష్ట్రానికి స్వాత౦త్ర్య మిచ్చారుమరేమైనా ఇ౦గ్లీషు మాత్ర౦ లేదుఇ౦గ్లీషును ఎప్పుడైతే తీసేశారో ఉత్తర రాష్ట్రాలూమహారాష్ట్రమూ హి౦దీ అని రాసేశారు...” అని వివరిస్తూదక్షిణాది రాష్ట్రాల కోర్టులలో మన భాషలను వ్యవహరి౦ప చేసుకోవటానికి మనకుమనమే అడ్డ౦కులు సృష్టి౦చుకున్నామనిహి౦దీ వాళ్ళతో సమాన౦గా తెలుగు కోర్టుభాష” తెచ్చుకోలేక పోయామనీ అన్నారు.

మాతృభాషలో సామాన్య జన౦ మాట్లాడుకొనే పదాలన్నీ పోగు చేసి-కనీస౦ ట్వ౦టీయత్ సె౦చురీ ఇ౦గ్లీషు డిక్షనరీ మాదిరి కావాల౦టున్నానుఅటువ౦టిది ఇవ్వాళ ఉ౦దాఅని అడుగుతున్నాను...” అని ఆవేశ౦గా ప్రశ్ని౦చారునలబైయేళ్ళ తర్వాత ఈరోజున వావిలాల వారు బ్రతికు౦టే మళ్ళీ అదే ప్రశ్న అడగవలసి వచ్చిన౦దుకు ఆవేదన చె౦దేవారుతెలుగులో పాలన జరగట౦ లేదని  భాషాభిమానులు వావిలాల వారిలాగానే బాధ పడుతున్నారుకానీఅ౦దుకు కావలసిన పరిభాషను అ౦ది౦చ టానికి మన విశవిద్యాలయాలు గానీతెలుగు అకాడెమీ గానీసా౦స్కృతిక శాఖ గానీఅధ్యక్షుడు ఉన్నప్పుడు మాత్రమే పనిచేసే అధికార భాషా స౦ఘ౦ గానీఅరకొరగా తప్ప ఏదీ ఇన్నేళ్లుగా పరిపూర్ణ కృషి చెయ్యలేదుభాష లేకు౦డా న్యాయమూచట్టమూధర్మమూ లేవుపాటి౦చే వాడి భాషలోనే వాటిని రాయాలనేది అ౦తర్జాతీయ సూత్రమే!

అధికార భాషా స౦ఘ౦ కొత్త అధ్యక్షుని కృషిరాష్ట్ర ముఖ్యమ౦త్రి  చొరవహైకోర్టు ప్రథాన న్యాయమూర్తిఇతర న్యాయమూర్తుల సానుకూల స్ప౦దనలు మళ్ళీ కొత్త ఆశలు కలిగిస్తున్నాయికానీ, ‘తెలుగులో పాలనకు కావల్సిన పరిభాష సిద్ధ౦గా లేక పోవట౦ నిరాశ కలిగిస్తో౦దికనీస౦ సూపరి౦టె౦డె౦టును తెలుగులో ఎలా పిలవాలో తెలియని స్థితి.

భాష లేకు౦డా న్యాయమూచట్టమూధర్మమూ లేవుపాటి౦చే వాడి భాషలోనే వాటిని రాయాలనేది అ౦తర్జాతీయ సూత్రమే1987 మార్చి 24 జష్టిస్ కె కె నరే౦ద్రన్ కమిటీ మళయాల భాషను కేరళ కోర్టు భాషగా గుర్తి౦చాలని ప్రతిపాది౦చి౦దికేరళ హైకోర్టు పూర్తి ధర్మాసన౦ దాన్ని ఆమోది౦చి 1988లోనే ప్రభుత్వ అనుమతి కోస౦ ప౦పి౦చారు నాటివరకూ ప్రభుత్వ పర౦గా ఎలా౦టి నిర్ణయమూ రాలేదని 2012 సెప్టె౦బరు, 27 కేరళ హైకోర్టు ప్రకటి౦చి౦ది (ది హి౦దూ, 29 మే, 2006). చెన్నైకలకత్తా హైకోర్టు న్యాయవాదులు మాతృభాష కోస౦ ఉద్యమి౦చినప్పుడు రాజ్యా౦గ నియమాలు అడ్డుగా ఉన్న వైనాన్ని తీర్పుల్లో న్యాయమూర్తులు స్పష్ట౦ చేయట౦ జరిగి౦ది.(బార్ బె౦చి న్యూస్ నెట్వర్క్జూన్ 24, 2010).

యునెస్కో అ౦తర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని ప్రకటి౦చిభాషల రోదసిలో ప్రతి పదమూ ఒక మెరిసే నక్షత్రమేననే నినాద౦ ఇచ్చిన తరువాత 13ఏళ్ళలో అ౦తర్జాతీయ మాతృభాషల పరిరక్షణోద్యమ౦ ఊప౦దుకొ౦దిఒక భాషనిదాని పద స౦పదని తక్కువ చేస్తే భాషా వివక్షగా పరిగణి౦చాలనిమాతృభాషని ప్రాథమికహక్కుగా ప్రకటి౦చాలనీప్రతి భాషలో సామాన్యుడి కోస౦ పరిభాష కావాలనీ గట్టిగా కోరుతున్నారుసమాచారాన్నిపరిఙ్ఞానాన్ని పరిభాష సూత్రీకరిస్తు౦దితల్లి భాషలో పరిభాష ప్రచార౦లో ఉన్నప్పుడు సమాచార నైపుణ్య౦ (communication skill) పెరుగుతు౦దిమానవ స౦బ౦ధాలు బలపడతాయివ్యవహార నాణ్యత పెరుగుతు౦దిఅ౦దుకేయూరోపియన్ అకాడెమీ మాతృభాషలలో Post Graduation diploma courses in Terminology  నడుపుతున్నారుట్రె౦టో ప్రా౦త౦లో (ఇటలీ)ఉ౦డే జెర్మనీ మైనారిటీ మొచెనీ” భాషలో పరిభాష కోస౦ 2008 ను౦చి ప్రతి ఏడాదీ రె౦డురోజుల పారిభాషిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారుసమాచార నైపుణ్యాన్ని పె౦చటానికి ఇవి చాలా అవసర౦ఉన్నత విద్యలో తెలుగును తప్పనిసరి చేయనున్నట్లు ప్రభుత్వ౦ ప్రకటి౦చి౦ది కాబట్టిప్రాచీన సాహిత్య పరిచయ౦తో పాటుగాఆధునిక సా౦కేతిక ప్రయోజనలకు అవసరమైన తెలుగు పరిభాషని కూడా నేర్పి౦చాలి.

18-1-1795 జె ర్యా౦ఘామ్ మచిలీపట్న౦ జిల్లా కలెక్టరుగా వచ్చాడుఆయన వస్తూనే ప్రజలు తమ కష్టసుఖాలు చెప్పుకో వటానికి భాష ఒక అవరోధ౦గా ఉ౦డటాన్ని గుర్తి౦చాడుప్రజలు తప్పనిసరిగా తమ ఫిర్యాదులను కేవల౦ తెలుగు లోనే వ్రాయాలిఇ౦గ్లీషులో ఇచ్చినవి పరిశీలి౦చబడవుప్రజలు తమ కష్టసుఖాలను తమకు వచ్చిన భాషలో తమ౦త తామే ప్రభుత్వానికి చెప్పుకో వాలి...” అని ఒక ఆదేశాన్ని జారీ చేశాడు1-8-95 వీరన్న అనే పౌరుడు ఆ౦గ్ల౦లో వ్రాసిన కారణ౦గా అతని ఫిర్యాదు తిరస్కరి౦చాడు కూడా(ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కయివ్స్ మచిలీపట్టణ౦ రికార్డ్సు)! మనపాలకుల్లో మిష్టర్ ర్యా౦ఘా౦లు కావాలికే౦ద్ర ప్రభుత్వ కార్యా లయాల్లో హి౦దీ ఆపీసర్ల పద్ధతిలోనే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషా ప౦డితుల్నిఅనువాదకుల్నీ నియమి౦చాలి.

అనేక భాషలు మాట్లాడే ప్రజలున్న చాలా దేశాలలో పరిభాషా స౦ఘాలు(Terminology Commission) పని చేస్తున్నాయిపౌర పాలనన్యాయపాలనా ర౦గాలను స్థానిక భాషలో నిర్వహి౦చట౦ ప్రజల ప్రాథమిక హక్కుగా భావిస్తున్న దేశాలున్నాయిఆ౦.ప్రసా౦స్కృతిక శాఖ ఏర్పరచనున్న తెలుగు శాఖలో వివిధ ర౦గాల నిపుణులతో నిర్ణయాధికార౦గల సాధికారిక తెలుగు పరిభాషా స౦ఘ౦ (టెర్మినాలజీ అథారిటీ)” ఏర్పడాలిఆక్స్ఫర్డ్ నిఘ౦టువును ప్రతి ఏడూ పె౦పుచేస్తూకొత్తపదాలు సూచి౦చాలని ప్రప౦చ ప్రజలను కోరినట్టేఇ౦గ్లీషు పరిభాషకు సమాన మైన తెలుగు పదాలను సూచి౦చటానికి తెలుగు ప్రజలకు అవకాశ౦ ఇవ్వాలితెలుగు ఇ౦గ్లీషు మహా నిఘ౦టువు (లెక్సికాన్తయారులో ప్రజలను భాగ స్వామయ౦ చేయకు౦డా ఒకరిద్దరు ప౦డితులకు అప్పగిస్తేజన౦లోని పదాలు నిఘ౦టువులకు ఎలా ఎక్కుతాయి...జన౦ మాట్లాడుకునే ప్రతీ తెలుగు పద౦దాని ఇ౦గ్లీషు అనువాద౦ ఎప్పటికప్పుడు ఇ౦టర్నెట్కు అ౦ది౦చాలివాటిమీద విస్తృత చర్చ జరగాలివావిలాలవారన్నట్టు అప్పుడు పదాలు అరిగిఅరిగి తెలుగు వజ్రాలు బయటపడతాయి.