Wednesday 2 December 2020

 

ఆంధ్రత్వం,  ఆంధ్రభాషలు తపఃఫలాలని భావించిన తెలుగు ప్రముఖుడు శ్రీ అప్పయ్య దీక్షితుల వారి జీవిత చరిత్రను వారి 500వ జయంతి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర ప్రచురణల సంస్థ ప్రచురించింది.ఈ కరోనా కట్టడి సమయంలో నేను వ్రాసిన 4 గ్రంథాల్లో  ఇది ఒకటి. హరిచరణ స్మరణ పరాయణ శ్రీనారాయణ తీర్థులవారి జీవిత చరిత్రను,  భోజనం భాగ్యం ఆహార వైద్య గ్రంథాన్ని,  నవకరోనా - నిజాలు వైద్య గ్రంథాన్ని కూడా శ్రీ రాఘవేంద్ర సంస్థ వారు ప్రచురిస్తున్నారు.  డిసెంబరు 25, 26, 27 తేదీలలో జూమ్ ద్వారా మాడభూషి  సాహిత్య కళా పరిషత్ ఆధ్వర్యంలో  జరగనున్న "డా. జి వి పూర్ణచందు జీవితం  సాహిత్యం  వ్యక్తిత్వం" సదస్సులో ఆవిష్కృత మవుతున్నాయి.  విశాలాంధ్ర ఆదివారం సంచికలో నేను వ్రాసిన పద్యానుభవం వ్యాసాలను ఎమెస్కో సంస్థ వారు పద్యరాగాలు పేరుతొ ప్రచురిస్తున్నారు.  ఈ పుస్తకం కూడా ఆ సదస్సులో ఆవిష్కరణ అవుతుంది.  దీర్ఘకాలంగా అచ్చువేయకుండా నేను అలసత్వం వహించిన ముక్కాలు 2వ భాగం 6భాషల్లో  అనువాదం తో  పుస్తకంగా ఈ సభలోనే విడుదల చేస్తున్నాను.  పెద్దల ఆశీస్సులు ప్రార్థిస్తున్నాను. హరహర మహాదేవ పాఠకులకు అందుబాటులో ఉంది.  దాన్ని శ్రీరాఘవేంద్రరావుగారు నెంబర్ +919849181712ద్వారా పొందవచ్చు.