Monday 31 August 2015

my interviews

బెజవాడ2విజయవాడ ఇంటర్వ్యూ

సోమవారం ఉదయం 10 గంటలకు సప్తగిరి ఛానల్లో బెజవాడ2విజయవాడ పేరుతో ప్రసారం చేసిన నా ఇంటర్వ్యూ బెజవాడ చరిత్ర పైన ప్రసారం కానున్న వరుసలో మొదటిభాగం.

Saturday 29 August 2015

తెలుగు భాషకు తిరుక్షౌరం డా. జి వి పూర్ణచందు

విశాలాంధ్ర ఆదివారం దినపత్రిక ఆదివారం పుస్తకంలో పద్యానుభవం శీర్షికని గత రెండేళ్ళుగా నిర్వహిస్తున్నాను. అప్పుడప్పుడూ వాటిలో కొన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఈ వారం వచ్చిన నా పద్యానుభవం ఇది:

తెలుగు భాషకు తిరుక్షౌరం

డా. జి వి పూర్ణచందు

“తిరుకట్టె సేవ జేసెద తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గుల్/తిరుపంజనంబు దీర్చెద తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద దినమున్”

తెలుగు వైష్ణవులకు తమిళం దైవభాష. వీళ్ళలో చాలా మంది తెలుగువారే, ఇప్పటి తమిళ ప్రాంతాల్లో నివసించి, తాతల కాలంలోనే తెలుగు నేలకు వలస వచ్చిన తెలుగువాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇళ్ళలో తమిళం మాట్లాడటం, తమిళుల్లాగే ప్రవర్తించటం, తెలుగు విషయాలను తమిళీక రించటానికి ఎక్కువ మొగ్గు చూపటం ఈ పద్య భాగంలో కనిపిస్తుంది.

ఇలగే, వీర శైవులున్నూ కన్నడం తమకు దైవభాషగా భావించిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. శివుడు కన్నడం వాడూ కాదు, విష్ణువు తమిళుడూ కాదు. కన్నడ బసవడూ, తమిళ రామానుజుడూ కలిగించిన ప్రభావాల పుణ్యం అది. తమిళ శైవుల కన్నా తమిళ వైష్ణవుల పలుకుబడి తెలుగు మీద ఎక్కువ. వీళ్ళు తెలుగు పదాలకు ముందు ‘తిరు’ చేర్చి విష్ణుత్వం ఆపాదించటం గొప్ప విషయమే కానీ, తమిళీకరించే పనిగా అది పరిణమించటమే బాధాకరం.

తిరుకట్టె సేవ జేసెద: కట్ట అంటే చీపురు కట్ట. దాన్ని తిరుకట్ట - గుడి ఊడ్చే చీపురు కట్ట అనడం వలన దానికి పవిత్రత వచ్చింది. కానీ అందులోంచి తెలుగుదనం ఊడ్చుకు పోయి, అది తమిళ పదంగా మారిపోయింది.

తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గులు: మాళిగ అంటే ఇంటిలో ఒక భాగం. తిరుమాళిగ/తిరుమాళ్ళ/ తిరుమాళిహ/ తిరుమాళిఘ అంటే గుడి పూజారి లేదా మతగురువు నివాసం. అంటే వైష్ణవ గురువు ఇంటిని అలికి ముగ్గులు పెట్టే సేవ ఇది. దాన్ని తెలుగు వైష్ణవులు తమిళంలోనే చెప్పాలా?

తిరుపంజనంబు దీర్చెద: మజ్జనం అంటే నీళ్ళలో మునిగి చేసే స్నానం. తిరుమంజనం అంటే పవిత్రమైన కోనేరులో స్నానం. కోనేటిని ‘తీర్థకూలం’ అన్నారు. సంస్కృతంలో తీర్థం అంటే దేవుడి నీళ్ళు అని. కూలం అన్నా దేవుడి నీళ్ళే! తీర్థకూలం అనటం ద్వారా తమిళీకరించే ప్రయత్నం స్పష్టమౌతోంది. కూలం/కొలం/కూలం/ కొలను ఈ పదాలన్నీ నీటికి సంబంధించినవే! ఆంధ్ర మహావిష్ణువు స్థావరమైన ‘శ్రీకాకుళం’లో కాకుళం అంటే ‘కా’=నల్లని, ‘కుళం’= నది... కృష్ణానది అని అర్ధం.. తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద: పుట్టము=బట్ట. తిరుపుట్టము= దేవుడికి కట్టిన వస్త్రం. తిరుపావడ. అంటారు.

ఇలా తెలుగులో వ్యవహారంలో ఉన్నమాటల్ని తమిళ పదాలుగా మార్చినవి చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
తిరువళ్ళిక: ‘తిల్లిక’ అంటే దీపం. తిరుతిల్లిక అంటే దేవుడి ముందు వెలిగించిన దీపం. తిరుపాట (భక్తి గీతం), తిరుబాస (దేవుడిమీద ఒట్టు), తిరు కాపు (గుడి తలుపులు) తిరుగిన్నె (దేవుడి గిన్నె),

తిరుతోమాలి: తోమాలియ అంటే తోట+మాలి అని! తోమాలె అంటే ఆకులూ పూలూ కూర్చికట్టిన మాల. తోమాలి అనికూడా అంటారు, తిరుతోమాలి అనేసరికి తమిళపదంగా మారిపోయింది.

తిరుపడితాము: పడిదెం అంటే జుర్రుకుంటూ తాగేదని! దీనికి తిరు చేర్చి తిరుపడిదెం -‘తిరుపడితాము’ అన్నారు.

తిరుచుట్టు (గుడి ప్రహరీ), తిరు బోనం (నైవేద్యం), తిరునగరు (ధనికుల నగరం, దేవుడి ఊరు. తిరునాడు (వైకుంఠం), ఇలా చాలా మారుడు పదాలు కనిపిస్తాయి.

సురవరం ప్రతాపరెడ్డిగారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో దీన్ని ప్రస్తావిస్తూ, “భోజనము చేసినప్పుడు ‘అన్నము’ అనక ‘సాదము’ అని, ‘పరమాన్న’మనక ‘తిరుకణామధు’ అని, ‘భక్ష్యాలు’ అనక ‘తిరుపణ్యారము’ అని, ఈ విధముగా అన్నియు అరవము తోనే అడుగవలెను. లేకున్న వైష్ణవుడు మైల పడిపోవును. ఇది వైష్ణవము తెచ్చి పెట్టిన అరవ దాస్యము” అన్నారు.

ఇందులో దేవుడి పాత్ర, భక్తుల పాత్రా ఏమీలేవు. ఎవ్వరినీ ఇప్పుడు తప్పు పట్టి ప్రయోజనమూ లేదు. కాకపోతే, తెలుగు భాష కొచ్చేసరికి కొప్పుకు ముందు తిరుచేరిస్తే, ‘తిరుకొప్పు’ అంటే బోడి తల అనీ, క్షవరానికి ముందు తిరు చేరిస్తే, ‘తిరుక్షౌరం’ (ఉన్నది కాస్తా ఊడటం) అవుతున్నాయి. భక్తికీ భాషకూ ముడిపెట్టి ప్రయోగాలు చేస్తే, భాషాభక్తులు ప్రశ్నించటం సహజమే!

Tuesday 25 August 2015

పట్టణ నాగరకత :: డా. జి వి పూర్ణచందు

పట్టణ నాగరకత
డా. జి వి పూర్ణచందు

“పద్మినీ పద్మాతపత్రంబు శిథిల పత్రాగ్రమై రాయంచ యాశ్రయించె
దాలు స్రవత్ఫేన జాలుబుతో ఘోణిపంచల రొంపి గలంచి యాడె
దూరొద్గమద్భావ ధూమ మంబుద బుద్ధి నెమ్మిలో పొదనుండి నిక్కిచూచె
జఠరస్త జలము నాసానళమున బీల్చిసామజంబరు ప్రక్క జల్లుకొనియె
సరసిపై నీరు సలసల తెరలి
సకల వీథులు నిర్మృగోఛ్ఛయములయ్యె
మట్టమధ్యాహ్నమిది సుధామధురవాణీ
యర్హమిచ్చొ బథ: శ్రమ మపనయింప”

ఎండకు విరుగుడు నీడ. దాహానికి విరుగుడు నీళ్ళు. ఆ నీళ్ళు కూడా ఎండ తీవ్రతకి సలసలమంటున్నాయి. జలాశయాలు వేడెక్కిక్కేటంత ఎండలో కూడా జీవరాశికి అంతో ఇంతో సేద తీరే సౌకర్యం ఉన్నప్పుడే అది మహానగరం అవుతుందని అగస్త్యుడు లోపాముద్రతో చెప్తున్నాడీ పద్యంలో!

ఎండ మండి పోతుంటే, ఒక రాయంచకు దిక్కుతోచలేదు. అప్పటికే దానిరెక్కలు అలిసిపోయాయి. ఆ చెరువులో తామరాకు అడుగున దూరి చల్లదనాన్ని అనుభవిస్తోందట. తామరాకు అడుగునైతే నీడ చల్లదనం రెండూ ఉంటాయని!

ఎండకి శోష వచ్చి రొప్పటం వలన ఒక వరాహం నోట్లోంచి నురుగులు కక్కుతోంది. చెరువు దగ్గర దానికి బురద కనిపించే సరికి ఎక్కడలేని ప్రాణాలూ లేచి వచ్చి, బురదలో పడి దొర్లిందట.

దూరంగా దావాగ్ని ముంచుకొస్తోంది. నల్లపొగలు కమ్ముకుంటున్నాయి. ఆ నల్లపొగని నల్లమబ్బులనుకుని ఎండకు తట్టుకోలేక ఎక్కడో పొదలో దాగి కూర్చున్న ఒక నెమలి ఆశకొద్దీ, తలకాయి బైటపెట్టి మెడ నిక్కించి తొంగి చూస్తోందట.

కడుపులో దాచుకున్న నీళ్ళనే తొండంతో బయటకు లాగి వీపు మీద పోసుకుని ఒక యేనుగు ఊరట పొందుతోందట...

చాలా జంతువులకు చర్మంలో స్వేదగ్రంథులు మనుషులకున్నంతగా ఉండవు. అందుకని వాటి శరీరంలో జీవనక్రియల వలన ఉత్పన్నమయ్యే వేడిని చల్లార్చేందుకు కావలసినంత చెమట పట్టకపోవటంతో మనుషుల కన్నా జంతువులు నీళ్ళకోసం ఎక్కువ అల్లాడతాయి. పంది బురదనే మెచ్చటానికి కారణం బురద ఎక్కువ సేపు దాని చర్మాన్ని చల్లగా ఉంచుతుంది కాబట్టి! ఇతర జంతువులు కూడా చెరువులో దిగి స్నానం చేసి ఒడ్డుకువచ్చి ఒంటిమీద దుమ్ము ఎత్తి పోసుకుంటాయి. ఎందుకంటే ఆ తడి ఎక్కువ సేపు నిలబడి ఉంటుందని! తెలుగునాట చెరువుల్ని అశ్రద్ధ చేయటం వలన పాడి పరిశ్రమ కూడా దెబ్బతింది రైతాంగం తెలిసి చేసిన తప్పే ఇది.  చెరువులు లేని ఊళ్ళలో జల్లు స్నానాలతో పశు సంపద బతకలేదు.

చెరువులో నీళ్ళు సలసల తెరలేంతగా ఎండ మిట్ట(మట్ట) మధాహ్నం మండిపోతుంటే, వీధులన్ని నరసంచారం లేక వెలవెలబోతున్నాయి. “చేసేదేమీ లేదు, ఇక్కడే ఎక్కడో నీడపట్టున కాసేపు సేదతీరుదా”మంటున్నాడు అగస్త్యుడు, తన భార్య లోపాముద్రతో! తెనాలి రామకృష్ణుడి పాండురంగ మాహాత్మ్యంలోది ఈ పద్యం. నగరంలో ఎండా, వానల బారినుండి కాపాడే ఏర్పాట్లు లేకపోతే ఊళ్ళోకి వచ్చేవాళ్ళు అగస్త్యుడిలానే అగచాట్లు పడాలని తెనాలి కవి ముఖ్యంగా రాజధాని నిర్మాతలను హెచ్చరిస్తున్నాడు.  

భుగభుగ ఎండలు, సుడులు తిరిగే తుఫానులు, వెల్లువెత్తి వచ్చే వరదలకు ప్రసిద్ధి చెందిన బ్లేజ్‘వాడ దగ్గర కొత్త రాజధాని వస్తోంది. రేపటినుండీ ఈ రాజధాని నగరానికి వచ్చే అగస్త్యులు, లోపాముద్రల కోసం ముందు చూపుతో తగిన ఏర్పాట్లు చేయవలసి ఉంది.

మానవులతో పాటు, ప్రకృతి, పర్యావరణం, పశుపక్ష్యాదుల సమజీవనం, సహజీవనం సాగనిస్తేనే అది ప్రపంచ స్థాయి ప్రజానగరం అవుతుంది. నగరాల వెలుపల మురుగువాడలు కాదు, వ్యవసాయ క్షేత్రాలు ఉండాలి. మౌలికంగా వ్యావసాయిక దేశం మనది. ఈ దేశంలో పట్టణ నాగరికత పొసగేది కాదు. చివరికి సింధునాగరికతకు పట్టిన గతే పడ్తుంది. వ్యవసాయాన్ని, పశు పోషణనీ కొనసాగనిచ్చిన నగరాలు పదికాలాల పాటు పదిలంగా ఉంటాయని తెనాలి వాని భావం.
  

 


  


Saturday 22 August 2015

తెలుగు భాషకు తిరుక్షౌరం డా. జి వి పూర్ణచందు

తెలుగు భాషకు తిరుక్షౌరం

డా. జి వి పూర్ణచందు


“తిరుకట్టె సేవ జేసెద తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గుల్/తిరుపంజనంబు దీర్చెద తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద దినమున్”
తెలుగు వైష్ణవులకు తమిళం దైవభాష. వీళ్ళలో చాలా మంది తెలుగువారే, ఇప్పటి తమిళ ప్రాంతాల్లో నివసించి, తాతల కాలంలోనే తెలుగు నేలకు వలస వచ్చిన తెలుగువాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇళ్ళలో తమిళం మాట్లాడటం, తమిళుల్లాగే ప్రవర్తించటం, తెలుగు విషయాలను తమిళీక రించటానికి ఎక్కువ మొగ్గు చూపటం ఈ పద్య భాగంలో కనిపిస్తుంది.
ఇలగే, వీర శైవులున్నూ కన్నడం తమకు దైవభాషగా భావించిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. శివుడు కన్నడం వాడూ కాదు, విష్ణువు తమిళుడూ కాదు. కన్నడ బసవడూ, తమిళ రామానుజుడూ కలిగించిన ప్రభావాల పుణ్యం అది. తమిళ శైవుల కన్నా తమిళ వైష్ణవుల పలుకుబడి తెలుగు మీద ఎక్కువ. వీళ్ళు తెలుగు పదాలకు ముందు ‘తిరు’ చేర్చి విష్ణుత్వం ఆపాదించటం గొప్ప విషయమే కానీ, తమిళీకరించే పనిగా అది పరిణమించటమే బాధాకరం.
తిరుకట్టె సేవ జేసెద: కట్ట అంటే చీపురు కట్ట. దాన్ని తిరుకట్ట - గుడి ఊడ్చే చీపురు కట్ట అనడం వలన దానికి పవిత్రత వచ్చింది. కానీ అందులోంచి తెలుగుదనం ఊడ్చుకు పోయి, అది తమిళ పదంగా మారిపోయింది.
తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గులు: మాళిగ అంటే ఇంటిలో ఒక భాగం. తిరుమాళిగ/తిరుమాళ్ళ/ తిరుమాళిహ/ తిరుమాళిఘ అంటే గుడి పూజారి లేదా మతగురువు నివాసం. అంటే వైష్ణవ గురువు ఇంటిని అలికి ముగ్గులు పెట్టే సేవ ఇది. దాన్ని తెలుగు వైష్ణవులు తమిళంలోనే చెప్పాలా?
తిరుపంజనంబు దీర్చెద: మజ్జనం అంటే నీళ్ళలో మునిగి చేసే స్నానం. తిరుమంజనం అంటే పవిత్రమైన కోనేరులో స్నానం. కోనేటిని ‘తీర్థకూలం’ అన్నారు. సంస్కృతంలో తీర్థం అంటే దేవుడి నీళ్ళు అని. కూలం అన్నా దేవుడి నీళ్ళే! తీర్థకూలం అనటం ద్వారా తమిళీకరించే ప్రయత్నం స్పష్టమౌతోంది. కూలం/కొలం/కూలం/ కొలను ఈ పదాలన్నీ నీటికి సంబంధించినవే! ఆంధ్ర మహావిష్ణువు స్థావరమైన ‘శ్రీకాకుళం’లో కాకుళం అంటే ‘కా’=నల్లని, ‘కుళం’= నది... కృష్ణానది అని అర్ధం.
. తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద: పుట్టము=బట్ట. తిరుపుట్టము= దేవుడికి కట్టిన వస్త్రం. తిరుపావడ. అంటారు.
ఇలా తెలుగులో వ్యవహారంలో ఉన్నమాటల్ని తమిళ పదాలుగా మార్చినవి చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
తిరువళ్ళిక: ‘తిల్లిక’ అంటే దీపం. తిరుతిల్లిక అంటే దేవుడి ముందు వెలిగించిన దీపం. తిరుపాట (భక్తి గీతం), తిరుబాస (దేవుడిమీద ఒట్టు), తిరు కాపు (గుడి తలుపులు) తిరుగిన్నె (దేవుడి గిన్నె),
తిరుతోమాలి: తోమాలియ అంటే తోట+మాలి అని! తోమాలె అంటే ఆకులూ పూలూ కూర్చికట్టిన మాల. తోమాలి అనికూడా అంటారు, తిరుతోమాలి అనేసరికి తమిళపదంగా మారిపోయింది.
తిరుపడితాము: పడిదెం అంటే జుర్రుకుంటూ తాగేదని! దీనికి తిరు చేర్చి తిరుపడిదెం-‘తిరుపడితాము’ అన్నారు. తిరుచుట్టు (గుడి ప్రహరీ), తిరు బోనం (నైవేద్యం), తిరునగరు: ధనికుల నగరం, దేవుడి ఊరు. తిరునాడు: వైకుంఠం, ఇలా చాలా మారుడు పదాలు కనిపిస్తాయి.
సురవరం ప్రతాపరెడ్డిగారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో దీన్ని ప్రస్తావిస్తూ, “భోజనము చేసినప్పుడు ‘అన్నము’ అనక ‘సాదము’ అని, ‘పరమాన్న’మనక ‘తిరుకణామధు’ అని, ‘భక్ష్యాలు’ అనక ‘తిరుపణ్యారము’ అని, ఈ విధముగా అన్నియు అరవము తోనే అడుగవలెను. లేకున్న వైష్ణవుడు మైల పడిపోవును. ఇది వైష్ణవము తెచ్చి పెట్టిన అరవ దాస్యము” అన్నారు.
ఇందులో దేవుడి పాత్ర, భక్తుల పాత్రా ఏమీలేవు. ఎవ్వరినీ ఇప్పుడు తప్పు పట్టి ప్రయోజనమూ లేదు. కాకపోతే, తెలుగు భాష కొచ్చేసరికి కొప్పుకు ముందు తిరుచేరిస్తే, ‘తిరుకొప్పు’ అంటే బోడి తల అనీ, క్షవరానికి ముందు తిరు చేరిస్తే, ‘తిరుక్షౌరం’ (ఉన్నది కాస్తా ఊడటం) అవుతున్నాయి. భక్తికీ భాషకూ ముడిపెట్టి ప్రయోగాలు చేస్తే, భాషాభక్తులు ప్రశ్నించటం సహజమే!

Wednesday 19 August 2015

గోదావరి తీరంలో నోరూరే అమృత ధారలు::డా. జి వి పూర్ణచందు

గోదావరి తీరంలో నోరూరే అమృత ధారలు

డా. జి వి పూర్ణచందు

రాజమహేంద్రి నుండి, కోనసీమ వరకూ విస్తరించిన భూభాగం గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటిది. తెలుగు సంస్కృతి అనగానే చేయెత్తి చూపించే నేల అది. గోదావరి డెల్టా రూపొందటానికి ముందే దానికా ప్రశస్తి ఉంది. నన్నయ నడిచిన పుణ్యభూమి, జగన్నాథ పండితుడికి జన్మనిచ్చిన సీమ, వీరేశలింగం సంస్కరణలు, శ్రీపాద కథలు, చిలకమర్తి ప్రహసనాలు, ప్రకాశంగారి నాటక ప్రదర్శనలకు వేదికైన పసిడినేల ఇది! కాటన్ మహాశయుడు అభివృద్ధికి బాటలు వేసిన హరిత వనం ఇది.
గోదావరి జిల్లాల వంటకాలలో తెలుగుదనం రంగరించి ఉంటుంది. తాపేశ్వరం కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, పల్లెసీమల్లో పరిమళించే అరిసెలు, సున్నుండలు, బొబ్బట్లు, బూందీ లడ్డూలు, కజ్జికాయలు, పొంగడాలు, గోరు మిఠాయిలు (గవ్వలు), పంచదార చిలకలు ఒకటేమిటీ గోదావరి పరీవాహక ప్రాంతం అంతా ఘుమఘుమలు, మధురిమల మయంగా ఉంటుంది. ఆస్వాదించ గలిగే మనసుండాలి అంతే!

పనసుపొట్టు కూర: గోదావరి పేరు చెప్పగానే, పనసపొట్టు పొరటు (కూర) మనసులో మెదుల్తుంది. విస్తారంగా పనస పండే ఇతర ప్రాంతాల్లో లేని ప్రత్యేకత ఇక్కడి ‘పనసపొట్టు కూర’లో కనిపిస్తుంది. ఆవపెట్టి వండటమే ఆ ప్రత్యేకత! “గోదావరి నీళ్ళు కొద్దిగా శీతవాతం చేస్తాయి, వాతహరంగా ఉంటుందని, ఆవపిండినీ, మెంతి పిండినీ కలిపి కూరలు చేస్తారు” అని పెద్దలు ఇందుకు ఒక కారణం చెప్పారు! వాతవ్యాధులున్నవారికి తరచూ ఆవపెట్టిన కూరలు మంచి చేస్తాయని దీని భావం.

పులిహోర: గోదావరి జిల్లాల్లొ పులిహోర రుచిలో కొద్దిగా ఘాటు కూడా ఉంటుంది. పులుపు, కారం, ఉప్పుతో పాటు, తీపి కోసం బెల్లాన్ని, వగరు-చేదుల కోసం కొద్దిగా ఆవపిండిని కూడా కలపటం వలన ఈ ‘గోదావరి పులిహోర’ ఆరు రుచుల్తో తియ్యగా, పుల్లగా, ఘాటుగా, ఘుమఘుమ లాడుతుంది.

కాజాలు: గోదావరి జిల్లాలకు పేరుతెచ్చిన మరో భక్ష్య విశేషం కాజా! మడతల మధ్య అంతర్వాహినిగా ప్రవహించే అమృత పాకం ‘తాపేశ్వరం కాజా’కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. దీన్ని తయారు చేసిన పోలిశెట్టి సత్తిరాజు గారు నిజంగా అమరులే! వీటిని ‘కాకినాడ కాజా’ అని కూడా అంటారు. పొరుగు జిల్లాల్లో విందు భోజనాలకు ఈ కాజా లేనిదే బాజా భజంత్రీలు మోగవు.

తరవాణి: గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో ఒకప్పుడు తరవాణి అన్నం ముఖ్యమైన ఉపాహారంగా ఉండేది. ప్రొద్దున్నే చలిదన్నం(చద్దన్నం)గా దీన్ని తినేవాళ్ళు! శుచిగా స్నానం చేసి, అన్నం వార్చిన గంజిని ఒక కొత్త కుండలో పోస్తారు. రుచి కోసం ఉప్పు, సువాసన కోసం దబ్బాకులు వేస్తారు. ఈశాన్యం మూల ఒక కుదురు పైన ఆ కుండ నుంచి మూకుడుతో మూసి గుడ్డతో వాసెన కడతారు. కుండ వెనక గోడమీద గుండ్రంగా పసుపు పూసి, పైడమ్మ ముఖం గీసి, కుంకుమబొట్టు పెడతారు. ఇలా తరవాణికి పవిత్రతను ఆపాదిస్తారు. ఉదయం నుండీ రాత్రివరకూ ఆ కుండలోని గంజి పులుస్తూ ఉంటుంది. రాత్రి పూట అన్నం కరుళ్ళు ఆ ద్రవంలో వేసి మళ్ళీ వాసెన కడతారు. మర్నాడు ఉదయం ఆ అన్నాన్ని గట్టిగా పిండి అందులో పెరుగునో, మజ్జిగనో, ఆవకాయనో కలుపుకుని తిని, ఆ ‘తేటద్రవాన్ని’ తాగుతారు. ఆ తేటద్రవమే ‘తరవాణి’! ఇవి వేసవిలో అమిత చలవ నిస్తాయి. శ్రోత్రియులు కూడా అనుష్ఠానాలు ముగించుకుని, వడకొట్టకుండా ‘తరవాణి అన్నం’ తిని, ‘తరవాణి’ త్రాగేవారు.
ఈ తరవాణి కుండని కొన్ని రోజులు అలానే కదల్చకుండా ఉంచితే బాగా పులిసి ఆల్కహాల్ శాతం పెరిగి అది ‘బీరు’ తో సమానం అవుతుంది. దాన్ని, సీసాల్లో పోసి ఉద్యోగస్తులైన తెల్లదొరలకు సరఫరా చేసి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఓ కోనసీమ వ్యాపారి లక్షాధికారి అయ్యాడని ఇప్పటికీ చెప్పుకుంటారు. యుద్ధకాలంలో బీరు దొరక్క, ఆ ఎండలకు తట్టుకోలేని బ్రిటిష్ వాళ్ళు ఈ తరవాణికి అలవాటు పడ్డారు. ఒక రోజు పులిసినంత మాత్రానే తరవాణిలో ఆల్కహాల్ తయారు కాదు. కాబట్టి, అది మాదక ద్రవ్యం అవదు. ఆల్కాహాల్ మానేయాలనుకునే వారు ఈ తరవాణి అన్నాన్ని, తరవాణిని పరిమితంగా తాగుతూ ఆ దురలవాటు లోంచి క్రమేణా బయట పడవచ్చు. ప్రయత్నించటం మంచిది.

తెలంగాణా సల్లచారు: తెలంగాణా గోదావరి తీరంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో సల్లచారు ప్రసిద్ధి. ఆంధ్రగోదావరి తీరంలో చల్లపులుసు లేదా మజ్జిగ పులుసు అంటారు. వండే విధానంలో ఈ రెండింటికీ కొంత తేడా ఉంది.
ఆంధ్రగోదావరి ప్రాంతంలో మజ్జిగపులుసుని ఇలా తయారు చేస్తారు: మజ్జిగలో కొద్దిగా శనగపిండి, ఉప్పు, కారం వేసి సన్నసెగన పొయ్యిమీద ఉంచి ఉడకబెడతారు. నానబెట్టిన శనగపప్పు, కొబ్బరి, అల్లం, ధనియాలు, మిరియాలు తగినంతగా తీసుకుని గట్టిగా రుబ్బి చిన్న ఉండలుగా చేసి తెర్లుతున్న ఆ మజ్జిగలో వేసి, కొద్ది సేపు ఉడకనిస్తారు. దీన్ని తేమనం అని కూడా పిలుస్తారు. ఇందులో వేసే ఉండలకు తిమ్మనలు అనే పేరుంది. ఉండలు చేయకుండా ఆ మిశ్రమాన్ని మజ్జిగలోనే కలిపి, అదనంగా వంకాయ, బెండకాయ, సొరకాయ, బూడిద గుమ్మడి, ఉల్లిపాయల ముక్కల్ని విడిగా ఉడికించి ఈ మజ్జిగలో కలిపి తెర్లబెడతారు.
తెలంగాణా సల్లచారు ఇందుకు కొంత భిన్నంగా కనిపిస్తుంది. అక్కడి పెద్దల్ని సంప్రదించినప్పుడు కొన్ని వివరాలు తెలిశాయి. మజ్జిగలో పసుపు, శనగపిండి బాగా వేగిన ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి మిశ్రమం వీటిని కలిపి సన్నసెగన ఉడక నిస్తారు. శనగపిండితో ఉండలు చేసి, నూనెలో వేయించి వాటిని ఉడికే మజ్జిగ పులుసులో కలుపుతారు. ఇదీ సల్లచారు. దీన్ని బజ్జీ మజ్జిగ పులుసు అనికూడా అంటారు. పచ్చిమిరప బజ్జీల్ని కూడా కొందరు కలుపుతారు.
మజ్జిగని ఉడికించకుండా కూడా సల్లచారును తయారు చేస్తారు. చిక్కటి మజ్జిగలో పచ్చిమిరప, కొత్తిమీర సన్నగా తరిగి, ఉప్పు తగినంత కలిపి పక్కన ఉంచాలి! నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి ఒక ఇనుప గరిటలోకి తీసుకుని, వేయించి ఆ వేడిగరిటని చల్లలో ముంచి మూత పెడతారు. చుయ్యిమనే శబ్దం వస్తుంది. అందుకే తాలింపును తిరగమూత, తిరగమోత పేర్లతో పిలుస్తారు. ఆంధ్ర గోదావరి ప్రాంతంలో దీన్ని చల్లచారు లేదా మెంతిచారు లేదా మెంతిమజ్జిగ అంటారు. వెల్లుల్లికి బదులుగా వాముని నలిపి మజ్జిగలో కలుతారు. తిరగమూత ఈ మెంతిచారుకు ప్రత్యేక రుచిని ఇస్తుంది.

అప్పడాలు: గోదావరి తీరంలో అప్పడాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అన్నంతో పాటుగా తినే అప్పచ్చులనవచ్చు! ఇవి ఆకలిని, జీర్ణశక్తిని పెంచి, భుక్తాయాసం రాకుండా చేస్తాయి. పొట్టు తీసిన మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, లేదా ఉలవ లతో అప్పడాలు చేస్తారు. ధాన్యపు పిండిలో ఉప్పు, పసుపు, ఇంగువ సర్జక్షారం కలిపి అల్లం+ వెల్లుల్లి రసంతో బాగా మర్దించి అప్పడాలు వత్తుతారు. మిరపకారం గానీ, నూనె గానీ రంగులు గానీ, ఇంకా ఇతర విషరసాయనాలు గానీ లేని ఈ అప్పడాలు సైనికుడి చేతిలో కత్తీ, డాలు మాదిరి ఆరోగ్యాన్ని కాపాడతాయి. సన్నసెగన కాల్చి, నెయ్యి రాసి, అన్నంలో విడిగా గానీ, కూర-పప్పు-పులుసు-పచ్చళ్ళతో గానీ తింటారు. వీటి స్థానంలో నూనెలో వేయించే మద్రాసు అప్పడాలు వచ్చి, ఇవి క్రమేణా కనుమరు గౌతున్నాయి.

తెలంగాణా గరిజలు: ఆంధ్రగోదావరి తీరంలో వీటిని కరిజలు అనీ, కరిజ- కర్జి- కజ్జి కాయలు అనీ పిలుస్తారు. తీపి వంటకం. నువ్వుల పప్పుతో కొందరు, వేరుశనగపప్పుతో కొందరు వీటిని తయారు చేసుకుంటారు, కొందరు గసగసాలపొడి కూడా కలుపుతారు.

పాలతారికలు: బియ్యపు పిండిని చిక్కగా కలిపి చక్రాల గిద్దలో వేసి కాగుతున్న పాయసంలో లావుగా చక్రాలు వత్తుతారు. ఏలకుల పొడి, పచ్చకర్పూరం, జీడిపప్పు, కిస్మిస్సులు ఈ పాలతారికలకు అదనపు శోభనిస్తాయి. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రసిద్ధ వంటకం ఇది. అమిత బలకరం తృప్తినిస్తాయి. ఆప్యాయతను కలిగిస్తాయి.

ఉక్కెర: ఉక్కెర అనగానే, “చక్కెర-ఉక్కెర పెడతాను, నీకాలికి గజ్జెలుకడతాను” అని పాతకాలం పాట గుర్తొస్తుంది. ఇప్పుడీ వంటకం దాదాపుగా అదృశ్యమైపోయింది. కాగుతున్న తియ్యని పాలలో మెత్తని బియ్యపు పిండి కొద్దికొద్దిగా వేస్తూ చిక్కబడే వరకూ కలుపుతూ నెయ్యి వేసి వండిన వంటకం ఉక్కెర. యాలకుల పొడి పచ్చకర్పూరం వగైరా సుగంథ ద్రవ్యాలు, నేతి ఘుమఘుమలతో నోరూరించే ఈ చక్కెర-ఉక్కెరను ఆస్వాదించాల్సిందే! బలకరం. పుష్టినిస్తుంది. కొత్త అల్లుళ్లకు ప్రత్యేక లాభాలు కలిగిస్తుంది. రంగులు, ఎస్సెన్సు వేసి తయారు చేసిన బజారు హల్వాల కన్నా ఈ తెలుగు ‘ఉక్కెర’ చక్కనైనది కదా!

తిమ్మనం: “రమ్మన్నారు తిమ్మన బంతికి”అంటారు. విందుభోజనంలో తిమ్మనం ఉంటే రమ్మన కుండానే వెళ్ళాలనిపిస్తుంది. నీరుపోసి, చిక్కగా కలిపిన బియ్యప్పిండిని మందపాటి వస్త్రంలో వేసి వడగట్టితే చిక్కని పాలలాంటి ద్రవం దిగుతుంది. బెల్లం పాకంలో ఈ పిండిపాలను కలిపి యాలకులు వగైరా సుగంథ ద్రవ్యాలు కలిపి తయారు చేసిన పాయసం ఇది. పాలు లేకుండా కాచిన ఈ పాయసాన్ని ‘తిమ్మనం’ అన్నారు. ఇది బాగా చలవ చేసే వంటకం. బలకరం కూడా!
పాఠోళి: గోదావరి తీరంలో పెద్దవాళ్లని అడిగితే చిన్నప్పుడు తాము తిన్న పాఠోళీ వివరాలు చెప్పారు. పాఠోళి అంటే ‘పప్పులతో వండి పొరటిన తెలుగు వంటకం’ అని నిఘంటువుల్లో కూడా ఉంది. శనగపప్పుని నానబెట్టి రుబ్బి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, ఇంగువ, కొత్తిమీర కలిపి ఉండలు కట్టి వాసెన మీద ఉడికించి, చల్లారాక పొడిపొడిగా నలుపుతారు. సాతాళించిన పెసరపప్పుని ఇందులో కలిపి ఈ మొత్తాన్ని భాండీలో నెయ్యివేసి తడి పోయే వరకూ వేయిస్తారు. ఇది తెలుగు వారి పాఠోళీ. గుజరాత్, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పాఠోళీ వండుతారు గానీ, దాని పద్ధతి వేరు. గోదావరి జిల్లాల్లో పాఠోళీ శనగపప్పు, పెసరపప్పు కలగలసి ఘుమాయిస్తుంది. రుచుల్లో కొత్తదనం కావాలంటే, ఈ ‘పాతమాధుర్యాల్ని’ కొత్తగా వండటం నేర్వాలి!

పాలకాయలు: బియ్యప్పిండిలో తగినంత పంచదారపొడి, మెత్తని ఉప్పు, కొద్దిగా వాముపొడి కలిపి వెన్నపూస, వేడినీటితో ముద్దగా చేస్తారు. ఈ ముద్దని లోపల ఖాళీగా ఉండేలా గొట్టాలు చుడతారు. ఆ గొట్టాల్ని దోరగా నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి. పాలను బాగా ఉడికించి తీసిన కోవా(పాలగుజ్జు)ని ఈ గొట్టం లోపలికి ఎక్కించి, పిండితో గొట్టాన్ని మూసి తిరిగి నూనెలో వేయిస్తారు. ఇవి పాలకాయలంటే! వీటికి దుగ్ధకూపికా అనే సంస్కృతం పేరుకూడా ఉంది. స్వీట్లంటే బెంగాలీ స్వీట్లేననే అభిప్రాయంలోంచి బయటకొస్తే మనవైన కమ్మదనాలు ఇలా చాలా కనిపిస్తాయి.

లప్పలు: ఒక రూక ఖర్చు పెడితే లక్ష్మణవఝుల వారింట దొరికే పదార్థాలలో శ్రీనాథుడు లప్పల్ని కూడా పేర్కొన్నాడు. ఆ రోజుల్లో లక్ష్మణవఝులవారి ఇల్లు ఒక బ్రాహ్మణ భోజన హోటలు. ఒక రూక ఇస్తే ఈ హోటల్లో కప్పురభోగి వంటకం, కమ్మని గోధుమపిండి వంటకాలు, గుప్పెడు పంచదార, నాలుగైదు నంజులు(పచ్చళ్ళు), కొన్ని లప్పలు, తియ్యని క్రొంబెరుగు ఇన్ని వడ్డించేవారట! ఆ “రూక భోజనం” ముందు మన నక్షత్రం హోటళ్ల భోజనం సరిపోలదేమో!
ఇంతకీ ఈ లప్పలేమిటీ? లప్ప అంటే ముద్దలాంటిదని! రవ్వ కేసరినో, హల్వానో విసట్లో ముందుగా వడ్డించినట్లే, 600 యేళ్ళ క్రితం లక్ష్మణవఝులవారి హోటల్లో లప్పల ముద్దలు వడ్డించేవారన్నమాట! ముందుగా పాలు పంచదార కలిపి మరగ కాయగా మిగిలిన కోవా(పాలగుజ్జు)ని పక్కన ఉంచుకోవాలి. నేతితో దోరగా వేయించిన గోధుమ లేదా బియ్యపు పిండిలో, ఈ పాలగుజ్జునీ, యాలకులు వగైరా సుగంథ ద్రవ్యాల్నికలిపి, మందపాటి బిళ్లలు లేదా ముద్దలుగా చేసి, ఆరబెడతారు. ఇవే ‘లప్ప’లంటే! భోజనంలో ఇవి నాలుగైదు వడ్డించే వాళ్ళన్నమాట. రంగులు, విష రసాయనాలు, కోక్ లాంటి మాదక ద్రవ్యాలు కలిసిన ‘స్టారుచాక్లేట్ల’ను పిల్లకు పెట్టటం కన్నా ఇలా లప్పలు చేసిపెట్టటంలో మాతృప్రేమ కనిపిస్తుంది కదా!
ఈ రోజుల్లో విస్తట్లో కొద్దిగా ఉప్పు వడ్డిస్తుంటే, ఆ రోజుల్లో గుప్పెడు పంచదార వడ్డించారు. జీవితం ఇప్పటికన్నా అప్పుడు నాణ్యమైన దనటానికి ఈ ఉదాహరణ చాలు!

సర్వపిండి: తెలంగాణా గోదావరి తీరంలో సర్వపిండి అనే వంటకం ప్రసిద్ధి. ఉప్పు, ఉల్లి, పచ్చిమిరప, అల్లం వీటిని ముక్కలుగా తరిగి నానబెట్టిన శనగపప్పు, తగినంత బియ్యప్పిండి కలిపి, వేణ్ణీళ్ళు చాలా కొద్దిగా పోసి ముద్దగా చేస్తారు. అరిటాకు పైన గాని బాదం ఆకు పైన గానీ లేదా పాలకవరు లాంటి మైనపు కాయితం పైన గానీ కొద్దిగా నూనె రాసి, ఈ ముద్దని దాని పైన ఉంచి వ్రేళ్ళతో గుండ్రంగా నొక్కుతారు. పిండి అంటకుండా వ్రేళ్ళకూ నూనె రాసుకుంటారు. ఇలా ఒత్తిన అట్టుని పెనం మీద గానీ మట్టి మూకుడు పైన గానీ కాలుస్తారు. దీన్ని ఆంధ్ర గోదావరి తీరంలో ‘మండెగ’ అంటారు. ఒక తప్పాల (వెడల్పాటి గిన్నె)ను పొయ్యిమీద బోర్లించి, అడుగు నుంచి మంట అందిస్తారు. గిన్నె పైభాగాన ఈ అట్టుని ఉంచి కాలుస్తారు. మండెగలతో, క్రొన్నేతితో భోజనాలు చేయటం గురించి శ్రీనాథుడు వర్ణించాడు. మండ, మండక అనే పేర్లుకూడా గోదావరి జిల్లాల్లో వ్యవహారం ఉంది. బళ్ళారిలో వీటిని చేయటానికి ప్రత్యేకంగా పొయ్యిలు ఉన్నాయట! ఒక విధమైన తండూరి ప్రక్రియలో కాల్చిన రోటీ ఇది. ఇతర ప్రాంతాల్లో వీటిని ‘తప్పాల చెక్కలు’ అంటారు. గుజ్జుగా కాచిన గోక్షీర పూరంబు అంటే పాలలో తడి ఆరిపోయేవరకూ కాచిన పాలగుజ్జు (క్రీము)ని రెండు మండెగల మధ్య పూసి తయారు చేసిన స్పెషల్ వంటకం ‘జమిలిమండెగ’ (బర్గర్)లను కూడా శ్రీనాథుడు వర్ణించాడు. బట్టర్ నాన్ లాంటి వంటకం ఇది. కానీ, దీన్ని తినటానికి అనవసరమైన కర్రీలు అవసరం లేదు. ఇవి ఆకలి తీర్చి సంతృప్తినిస్తాయి. స్థూలకాయం పెరక్కుండా చేస్తాయి. చలవనిస్తాయి.

తెలంగాణా కొరివి కారం: కొరవి లేదా కొరివి అనే మాట “ఫైర్‘బ్రాండ్” లాంటిది. కొరివిచీమ, కొరివిదయ్యం "కొరివితో తలగోరు కొనువారు గలరే" లాంటి ప్రయోగాలు- తీవ్రమైనది, తీక్షణమైనది అనే అర్ధంలో కనిపిస్తాయి. కొరివికారం అలాంటిది. పండు మిరపకాయలు, ఉప్పు, చింతపండు, ఇంగువ, కొద్దిగా మెంతిపండి కలిపి రుబ్బితే అది కొరివి కారం, నోరు మండుతున్నా, కడుపులో మండుతున్నా భయపడకుండా ఇష్టంగా తినే ఆహార పదార్ధం ఇది. దీన్ని ఎప్పటికప్పుడు ఇవతలకు తీసి ఉల్లి, కొత్తిమీర కలిపి తాజాగా తాలింపు పెట్టి వెన్నపూసతో తింటారు.

పొట్టెంకలు: తెలుగు వారంతా ఇడ్లీలు వండుకుంటారు. కానీ, కోనసీమ వారు పనస ఆకుల దొన్నెల్లో ఇడ్లీ పిండిని ఉంచి ఆవిరిమీద ఉడికించి తయారుచేస్తారు. ఈ దొన్నెల్ని ‘పొట్టెంక బుట్టలు’ అంటారు. పొట్టెంక(కొట్టెంక అనికూడా అంటారు) బుట్టల్లో వండిన ఇడ్లీలు(పొట్టెంకలు) భలే రుచిగా ఉంటాయి. పనస ఆకుల కారణంగా సుగంథ భరితంగా ఉంటాయి. వివాహ విందుల్లో ఇది గౌరవ నీయమైన వంటకం అక్కడ! శ్రావణ బహుళ అమావాస్య నాడు ‘పోలాల అమావాస్య’ అని ఒక పండగ చేస్తారక్కడ! కంద మొక్కకి పూజచేసి కథ చదివి అక్షింతలు వేసుకుని ఈ పొట్టెంకల్ని నైవేద్యం పెట్టే ఆచారం అక్కడుంది.

పూతరేకులు: నున్నటి కుండను బోర్లించి, దాని మూతి భాగానికి దగ్గరగా పెద్ద రంధ్రం చేసి అందులో కట్టెలు పెట్టి వెలిగిస్తారు. ఆ కుండే పొయ్యిగానూ, పెనంగా కూడా ఉపయోగపడుతుంది. ఆ కుండ పై భాగాన, ఒక రోజు పులిసిన అట్లపిండిని ఉల్లిపొర అంత పలుచగా అట్టు పోసి మడకుండా కాలుస్తారు. ఇలా తయరైన రేకులకు పంచదార పొడిని నెయ్యి వేసి కలిపి పలుచగా పూసి మడతలు వేస్తారు. పూతరేకు లంటే ఇవే! ఆత్రేయపురం వీటి తయారీకి ప్రసిద్ధి. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఆకివీడుల్లో కూడా ఇవి బాగా తయారౌతాయి. 

ములక్కాడ పాయసం: ఎవరికీ రాని ఆలోచన వచ్చినప్పుడే కదా ప్రత్యేకత నిలుస్తుంది. కోనసీమకు అలాంటి ప్రత్యేకత ఎప్పుడూ ఉంది. ములక్కాడల పై తోలుని చెక్కి, ముక్కలు పాలలో వేసి పాయసం తయారు చేస్తారు. దాని రుచి వర్ణనాతీతం. ములక్కాడలు బాగా దొరికే సీజన్లో దీన్ని ప్రయత్నించి చూడండి. మళ్ళీ మళ్ళీ వండుకుంటారు.
గోదావరి జిల్లాల వారు ఏది వండినా ఇతర ప్రాంతాల వారికన్నా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. అన్ని రంగాలలోనూ ఆ ప్రత్యేకతను చాటుకోవాలనే తపన ఆ నీరు తాగిన వారిలో సహజం. ఆ ప్రత్యేకత గుణాత్మకంగా, ఆచరణాత్మకంగా మాత్రమే కాదు, అనుసరణియంగా కూడా ఉంటుంది. గోదావరి తీరంలో అమృత ధారలు నోరూరిస్తూ ఉంటాయి.

ఆవకాయ: గోదావరి జిల్లాల వారు ఆవకాయ పెట్టినా అందులోనూ ప్రత్యేకతే! ఆవపిండి, ఉప్పు, మెంతులతో పాటు తురిమిన బెల్లం కలిపి కొద్దిగా నూనె వేసి ఈ మిశ్రమాన్ని మామిడి ముక్కలకు పట్టించి, ఎండబెడతారు. ఇతరులు పులుపు, ఉప్పు, కారాలకు ప్రాధాన్యం ఇస్తే, ఈ “గోదావరి ఆవకాయ” తీపి, వగరు, చేదుని కూడా తనలో ఇముడ్చుకుని ఆరు రుచుల అద్భుత ఆహార పదార్ధం అవుతోంది. కాయావకాయ ఇంతకన్నా గమ్మత్తుగా ఉంటుంది! మామిడి కాయని గుత్తి వంకాయ మాదిరి ముక్కలు విడిపోకుండా నాలుగా పక్షాలుగా కోసి, ఆవపిండి ఉప్పు వగైరా కలిపిన పిండిని గుత్తికాయలో కూరి, మూడు రోజులు ఊరనిస్తారు. అప్పుడు నూనెపోసి జాడీలో భద్రపరుస్తారు. అతిథులకు ప్రత్యేకం ఈ `కాయావకాయ’.

తెలంగాణా సకినాలు:
ఆంధ్రగోదావరి తీరంలో వీటిని మణుగుపూలు అంటారు. బాగా నానిన బియ్యాన్ని తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించాలి. ఈ పిండిలో దోరగా వేయించిన నువ్వుపప్పు, వాము, ఉప్పు కూడా వేసి నీళ్ళు పోసి ముద్దగా కలపాలి. సన్నని బలపాల్లాగా చేసి, ఒక బట్టపైన ఈ బలపాన్ని గుండ్రంగా రెండుమూడు వలయాలుగా చుట్టి, కొద్దిగా తడి ఆరాక నూనెలో వేయిస్తారు. ఇవి నిలవుంటాయి. బలకరం, జబ్బు చెయ్యవు. పిల్లలకు పెట్టదగిన ఆహారం.

Saturday 15 August 2015

తెలుగింటి పుల్కాలు డా. జి వి పూర్ణచందు

తెలుగింటి పుల్కాలు      
డా. జి వి పూర్ణచందు  
 కాశీఖ౦డ౦ కావ్య౦లో శ్రీనాథ మహాకవి అ౦గరపూవియఅనే వ౦టకాన్ని ప్రస్తావి౦చాడు. దోసియలు సేవియలు న౦గర పూవియలు, సారసెత్తులు, జొత్తరలు చక్కిల౦బులు ఇలా సాగుతుంది శ్రీనాథుడి కాలం నాటి వంటకాల పట్టిక. ఈ అంగర పూవియ, అంగార పూలు, అంగార పోలికలు, అంగరొల్లెలు ఇలా అయ్యలరాజు నారాయణామాత్యుడు, గణపవరపు వే౦కటకవి లాంటి ఇతర కవులు కూడా కొన్ని వంటకాలను ప్రస్తావించారు. మన ప్రాచీన వంటకాలకు మన సాహిత్యాధారాలే ముఖ్యమైనవి. వాటి గురించి మన వ్యాఖ్యాతలు గానీ, మన నిఘంటు కర్తలు గానీ ఒక భక్ష్య విశేషం అని వ్రాసి ఊరుకోవటం చేత ఆ నాటి పేర్లు, ఆ వంటకాల తీరూ ఏదీ మనకు తెలీకుండా పోయింది. ఒక విధంగా ఇది దురదృష్టకరమే!
బసవ పురాణ౦లో పోలెఅనే వ౦టకం ప్రస్తావన ఉంది. బసవపురాణం వెయ్యేళ్ళ క్రితం తెలుగు ప్రజల సాంఘిక చరిత్రకు ఒక లిఖిత పూర్వక సాక్ష్యంగా గ్రహించ వలసిన గ్రంథం. పాల్కురికి సోమనకు పూర్వ కవులు సాంఘిక జీవనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ బాధ్యతను నెరవేర్చిన వాడు సోమన.
ఆప్టే స౦స్కృత నిఘ౦టువులో పోలికాపదానికి గోధుమ పి౦డితో చేసిన భక్ష్య విశేష౦ అనే అర్థ౦ ఉ౦ది. గోధుమ పి౦డిని తడిపి, నెయ్యి లేక నూనెతో మర్ది౦చి ముద్దగా చేసిన దాన్ని పోలిఅ౦టారు. పోలితో చేసిన వ౦టక౦ పోలికలేదా పోళిక. పోళీఅనే ప్రయోగ౦ కూడా ఉ౦ది. పలుచగా వత్తి, కాల్చిన రొట్టెని మరాఠీలో పోలె౦అ౦టారు. ద్రావిడ భాషల్లో పొలి, పోలి పదాలు పొ౦గారు, పెద్దదగు అనే అర్థాలలో కన్పిస్తాయి. పూర్వ ద్రావిడ భాషలో pol-i- పదానికి to acquire, gain, prosper అని అర్థం. ద్రవిడియన్ ఎటిమలాకకకల్ డిక్ష్నరీ DEDR 4550లో కూడా ఇదే అర్థ౦ కనిపిస్తుంది. ఒత్తిన పోలిని కాల్చి పొంగించింది పోలికకావచ్చుప్రాకృత౦లో పోలి-”, స౦స్కృత౦లో పోలికతెలుగు తదితర ద్రావిడ భాషల్లో పూప, పోపిక, పౌల్చ, పోల్చ, పోళిక పదాలు కాల్చిన రొట్టె అనే అర్థాన్నే ఇస్తున్నాయి. నిప్పులమీద గానీ. సన్న సెగమీద గానీ కాల్చి తయారు చేసిన రొట్టెల్ని పోళి, పోలిక పుల్కా ఇలా పిలిచి ఉంటారని ఒక ఊహ చేయవచ్చు. పోళీ అ౦టే బొబ్బట్టు అని తెలుగు వ్యుత్పత్తి కోశ౦లో ఉ౦ది. కన్నడ౦లో పోలిగె, మోళిగే అ౦టే, పెన౦ మీద కాల్చిన బియ్యపు పి౦డి రొట్టె అని!
ఇంకో కోణంలోంచి పదాన్ని పరిశీలిద్దాం: తెలుగులో పోలుశబ్దానికి ప్రాచీన యుగాల నుండీ వృత్తిపరంగా వస్తున్న మరో అర్థ౦ కూడా ఉ౦ది. ఇదే ముఖ్యమై౦ది కూడా...! కు౦డలు చేయట౦ కోస౦ జిగురు వచ్చే౦తవరకూ మట్టిని మర్దించి సారె మీద లి౦గాకార౦లో ఉ౦చిన ముద్దని పోలుఅ౦టారు. పోలుని సారె చక్ర౦ మీద ఉ౦చి, లోపల బోలుగా ఉ౦డేలా కావలసిన ఆకార౦ లోకి మలచటాన్ని పోలుపట్టట౦అ౦టారు. కు౦డల తయారీ మన ప్రాచీన విద్య. తెలుగువారి తొలినాటి విద్యలకు స౦బ౦ధి౦చిన సా౦కేతిక పదాలు తెలుగు భాషలోనే రూపొ౦దుతాయి. జాతి ప్రాచీనతకు భాష ప్రాచీనతకు వృత్తిపరమైన పదాలు ఎంతగానో ఉపయోగిస్తాయి. క్రమేణా ఇలా౦టి సా౦కేతిక పదాలు నిత్యవ్యవహార౦ లోకి కూడా చేరి అనేక కొత్త అర్థాలనిస్తాయి. కు౦డల తయారీకి స౦బ౦ధి౦చిన పోలిఅనే పదాన్ని జిగురు వచ్చేదాకా మర్ది౦చిన పి౦డి ముద్దకు తెచ్చి ఆపాదించటమే ఇ౦దుకు తార్కాణ౦.
కార్తీక మాస౦ అమావాస్య వెళ్ళిన పాడ్యమి తెల్లవారుఝామున పసుపు ముద్ద(పోలి)తో చేసిన గౌరమ్మను పూజి౦చి, అరటి దొన్నెలలో దీపాలు వెలిగి౦చి నీళ్ళలో వదులుతారు. పోలిని స్వర్గానికి ప౦పే కార్యక్రమ౦ ఇది. పసుపు ముద్ద(పోలి) పూజలో ప్రధానమై౦ది. పోలి శబ్దం తడిపిన పిండి లేదా మట్తి ముద్దని సూచిస్తోంది. గోధుమ పి౦డితో పోలెను తయారు చేసి, పలుచగా గు౦డ్ర౦గా వత్తి, సన్నసెగను కాలిస్తే అది పోలిక. దాన్నే ఇప్పుడు పుల్కా అ౦టున్నారు. తెలుగు పోలె లేదా పోలికలకు ఆధునిక రూపమే పుల్కా! వెయ్యేళ్ళుగా తెలుగు ప్రజలు కమ్మగా తయారుచేసుకుని తింటూ రుచిని ఆశీర్వదించిన తెలుగింటి వంటకం ఇది. ఇవి తక్షణం శక్తినిస్తాయి. ప్రధాన ఆహారంగా ఉపయోగపడతాయి. వరి అన్నానికి బదులుగా తినవలసినవి.
ఈ మధ్య హోటళ్లవాళ్ళు ఒకటో రెండో పూరీలు లేదా పుల్కాలు వడ్డించి ఆంధ్రాభోజనం అని పిలుస్తున్నారు. ఇది ఆంణ్ధ్రాభోజనం ఎలా అవుతుంది. ఆంధ్రులకు పూరీని అన్నానికి ముందు తినే అలవాటు ఎక్కడిదీ? అలా తినటం వలన జీర్ణశక్తి మందగించి అపకారమే చేస్తుంది.