Tuesday 14 June 2016

Dr. G. V. Purnachand, B.A.M.S.,: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస స...

Dr. G. V. Purnachand, B.A.M.S.,: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస స...: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం 2016 ఆగష్టు 11 నుండీ కృష్ణాపుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు చ...

కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం: డా. జి వి పూర్ణచందు

కృష్ణాపుష్కరాలు-2016
“కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం


2016 ఆగష్టు 11 నుండీ కృష్ణాపుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు చిరస్మరణీయంగా జరగనున్నాయి.
ఈ పుష్కరాల సందర్భంగా ‘కృష్ణాతీరం’ పేరుతో ఒక ఉద్గ్రంథాన్ని ప్రచురించేందుకు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేస్తోంది.
మన భాషా సంస్కృతులు, మన వైఙ్ఞానిక ప్రగతి, మన సామాజిక రాజకీయ పరిణామాల వైనం ఈ నాటి యువతకు, ఈ నాటి యువ పరిశోధకులకు అందించటం లక్ష్యంగా ఈ గ్రంథ ప్రచురణ జరుగుతోంది. పుష్కరాలు పుష్కలం కావడంతో పాటు ఆ ఙ్ఞాపకాలు పది కాలాలపాటు పదిలం అయ్యేలా ఈ ఉద్గ్రంథం రూపొందుతోంది.
సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. డి విజయభాస్కర్ ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రంథ ప్రచురణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, కర్నూలు, మెహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన వివిధ అంశాలపై అపురూప పరిశోధనా వ్యాసాలు ఈ గ్రంథంలో ఉంటాయి. ఆదిమ కాలం నుండీ, నేటి వరకూ కృష్ణాతీరంలో సాగిన జనచైతన్యానికి ఈ ఉద్గ్రంథం అద్దం పట్టేలా ఉండాలని మా ఆకాంక్ష.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలైన ఈ జిల్లాలలో చోటు చేసుకున్న చారిత్రక పరిణామాలు, భాషా సాహిత్యాల ప్రగతి, సాంస్కృతిక రంగ విశేషాలు, విద్య, వైద్య, వైఙ్ఞానిక, సాంకేతిక అంశాలు, వర్తక వాణిజ్యాలు, నీటి పారుదల, వ్యవసాయం, సామాజిక రాజకీయ పరిణామాలకు సంబంధించిన పరిశోధనా వ్యాసాలను ఈ
గ్రంథంలో ప్రచురణార్ధం పంపవలసిందిగా పరిశోధక రచయితలను సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆహ్వానిస్తున్నారు.
వ్యాసాలను ఈ నెల 30వ తేదీ లోగా హైదరాబాదు రవీద్ర భారతి కళాభవన్, సైఫాబాద్ లోని రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యాలయానికి (e.mail: apdirectorculture@gmail.com లేదా purnachandgv@gmail.com) పంపవలసిందిగా కోరుతున్నారు.
అచ్చులో A4 సైజు లో 6-7 పేజీలకు మించకుండా తెలుగులో వ్యాసాలు ఉండాలి. ప్రచురణ తుది నిర్ణయం సంపాదక మండలిదే!
మరిన్ని వివరాలకు 9440172642 లో సంపాదకుని సంప్రదించ వచ్చు.
డా. జి వి పూర్ణచందు
సంపాదకుడు,
కృష్ణాతీరం పరిశోధనా వ్యాస సంపుటి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రచురణ