కమ్మని చిమ్మిలి కథ
డా. జి వి పూర్ణచ౦దు
‘‘చిమ్మిలి’’ అనే పేరు వినగానే ఆడవాళ్లకు సంబంధించిన పేరంటం విశేషాలు గుర్తుకొస్తాయి.‘నువ్వులు’ వాడకం తెలుగు వారికి
ఎక్కువ ‘ఎనువులు’ అంటే నల్లగా వుండేవని.గేదెల్ని దున్నపోతుల్ని ఎనుములంటారు అందుకే!
జన వ్యవహారంలో నల్లగా వుండే గింజలు- ఎనుములు పదంలోంచి ‘అచ్చు- ‘ఎ’ - లోపించి‘నువ్వులు’ పదం బాగా వ్యాప్తిలోకి
వచ్చింది. నువ్వులలో చిమిలి, చిమ్మిలి అని రెండు ఆహార పదార్థాలు తయారు చేస్తారు.‘చిమిలి’ అంటే నువ్వుల్ని గానుగ
ఆడించిన తర్వాత మిగిలిన పిప్పి. ఈ చిమిలిని పశువుల మేతలో కలుపుతారు బాగా ‘పాలు’ ఇస్తాయని. రెండవది
చిమ్మిలి. చిమ్మిరి అని కూడా అంటారు. నువ్వులు బెల్లం కలిపి నూరిన ఉండల్ని చిమ్మిరుండలు
లేదా చిమ్మిలుండలు అంటారు.సంస్కృతంలో ‘తిలగోళం’ అంటారు.సంస్కృతంలో
‘తిలగోళం’ అంటారు. వీటికే ‘నౌజుండలు’ అనే పేరు కూడా ఉంది.
నౌజు అంటే నువ్వులకు సంబంధించినదని, ‘నౌజు’ పదానే్న ‘లౌజు’ అని కూడా పిలుస్తుంటారు.
కొబ్బరి, నువ్వులు, బెల్లం మూడింటినీ కలిపి దంచి ఉండలు కట్టితే ‘లౌజుండలు’ అవుతాయి. బెల్లం పాకం
పట్టి కూడా లౌజుండలు చేస్తుంటారు. ‘చిమ్మిలి’ లేదా ‘చిమ్మిరి’కి అదనపు రుచిని కొబ్బరి ఇస్తోంది. జీడిపప్పు, కిస్మస్ ల్లాంటివి
కూడా కలుపుకో వచ్చు.
నువ్వుండలు, చిమ్మిరుండలు, నౌజుండలు అలాగే నూటిడి, నూవుండలు ఇలా చాలా
పేర్లతో చిమ్మిలిని పిలుస్తున్నాం. ‘పలలం’ అనే పిలుపు కూడా ఉంది.
‘చింబిలి’ అని కూడా పిలుస్తారు. ‘చిమ్మిరి’ అనే పదంలోనే ముద్ద
లేదా ఉండగా చేయటం అనే అర్థం వుంది. అందుకని చిమ్మిరుండ అనవలసిన అవసరం లేదు. కన్నడంలో
చిగళి, చిగుళి, చిమిలి అని పిలుస్తారు. సంస్కృత ‘శష్కులి’కి చిమ్మిలికీ భాషాపరంగా
ఏమీ సంబంధం లేదనుకొంటాను.
చిమ్మిరికి నల్ల నువ్వులు, పొట్టు తీసిన తెల్ల
నువ్వులు రెండింటినీ ఉపయోగిస్తుంటారు. బాగా రుచికరం కాబట్టి ఇష్టంగా తినదగిన ఆహార పదార్థం
చిమ్మిరి.వాతరోగాలు కీళ్ళ నొప్పులు వగైరా వున్న వారికి మంచి చేస్తుంది. అయితే బాగా
వేడి చేసే స్వభావం ఉంటుంది కాబట్టి, వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళు పరిమితంగా వాడుకోవాలి.లేకపోతే
కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. ఎసిడిటీ ఉన్న వాళ్ళు దీన్ని తినకుండా ఉండడమే మంచిది.
జీర్ణ కోసం బలంగా ఉన్న వారికి ఇది ఏ అపకారం చెయ్యదు గానీ, అజీర్తి ఉన్నవాళ్ళు
మాత్రం చాలా జాగ్రత్తగానే తీసుకోవాల్సి వుంటుంది.
దగ్గు, జలుబు, ఉబ్బసం, రక్తస్రావాలు, నెలసరి సమయాలలో ఉన్నవారు చిమ్మిరి తింటే ఆయా
బాధలు పెరుగుతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది.
పక్కతడిపే పిల్లలకు చిమ్మిరి పెడితే ఆ అలవాటు ఆగుతుందని బాగా
ప్రచారంలో ఉన్న ఒక నమ్మకం. అయితే పిల్లలు మూత్రానికి వెళ్లవలసి వచ్చినప్పుడు మొద్దు
నిద్ర వారిని లేపి బాత్రూంలోకి వెళ్లేలా అలవాటు చేయటం ఉత్తమ పద్ధతి.