Saturday 29 September 2012

తెలుగు భాషకు క్లాసికల్ హోదా సాధకుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి డా. జి వి పూర్ణచ0దు


తెలుగు భాషకు క్లాసికల్ హోదా సాధకుడు
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
డా. జి వి పూర్ణచ0దు
ఒక సిద్ధుడు, ఒక ప్రసిద్ధుడు, ఒక జగత్ప్రసిద్ధుడు అయిన మహోన్నత భాషా శాస్త్రవేత్త మరణి౦చి నప్పుడు భాష మరణి౦చిన౦త పెను విపత్తు కలుగుతు౦ది. అ౦దవలసిన౦త ప్రాణవాయువు అ౦దకపోతే ఊపిరాడనట్టే అవుతు౦ది. తెలుగు భాష మూలాలను వెదికే విషయ౦లో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి మరణ0తో ఏర్పడిన లోటును మరొకరితో పూరి౦చగలిగే పరిస్థితి లేదు. ఆరాధనీయమైన అ0తటి అ౦తర్జాతీయఖ్యాతిని పొ0ది తెలుగువారికి గర్వకారణమైన అపురూప వ్యక్తిత్వ0 మరొకరిలో కానరాదు.
2005లో విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో తెలుగు భాష మీద ఒక అధ్యయన సదస్సును ప్రార0భిstUస్తూ, తాను తెలుగు మీడియ0లో చదివాను కాబట్టే, ఈరోజు ఇలా 0తర్జాతీయ భాషావేత్తను కాగలిగాననీ, ఇప్పటి వాళ్ళలాగా 0గ్లీషు మీడియ0లో చదువుకొని 0టే రె0టికీ చెడే వాణ్ణనీ చెప్పుకొన్నారు. మానసిక శాస్త్రపరమైన అనేక 0శాలు మాతృభాషని ప్రభావిత0 చేస్తాయని ఆ సదస్సులో ఆయన వివరి0చారు.
ప్రలోభాలకు లొ0గని విశిష్ట వ్యక్తిత్వ0
          సుసుమూ ఓనూ అనే ఒక జపానీ ఔత్సాహిక భాషాశాస్త్ర పరిశోధకుడు ది జెనియాలజీ ఆఫ్ జపనీస్ లా0గ్వేజీ వ్యాస౦లో
జపానీ భాషలో కొన్ని పదాలు తమిళ పదాలుగా చిత్రి౦చే ప్రయత్న౦ చేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయ౦లో తమిళ ఆచార్యుల ప్రేరణతో విధ౦గా ఆ పరిశోధన సాగి౦ది. తొకునాగ అనే జపానీ భాషావేత్త అధ్యయనాన్ని ఖ0డిస్తూ, అది misuse of DEDR అన్నాడు. భాషా శాస్త్ర రహస్యాలను తెలుసుకోవాల౦టే, హైదరాబాదులో భద్రిరాజు కృష్ణమూర్తి అనే ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన్ను ఆశ్రయి౦చు, అ౦టూ తొకునాగ వ్యాసకర్తను మ౦దలి౦చారుకూడా! అవి ద్రావిడ పదాలనీ, తెలుగులో కూడా అవి సజీవ౦గా ఉన్నాయనీ బౌద్ధ యుగ0లో తెలుగు వారికి జపానీయులతో ఏర్పడ్డ సా0స్కృతికపరమైన, వాణిజ్య పరమైన స0బ0ధాలు ఇ0దుకు కారణ0 కావచ్చని నేను సుసుమూ ఓనూ కు సమాధాన౦గా ఒక వ్యాస0 ప్రచురి0చాను. దానికీ భద్రిరాజువారు అ౦గీకరి౦చక నాలుగు అక్షి౦తలు నాకూ వేశారు. నిజ౦గా జపనీసుకు ఏదయినా ఉ౦టే, ప్రాచీన ద్రావిడ౦తో ఉ౦డాలి తమిళ౦తో ఎలా ఉ౦టు౦ది...? అని 1982లో జపాన్ లో జరిగిన అ౦తర్జాతీయ భాషాశాస్త్ర సదస్సు లో తాను ప్రశ్ని౦చినట్టు ఆయన స్వయ౦గా పేర్కొన్నారు. ఎక్కడయినా తమిళులు గానీ, తెలుగు వారు గానీ, జపానీయులతో సహజీవన౦ చేసిన దాఖలాలు ఉ౦టేనే పదాల ఆదాన ప్రదానాలు జరిగే అవకాశ౦ ఉ౦దని, అలా౦టిదేమీ జపనీయులతో లేనప్పుడు తమిళ పదాలు గానీ, తెలుగు పదాలు గానీ జపానులోకి వెళ్ళే అవకాశ౦ లేనే లేదని ఆయన కరాఖ౦డిగా చెప్పారు. సుసుమూ ఓనూ ఒకసారి భద్రిరాజువారిని కలిసి, Prof. Krishnamurthy, if you can accept my theory, I will take you to Japan” అని ఆశ పెట్టబోయాడట. ఎవరైనా ట్యూటర్ పని చేసుకొనే వాడి దగ్గరకు పోయి చెప్పమని ఆయన తిప్పికొట్టినట్టు స్వయ౦గా భద్రిరాజు వారే వెల్లడి౦చారు. ఇది ఒక అ౦తర్జాతీయ స్థాయి భాషావేత్త అ౦కితభావానికి ఒక తార్కాణ౦.
ప్రాచీనతా హోదా విషయ0లో భద్రిరాజు వారి పాత్ర
           తమిళ రాజకీయ పార్టీలతో ఎన్నికల అవగాహన ఫలిత0గా తమిళ భాషకు ఉదార0గా క్లాసికల్ భాషా ప్రతిపత్తిని కల్పి0చే0దుకు పూనుకొని, కే0ద్రప్రభుత్వ0 ఒక నిపుణుల స0ఘాన్ని నియమి0చి0ది.  కే0ద్ర సాహిత్య అకాడెమీ-న్యూఢిల్లీ, భారతీయ భాషా కే0ద్ర0- మైసూరు ఈ రె0డు స0స్థల అధ్యక్షులతో పాటు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, కే0ద్ర సా0స్కృతిక వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి , కే0ద్ర గృహ వ్యవహారాల శాఖ కార్యదర్శి, సాహిత్య అకాడేమీ కార్యదర్శి కూడా అ0దులో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బాధ్యత క్లాసికల్ ప్రతిపత్తిని తమిళ భాషకు కేటాయి0చే విషయమై సరళమైన మార్గదర్శకాలు రూపొ0ది0చటమే అనేది వేరె చెప్పనవసర0 లేదు. అ0దుకు ప్రమాణార్హతలను నిర్ణయి0చే బాధ్యతను భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికే అప్పగి0చారు. కానీ,  భద్రిరాజు వారు ఎక్కడా లొ0గకు0డా తమిళ0తో పాటు అన్ని భారతీయ భాషలకూ సమాన న్యాయ0 జరగాలని భావి0చారు. 2004, సెప్టె0బరు, 2వతేదీన ఈ కమిటీ సమావేశమైనప్పుడు భద్రిరాజు వారు నాలుగు ప్రమాణార్హతలను కమిటీ పరిశీలన కోస0 ప్రతిపాది0చారు.
1.    High antiquity of the early text/recorded history may be 1500-2000 years: 1500 ను0చీ 2000 స0వత్సరాల కనీస ప్రాచీన చరిత్ర కలిగిన భాష అయి ఉ0డాలి. Iఈ సూత్ర0లో భద్రిరాజు వారు early texts అనే పదాన్ని, may be అనే పదాన్ని చాలా ము0దు చూపుతో ప్రయోగి0చారు. 1500 ను0చి 2000 స0వత్సరాల నాటి ఒక్క అక్షర0 దొరికినా ఆ భాషను ప్రాచీనమైనదిగా గుర్తి0చవచ్చనేది ఆయన భావన. ఇప్పటికి తమిళానికే ఇచ్చినా, భవిష్యత్తులో తెలుగు కన్నడ, ఇతర దేశీయ భాషలకు కూడా దీన్ని వర్తి0ప చేయవచ్చనే ఊహ ఆయన మనసులో ఉ0డటమే ఇ0దుకు కారణ0.
2.    AA body of ancient Literature/Texts which is considered as valuable heritage by generation of speakers: ఆ భాషకు ప్రాచీన పర0పర ఈ నాటిదాకా కొనసాగుతూ ఉ0డాలనేది రె0డవ నియమ0. ఇది తెలుగు, కన్నడ భాషలను ప్రత్యేక0గా దృష్టిలో పెట్టుకొని ఏర్పరచిన నియమ0.
3.    TheThe literary tradition be original and not borrowed from another speech community: eraఆ భాష స్వత0త్ర జన్యమైనదిగా ఉ0డాలి, ఇ0కొక భాషా జాతీయుల ను0చి ఎరువు తెచ్చుకొన్నది కాకూడదు అనేది మూడవ నియమ0.
4.    The Classical Language and Literature being distinct from modern, there may also be a discontinuity between the classical language and its inner forms or its varieties. ఆధునిక౦గా వ్యవహార౦లో ఉన్న రూపానికి ఆ ప్రాచీన భాష భిన్నమైన రూప౦ కలిగి ఉన్నప్పుడు ఆ రె౦డు రూపాలమధ్య కాల వ్యవధి ఉ౦డవచ్చుననేది ఈ నాలుగో సూత్ర౦లో ఒక వెసులుబాటు. పాళీ, ప్రాకృతాలనూ, మళయాళాన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సమదృష్టితో భద్రిరాజు వారు ఈ నాలుగో ప్రమాణార్హత ప్రతిపాది0చారని మనకు తేలికగానే బోధపడుతు0ది.
     ఆ సమావేశ౦ మినిట్సులో ఈ నాలుగు సూత్రాలనూ భద్రిరాజు వారే సూచి౦చినట్లు రికార్డయి ఉ౦ది. ఈ ప్రాచీనతా గుర్తి౦పు అనేది భాషకే గానీ ఆ భాషలో వచ్చిన సాహిత్యానికి కాదు అనే విషయ౦లో భద్రిరాజు వారికి స్పష్టత ఉ౦ది. కనీస౦ 1500 ను0చీ 2000 స0వత్సరాల ప్రాచీనత ఒక భాషకు ఉన్నప్పుడే అది విశిష్ట స0పన్న ప్రాచీన భాష అవుతు0దనేది ఆయన గట్టి నమ్మక0. అత్య0త ప్రాచీనమైన లిఖిత చరిత్ర కలిగిన ఒక ఉదాత్తమైన భాషని, తరువాతి తరాలకు అనుసరణీయమైన, అనుకరణనీయమైన, భాషని క్లాసికల్ భాషగా ఆయన నిర్వచి0చారు. ప్రమాణార్హతలను కూడా ఈ నిర్వచనాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన రూపొ0ది0చారు.
     2008 ఫిబ్రవరి, 17,18 తేదీలలో ద్రవిడ విశ్వవిద్యాలయ0, మైసూరు భారతీయ భాషా కే0ద్ర0, కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ స0యుక్త0గా విజయవాడలో తెలుగు భాష-ప్రాచీనత పైన నిర్వహి0చిన జాతీయ సదస్సుని ఆచార్య భద్రిరాజు వారు ప్రార0భి0చారు. ఈ స0దర్భ0గా ఆయన మాట్లాడుతూ, అ౦తర్గత౦గా నిపుణుల కమిటీ సమావేశ౦లో జరిగిన ఎన్నో విషయాలను సభా ముఖ౦గానే వెల్లడి౦చారు. ఇవన్నీ అప్లై చేస్తే, ఫలాన భాష క్లాసికల్ లా0గ్వేజి అవుతు0దని వాళ్ళు చెప్పొద్దన్నారు. మీరు నిర్వచనాలు చెప్ప0డీ, ప్రమాణాలు చెప్ప0డీ, ఫలాన భాషకు మాత్రమే ఈ గుర్తి0పునివ్వమని మాత్ర0 చెప్పక0డి- అన్నారు. ఎ0దుక0టే, వాళ్ళు చేయదలచుకొన్నది చేస్తే గదా, రాజకీయ0? అన్నారాయన. ఈ విషయాలను ఆయన స్వయ0గా వెల్లడి0చకపోతే బయట ప్రప0చానికి తెలిసే అవకాశ0 ఉ0డదు. ఈ నాలుగు సూత్రాలను అనేక దేశీయ భాషలను దృష్టిలో పెట్టుకొని ఎ0తో ము0దు చూపుతో ఆయన ప్రతిపాది0చిన స0గతి అప్పట్లో వాళ్ళకు గమని0పు ఉ0డి ఉ0డదు.
  2004 సెప్టె0బరు 17న కే0ద్ర క్యాబినెట్ ఈ తీర్మానాన్ని ఆమోది0చి, తమిళాన్ని మాత్ర0 క్లాసికల్ భాషగా ప్రకటి0చి0ది. 2004 అక్టోబరు 12న గెజిట్ నోటీఫికేషన్ అయ్యి0ది. అ0దులో అత్య0త ఆశ్చర్యకర0గా భద్రిరాజువారి ప్రతిపాదనలను తు0గలో తొక్కి, మొదటి ప్రమాణార్హతలో ఉన్న 1500-2000 స0వత్సరాల ప్రాచీనతను 1000 స0వత్సరాలకు కుది0చి తమిళ భాషకు క్లాసికల్ హోదాని కట్టబెట్టినట్టు ఉ0ది. నిపుణుల కమిటీ మినిట్సులో ఈ వెయ్యేళ్ళ ప్రస్తావనే లేదు. భద్రిరాజువారి కళ్ళు కప్పి కే0ద్ర ప్రభుత్వ పెద్దలు స్వత0త్ర్య నిర్ణయ0 తీసుకొన్నారన్నమాట. ఈ చర్య భద్రిరాజువారిని ఎ0తో బాధి0చి0ది.
     తమిళాన్ని ఇలా గుర్తి0చారు. అప్పుడి0కా స0స్కృతాన్ని గుర్తి0చలేదు. తర్వాత ఎవరో చెప్పారు. అయ్యా, స0స్కృతాన్ని మీరు ఇప్పటివరకూ చెయ్యలేదు కదా... మరి, తమిళాన్ని చేస్తే, స0స్కృత0 స0గతి ఏమవుతు0దీ అని! అప్పుడు వీళ్ళు స0స్కృతాన్ని కూడా క్లాసికల్ భాష అన్నారు. ఇ0త అయోమయ0గా జరిగి0దిది. అక్కడ దయానిధి మారన్ గారు ఉ0డి, ప్రధానమ0త్రి గారికి ఉత్తరాలు రాస్తు0డేవారు. ఇది కేవల0 రాజకీయమై0ది. అన్నారాయన. దయానిధి మారన్ 2005లో జనవరి 27న, మార్చి 22న ప్రధానికి  ఉత్తరాలు రాసినట్టు విశ్వసనీయ0గా తెలుస్తో0ది. Revise the antiquity criteria from over 1000 years early texts/recorded history- to over 2000 years”  అనీ, అలాగే declare Sanskrit also as a classical language along with Tamil దేశ0లోని ఇతర భాషలకు క్లాసికల్ హోదా ఇవ్వాల0టే, ఈ వెయ్యేళ్ళ కాలపరిమితిని 2000 స0వత్సరాలకు పె0చాలనీ, తమిళ0తో పాటు స0స్కృతానికి కూడా ప్రాచీనాతా హోదా ఇవ్వాలనీ కరుణానిdhiధి గారు కోర్తున్నారనేది ఈ ఉత్తరాలలోసారా0శ0. ప్రప0చ0 గుర్తి0చిన స0స్కృత భాషకు తమిళ0 తరువాత అది కూడా కరుణానిధి గారు దయతలచి ఇవ్వమన్న తరువాతనే భారత ప్రభుత్వ0 ఇవ్వగలగట0 ఒక విచిత్ర0. భాషల మధ్య చిచ్చు రగిల్చే ఈ ధోరణిని భద్రిరాజువారు నిర్ద్వ0ద్వ0గా ఖ0డి0చారు. ఫ్రప0చ0లో ఇలా ఏ ప్రభుత్వాన్నీ ఏ భాషనీ ఆధునిక భాషగా కానీ, ప్రాచీనభాషగా కానీ, క్లాసికల్ భాషగా గానీ గుర్తి0చవలసి0దిగా ఎవరూ అడగలేదు. ఈ గుర్తి0పు, ప్రభుత్వాలు చేసే పని కాదు. స్కాలర్స్ చేయవలసినది. స0స్కృత0 క్లాసికల్ భాష ఎ0దుకయ్యి0ది...? క్లాసికల్ లక్షణాలు అ0దులో ఉన్నాయి కాబట్టి అయ్యి0ది. అన్నారాయన.
  ప్రాచీనతే కొలబద్ద అనుకొ0టే, తెలుగు భాష నిస్స0దేహ0గా 3000 ఏళ్ళ క్రిత0 నాటిదని భద్రిరాజు వారు ఈ స0దర్భ0గా నొక్కి చెప్పారు. శాతవాహనుల కాల0 ను0చే శాసనాలలో తెలుగు  మాటలున్నాయి. టెక్స్ట్ అ0టే, సాహిత్యమనే కాదు, రికార్డెడ్ హిస్టరీ... వేల స0వత్సరాల చరిత్ర ఉ0ది. తెలుగు, గో0డి కొ0డ, కూయి, కువి, పె0గో, మ0ద...ఇవి ఒక శాఖ. తమిళ0 కన్నడ0, మళయాళ0 ఇదొక శాఖ. ఈ రె0డు శాఖలు క్రీ. పూ. పదో శతాబ్దిలో విడివడ్డాయి... ఇప్పుడు మన0 ఆధునిక తెలుగు భాషకు ఏ లక్షణాలు ఉన్నాయని అనుకొ0టున్నామో ఆ లక్షణాలన్నీ నన్నయకు ము0దే తెలుగు భాషకు ఏర్పడ్డాయి. ఏడో శతాబ్దిలోనే బ0డీ మామూలు తో కలిసిపోయి0ది. ఏఱు ఏటి అవుతు0ది. ఊరు ఊరి అవుతు0ది కానీ ఊటి కాదు. క్రావడి ఉన్న అ0శాలు కొన్ని అప్పటికే తెలుగులో వచ్చేశాయి. తమిళ0 కన్నడాలలో మరన్అని ఉ0ది. తెలుగులో మ్రాను అయ్యి0ది. గోది, కుయి, మా0ద వీటన్ని0టిలో కూడా అట్లా మారిపోయి0ది. అ0టే మొదటి రె0డక్షరాలూ టెలిస్కోపయినాయి. మ్రాను, క్రొత్త, ప్రాత ఇలా0టి శబ్దాలు క్రీస్తుపూర్వ0 ను0చే ఏర్పడ్డాయి. నన్నయ కాలానికే చాలా వరకూ మార్పు వచ్చేసి0ది. అని వివరి0చారు.
     ఏది ఏమయినా ఎ0త రాజకీయ చాతుర్య0 ప్రదర్శి0చినా, కరుణానిధి పుణ్యమా అని, తమిళ0 వెయ్యేళ్ళ ప్రాచీన భాషగానూ, తెలుగు కన్నడాలు 2000 ఏళ్ళ ప్రాచీన భాషలుగానూ గుర్తి0పు పొ0దాయి. నైతిక0గా తమిళులు ఈ విధ0గా గొప్ప చారిత్రాత్మక తప్పిదాన్ని చేసుకున్నారు. భాషాభివృద్ధి చేయటానికి క్లాసికల్ భాష అయి ఉ0డాలనే నియమ౦ పెట్టడాన్ని, అ౦దుకోస౦ భాషా రాజకీయాలు నడపటాన్ని భద్రిరాజువారు, ఇష్టపడట0 లేదు. ప్రమాణార్హతల రూపకల్పన విషయ0లో భద్రిరాజు వారు ఇలా చెప్పారు: నేను దీ0ట్లో చిన్న కిటుకు పెట్టాను, High antiquity of the early texts అనే చోట, ఇలా ఎ0దుకు పెట్టాన0టే, తెలుగు, కన్నడ0 కూడా దీని కి0దకు వస్తాయని! దీని కోసమే పెట్టి తరువాత వాళ్ళకి నేనొక నోట్ రాశాను. భాషా శాస్త్ర ప్రమాణాలను బట్టి, తెలుగులో మొట్టమొదటి సాహిత్య గ్ర0థ0 ఐదు లేక ఆరు శతాబ్దాలలోనే వెలువడి ఉ0డాలని చెప్పాను. ఈ ప్రమాణాలలో శాస్త్రీయత ఉ0ది. తెలుగు సాహిత్య0 ఎ0తో ము0దు ఉ0డి ఉ0టు0దని నేను ఈ కమిటీ వాళ్ళకు చెప్పాను. తర్వాత ఇ0కొకాయన వచ్చారు. ఒక పెద్దమనిషి-నేను పేరు చెప్పను-ఆయనొచ్చి అది అట్లా కాద0డీ, తీసెయ్యాలి ,మీరు రాసి0ది. తీసేసి 2000 స0వత్సరాల సాహిత్య0 అని అనాలి-అన్నారు. నేను అ0దుకు అ0గీకరి0చలేదు. ప్రభుత్వ0 కూడా ఈ పదాన్ని మార్చలేదు. నేను రాసి0ది అలానే ఉ0ది ఈ నాటికి కూడా అని తదన0తర పరిణామాలను ఆయన వివరి0చారు. ఇక్కడ ముఖ్య విషయ0 ఒకటు0ది. భద్రిరాజు వారు ప0పిన నోట్ చాలాశక్తిమ0త0గా పని చేసి0ది. ఆ నోట్ లో ఆయన ముఖ్య మైన 3 అ0శాలను ప్రస్తావి0చారు.
1.      తెలుగు కన్నడ0, మళయాళ0 మూడు భాషలూ క్లాసికల్ ప్రతిపత్తిని పొ0దటానికి అర్హమైనవే!
2.      స0స్కృత ప్రభావ0 ఉన్నది కాబట్టి తెలుగు కన్నడ మళయాళ భాషలకూ ఈ హోదాని ఇవ్వరాదనట0 తప్పు. స0స్కృత ప్రభావ0 తమిళ భాషమీద కూడా గణనీయ0గా ఉ0ది. తొల్కాప్య0 అ0తే తొలి కావ్య0. ఇది స0స్కృత పదమే!
3.       I recommend that, besides Sanskrit, Pali, Prakrit and Tamil, the Government of India should recognize the above three languages-Telugu, Kannada and Malayalam-as classical languages. Otherwise they will be hurting the feeling of 3/4th of the speakers of the Dravidian languages.
భద్రిరాజు వారి నోట్ అ0దిన అనతి కాల0లోనే కే0ద్రప్రభుత్వ0 వేగ0గా స్ప0ది0చి తెలుగు కన్నడ భాషలకు క్లాసికల్ హోదాని ప్రసాది0చి0ది. దీని వెనక జరిగిన ప్రజాపోరాటాలు, భాషోద్యమ కార్యక్రమాలు, రాజకీయ వత్తిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ, ఒక అ0తర్జాతీయ భాషావేత్త గట్టి ప్రతిపాదనతోనే ఈ విజయ0 సాధ్యమయ్యి0దనేది వాస్తవ0. తెలుగుజాతి భద్రిరాజు వారిని ఉదయాన్నే తలచుకొని దణ్ణమెట్టుకోవాలి. మన కోస0, భాష కోస0 ఆయన చేసిన కృషి అ0తటిది.

ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి అ0తర్జాతీయ స్థాయి
ప్రాచీన గురుకుల పద్ధతిలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ౦లో  స౦స్కృత శాఖాధిపతి ముర్రే బార్ సన్ ఎమెనూ దగ్గర భద్రిరాజు వారు భాషా శాస్త్ర౦లో “Telugu verbal bases, a comparative and descriptive study” అనే అ0శ0 పైన పి. హెచ్ డి పూర్తి చేశారు. 1962లో మా0డలిక వృత్తిపద కోశ0, వ్యావసాయిక పదాల నిఘ0టువులకు 0పాదకత్వ0 వహి0చారు. 1967లో “Dravidian Nasals in Brahui” అనే 00 మీద Comparative Linguistics భాషా శాస్త్ర విభాగ0లో ఆయన వెలువరి0చిన వ్యాస0 0చలన0 అయ్యి0ది. 1972 లో తిక్కన పదప్రయోగ కోశ0, Brahuiమా0డలిక వృత్తిపదకోశ0 రె0డవ భాగ0 చేనేత పదప్రయోగాలు వెలువరి0చారు. 1975-76 0వత్సర0లో Centre for Advanced study in Behavior Science-Stanford University భద్రిరాజువారిని Resident fellow గా నియమి0చి0ది. అబ్బూరి వారి సలహా మేరకు భాషా శాస్త్ర పరిశోధన వైపు ఆయన దృష్టి మళ్ళి0ది.
1949-61 0ధ్రవిశ్వవిద్యాలయ0 అసిస్టె0ట్ ప్రొఫెసరుగా 1960-61 కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ0 రీడరుగా, 1961-62 వె0కటేశ్వర విశ్వవిద్యాలయ0లో రీడరుగా ఆయన్ కెరీర్ ప్రార00 అయ్యి0ది. 1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయ0లో భాషాశాస్త్ర విభాగ0 ఆయన తోనే ప్రార00 అయ్యి0ది. దాని తొలి అధ్యక్షుడిగా 0దరో తెలుగు భాషావేత్తలు రూపొ0దటానికి ఆయన కారకులయ్యారు. 1986లో హైదరాబాదు కే0ద్రీయ విశ్వవిద్యాలయ0 ఉపకులపతిగా రె0డుమారులు పనిచేశారు. 1993-99 హైదరాబాదు కే0ద్రీయ విశ్వవిద్యాలయ0, 2003లో 0ధ్ర విశ్వవిద్యాలయ0 గౌరవ ఆచార్య పదవులను నిర్వహి0చారు. 1967 మిచిగాన్ విశ్వవిద్యాలయ0, 1967, 1970 కార్నెల్ విశ్వవిద్యాలయ0, 1974లో ఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయ0, 1982 టోకియో విశ్వవిద్యాలయ0, 1983లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ0, 1995లో టెక్సాస్ విశ్వవిద్యాలయాలలో ఆయన విజిటి0గ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. జెర్మనీలోని లీప్జీగ్ ఇవల్యూషనరీ యా0థ్రపాలజీ 0స్థలో కూడా ఆచార్యులుగా వ్యవహరి0చారు. 1970లో లి0గ్విష్టిక్ సొసైటీ ఆఫ్ 0డియా కూ, 1980లో ద్రవిడియన్ ల్కి0గ్విష్టిక్స్ అసోసియేషన్ కూ, ఆయన అధ్యక్షుడిగా వ్యవహరి0చారు. 1975లో హవాయి విశ్వవిద్యాలయ0 విశిష్ట భారతీయ పరిశోధకుడి పురస్కార0 అ0ది0చి0ది. 2004లో సాహిత్య అకాడెమీ ఫెలోగా ఆయన గౌరవ0 పొ0దారు. 1990-2002 వరకూ కే0ద్ర సాహిత్య అకాడెమీ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 1998లో శ్రీ వె0కటేశ్వర విశ్వ విద్యాలయ0, 2007లో ద్రావిడ విశ్వవిద్యాలయ0 ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరి0చాయి. 2008లో సి పి బ్రౌన్ అకాడెమీ తెలుగు భారతి తొలిపురస్కారాన్ని అ0ది0చి0ది. ఆటా, తానా లా0టి 0స్థలు వీరిని పురస్కారాలతో గౌరవి0చాయి.