Wednesday 28 October 2015

తెలుగు షార్ట్ film ''LIVE'' ని గెలిపించండి ! dr. g v purnachand

తెలుగు షార్ట్ film ''LIVE'' ని గెలిపించండి !

'ది ఎక్స్ -రే మాన్' అనే ఇంగ్లీష్ నవలతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన మన తెలుగు రచయిత మోహన రావు దురికి - (Mohan R D) రచించి దర్శకత్వం వహించినతెలుగు షార్ట్ ఫిలిం అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 'గోల్డెన్ పండా నార్త్ అమెరికా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2015' నిర్వహించే పోటీ ఫైనల్ స్టేజికి వచ్చిన 200  షార్ట్ ఫిలింలో 37 ర్యాంక్ లో  LIVE ( 'బతుకు' ) నిలబడింది. దాదాపు కొన్ని వేల షార్ట్ ఫిలింలను ఎదుర్కొంటూ ఈ  స్థాయికి ఇండియా నుంచి ఈ  షార్ట్ ఫిలిం రావడం విశేషం. ఇక తుది ఎంపికను ప్రేక్షకుల చేతిలో పెట్టారు నిర్వాహకులు.
మీరు 
పేజిని తెరిచి 37 బాక్స్ లోని LIVE - Mohan R D పేరు పక్కనున్న రెడ్ బాక్స్ లోని VOTE మీద వరుసగా మూడు సార్లు క్లిక్ చేయలి. ఇలా రోజుకు మూడు సార్ల చొప్పున నవంబర్ 19 తేది రాత్రి 12;00 వరకు ఓట్లు వేసి మన తెలుగు షార్ట్ ఫిలింని గెలిపించాలని మోహన్ అర్ డి కోరారు.

ఇప్పటికే ఈ షార్ట్ ఫిలిం తెలంగాణా స్టేట్ నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీలో జ్యూరీ అవార్డు గెలుచుకుంది. 'తెలంగాణా సినిమా అండ్ కల్చర్ అసోసియేషన్', 12 నేషనల్ అవార్డులు గెలుచుకుని సంచలనం రేపింది. Please send this letter to your friends in face book/twitter/LinkedIn / or any social media and bless our Telugu author to come out at international stage.

మోహన రావు దురికి - (Mohan R D)  అమెరికాకు వెళ్ళ కుండానే  అమెరికా వాళ్ళ  సంస్కృతీ, సంప్రదాయం మీద రాసిన తొలి ఇంగ్లీష్ నవలగా  'ది ఎక్స్ -రే మాన్'  రాసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు . ఇప్పటివరకు 'విష్ణు' లాంటి 12 సినిమాలకు కథా మాటలు రాసిన మోహన రావు దురికి ఓ తెలుగు వాడి సత్తాను అంతర్జాతీయంగా  చాటేలా మనం  ఓటు వేసి గెలిపిద్దాం.

న్యాయంగా పాలిస్తే బంగారంవాన :: డా. జి వి పూర్ణచందు

న్యాయంగా పాలిస్తే బంగారంవాన
డా. జి వి పూర్ణచందు
చతురంగ బలములు విజయవాడ దుర్గాంబ వరమున బడసి దుర్వార లీల
            జగతి స్థలంబెల్ల సాధించి జయ శాసనములు దిగ్ధంతి దంతముల సలిపి
పేదబాలునకు గా బ్రియసుత మోహంబు పట్టక బెజవాడ బాడి నిలిపి
కలయంగ బురమున గాంచన వర్షంబు గురియించి దేవతా కోటి పొగడ….”
ఇది దగ్గుపల్లి దుగ్గన రచించిన నాసికేతోపాఖ్యానము కావ్యంలో పద్యం ఇది. ఇందులో విజయవాడ విష్ణుకుండిన రాజు మాథవవర్మ గురించిన కథ మొత్తం నాలులైన్లలో చెప్పేశాడు కవి. నిజానికి  తలగడంత పుస్తకమే వ్రాయగల సమాచారం ఈ కథకు ఉన్నప్పటికీ దుగ్గన కవి `కట్టె కొట్టె, తెచ్చె, వదిలె అని రామాయణం చెప్పినట్టు నాలుగు వాక్యాల్లో ఈ కథను ఇమిడ్చి, ఈ పద్యం చెప్పాడు.
మాధవవర్మ విజయవాడ దుర్గాంబ దయతో చతురంగ బలాలూ సముపార్జించుకున్నాడు. అనేక ప్రాంతాలు జయించి జయ శాసనాలు నెలకొల్పాడు. ఒక పేదబాలుడు రధం కిందపడి చనిపోతే అతని చావుకు కారకుడైన తన కొడుకుని, పుత్ర వాత్సల్యం చూపించకుండా మరణ శిక్ష విధించి, బెజవాడ కీర్తిని చాటాడు. దాంతో దేవతాకోటి పొగిడి, నగరంలో బంగారంవాన కురిపించారు. ఇదీ ఆ నాలుగు మాటల కథ.
ఎవరీ మాథవవర్మ...? మన  విజయనగరం జిల్లా విజయనగరం సంస్థానాధీశులైన పూసపాటివారి తాత ముత్తాతల ముత్తాత తాత ఈ మాథవవర్మ. విష్ణు కుండినులు క్రీ. శ. 4 నుండి 7వ శతాబ్దివరకూ 23జిల్లాల ఆంధ్రప్రదేశ్‘ని పాలించిన ఘనులు. వాళ్ళకు ఆ రోజుల్లో చాలా రాజధాని నగరాలుండేవి. బెజవాడ వాళ్ల ప్రధాన రాజధాని.
14-15 శతాబ్దాల వాడైన దుగ్గన కవి ఈ పద్యంలో విజయవాడ, బెజవాడ అని, రెండు పేర్లూ వాడాడు.  ఆ కాలంలో బందరు-మచిలీపట్టణం అన్నట్టు ఈ రెండు పేర్లూ పర్యాయాలుగా వాడుకలో ఉండి ఉంటాయి.
విష్ణుకుండినులు జైన బౌద్ధాలకు వ్యతిరేకంగా వైదిక ధర్మాలను, వైదిక దేవతలను, సంస్కృతభాషను బాగా ప్రోత్సహించి, ఉత్తరాది వారికి ఆశ్రయాన్ని కల్పించారు. ఆ ఉత్తరాదివాళ్ళు తెలుగు వాళ్లలో తెలుగువాళ్లుగా కలిసి పోయారు. కానీ, మన వాళ్ళు తాము తెలుగువాళ్ళం అన్న సంగతి మరిచిపోయి, సంస్కృత భాషకు దాసోzహం అన్నారు. ఇప్పుడు  ఇంగ్లీషు విషయంలో జరిగిందే అప్పట్లో సంస్కృతం విషయంలో జరిగింది. సంస్కృత మెకాలేలు తెలుగు పేరెత్తనీకుండా పాలించారు. మాతృభాషాభిమానం మన రక్తంలోంచి తపుకోవటానికి ఇది కూడా కారణమే!
ఏది ఏమైతేనేం క్రీ. శ. 4వ శతాబ్దికి చెందిన మాధవవర్మ గారు బెజవాడ ప్రశస్తిని నిలబెట్టారు. మాధవర్మని మెచ్చుకోవటం కోసం దుర్గమ్మ బంగరు వాన కురిపించి తాను‘ కనకదుర్గ’ అయ్యింది.
పాలకుడు న్యాయబద్ధంగా వ్యవహరించాలే గానీ, దుర్గమ్మ బెజవాడలోనే కాదు, పాలకుడి ఇంటి పెరట్లో కూడా కనక వర్షం కురిపిస్తుంది. బెజవాడలో తుఫానులు తప్ప మామూలు వానలు అరుదు.  వాన అనేది కురిసినా కురవకపోయినా బంగారు నాణాల వడగళ్ళు మాత్రం పడతాయని దుగ్గన కవి గారి నమ్మకం. అందుకే, తన కావ్యాన్ని అంకితం ఇచ్చుకునే సందర్భంలో బెజవాడ మాధవవర్మను తలచుకున్నాడు.
బండిని ఎవరు నడుపుతున్నా యాక్సిడెంట్ అయినప్పుడు, బండి యజమానే నష్టపరిహారం ఇచ్చుకోవాలనేది మాథవర్మ తీర్పు సారాంశం. సుప్రీంకోర్టు కూడా బండి యజమానిని బాధ్యుణ్ణి చేస్తూ  తీర్పు నిచ్చింది. అందుకే యజమాని ప్రతి ఏడాది థర్డ్‘ పార్టీ  ఇన్సూరెన్సు కడుతున్నాడు. మన బండి వెళ్ళి అవతలివాడిమీద పడనవసరం లేదు, అవతలివాడే వచ్చి మన బండిమీద పడి దెబ్బతిన్నా థర్ద్ పార్టీ ఇన్సూరెన్సు ఉపయోగపడుతోంది.
మన చరిత్ర కథల్లో నేటి కాలానికీ వర్తించేవి చాలా ఉన్నాయి. వాటిని ఆపాదించుకో గలగాలి అంతే!