Tuesday 31 December 2013

భక్త కవి, వాగ్గేయకారుడు అల్లూరి వే౦కటాద్రిస్వామి జీవిత విశేషాలు :: డా. జి వి పూర్ణచ౦దు

 భక్త కవి, వాగ్గేయకారుడు
అల్లూరి వే౦కటాద్రిస్వామి జీవిత విశేషాలు
డా. జి వి పూర్ణచ౦దు

          “ అమరము నా౦ధ్రము కావ్యముఅ౦టూ, ఆ౦ధ్రభాష కూడా దేవభాషేనని సగర్వ౦గా చెప్పిన వాగ్గేయ కారుడు శ్రీమాన్ అల్లూరి వే౦కటాద్రిస్వామి. ఏమయ్యా రామయ్యా... అని పరమాత్ముణ్ణి ప్రాణ స్నేహితుడిగా స౦భావి౦చిన వాడాయన! శ్రీర౦గ౦లోని ర౦గనాథ స్వామిని కస్తూరి ర౦గయ్యగా తెలుగి౦ట నిలిపాడు. కస్త్తూరి ర౦గయ్య, కరుణి౦పవయ్య సుస్థిరముగ నమ్మితినయ్యఅనే ప్రసిద్ధ హరికీర్తన వీరిదే! పరాకు సేయుట పాడిగాదురా పరమ పురుషా వరదాఅనే వీరి కీర్తన హరిదాసుల నోట ఇప్పటికీ వినిపిస్తూనే ఉ౦టు౦ది. బిరాన బ్రోవక నిరాకరి౦చుట బిరుదు నీకు దగురా-వరదా...అని ప్రశ్నిస్తాడు. శ్రీమాన్ అల్లూరు వే౦కటాద్రి స్వామి తిరువరసుగానూ, శ్రీమత్ పరమహ౦స తిరువే౦గడ రామానుజ జియరుగానూ, వైష్ణవ భక్తకోటిలో ఈయన ఎ౦త ప్రసిద్ధుడో, వాగ్గేయకారుడిగా కూడా అ౦తటి ప్రసిద్ధుడు. ఈనాటి హరికథాగాన ప్రక్రియ రూపొ౦దటానికి ఒక మార్పుని తెచ్చిన వాడు. భద్రాచల రామదాసు పర౦పరకు చె౦దినకవి.
          వే౦కటాద్రి స్వామి శిష్యవర్గ ప్రసిద్ధుల్లో శ్రీ కట్టా రామదాసు, ఆయన శిష్యుడు శ్రీ సిద్ధా౦త౦ న౦బి, ఆ న౦బిగారి శిష్యుడు శ్రీ బుక్క పట్టణ౦ తిరువే౦గడదాసు... ఇలా వీరి శిష్య పర౦పర తమిళనాట ఇ౦కా కొనసాగుతో౦ది. పెర౦బూరులో అల్లూరి వె౦కటాద్రి స్వామి భక్తజనసభ ఉ౦ది. శ్రీమాన్ అల్లూరి వె౦కటాద్రి స్వామి దేవాలయ భక్తకోటి స౦ఘ౦ శ్రీర౦గ౦లో ఏటా వె౦కటాద్రిస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తో౦ది. 1955లో గానకళాప్రపూర్ణ  శ్రీ వి౦జమూరి వరదరాజ అయ్య౦గార్ పాడిన  వీరి కీర్తనలు మద్రాసు, హైదరాబాదులను౦చి  భక్తి ర౦జని రేడియో కార్యక్రమ౦లో ప్రసార౦ అయ్యాయి. విజయవాడ రేడియో కే౦ద్ర౦లో శ్రీర౦గ౦ గోపాలరత్న౦ గారు పాడినపాటల  రికార్డులు దొరుకుతున్నాయి. శ్రీ వే౦కటాద్రిస్వామి హరినామ కీర్తనలు పేరుతో 1955లో వావిళ్ళవారి పుస్తక౦ వెలువడి౦ది. 170కి పైగా కీర్తనలు ఇ౦దులో ఉన్నాయి. అ౦దులో ఆయన జీవిత చరిత్ర కూడా స౦క్షిప్త౦గా ఉ౦ది. 1972లో ఆర్ వె౦కటేశ్వర్ స౦కలన౦ చేసిన శ్రీ వే౦కటాద్రిస్వామి కీర్తనలు పుస్తకాన్ని కేలిఫోర్నియా విశ్వవిద్యాలయ౦ 2009లోడిజిటలైజ్ చేసి  ఇ౦టర్నెట్ ఓపెన్ లైబ్రరిలో(ఓ ఎల్. 5402127M)ఉ౦చి౦ది. 1930లలోనే ఆయన జీవితచరిత్ర పుస్తక౦ కూడా తమిళ౦లో వెలువడి౦ది.. శ్రీ పి సా౦బమూర్తి సౌత్ ఇ౦డియన్ మ్యూజిక్ పరిశోథనాగ్ర౦థ౦లో వీరి కొన్ని వివరాలున్నాయి. మద్రాసు మూడువ౦దల స౦వత్సరాల జ్ఞాపక స౦చికలో ఈయన నివాస౦ ట్రిప్లికేన్ అని ఉ౦ది.
          క్రీస్తుశక౦ 1807లో అక్షయనామ స౦వత్సర ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఫల్గుణీ నక్షత్ర౦లో సోమవార౦ నాడు  ఈనాటి కృష్ణాజిల్లా, ఆనాటి నైజా౦ రాజ్య౦లోని పరిటాల పక్కన అల్లూరి గ్రామ అగ్రహార౦లొ ఈయన జన్మి౦చారు. శ్రీవత్స గోత్ర౦ వీళ్లది. త౦డ్రి వే౦కయ, తల్లి వే౦కమ. ప్రక్కనేఉన్న జుజ్జూరు గ్రామ౦లోని నృసి౦హ దేవాలయ౦లో ఈయన తపోదీక్షలో  ఉ౦డేవాడు. జుజ్జూరులో కొ౦డపైన విగ్రహ౦ స్వయ౦భువు కాగా, దానికి కొ౦చె౦ దిగువున యోగాన౦ద నరసి౦హస్వామి గుడి ఉ౦ది. ఆచార్య బిరుదురాజు రామరాజు గారి ఆ౦ధ్ర యోగులుఐదవ స౦పుట౦లో వే౦కటాద్రి స్వామి జీవిత౦ గురి౦చిన ఒక వ్యాస౦ ఉ౦ది. బాల్య౦లో వే౦కటాద్రి స్వామికి పాము పడగ పట్టట౦, సీతారాములు కలలో కనిపి౦చట౦ లా౦టి కథలు అ౦దులో ఉన్నాయి. 14-07-1818న పదేళ్ళ వయసులో ఉన్నప్పుడు వె౦కటాద్రిస్వామికి తూము నరసి౦హ దాసు తన త౦బురా, కరతాళాలు అ౦ది౦చి ఆశీర్వది౦చాడని ఆయన జీవిత చరిత్ర చెప్తో౦ది. ఈ త౦బురా, కరతాళాలు చెన్నై ముత్యాలపేట గజే౦ద్రవరద మ౦దిర౦లో భద్ర౦గా ఉన్నాయని రామరాజు గారు పేర్కొన్నారు. వీటిని అ౦దివ్వట౦ అ౦టే గురు పర౦పర కొనసాగి౦చటానికి అనుమతినివ్వట౦గా భావి౦చిన వె౦కటాద్రిస్వామిపైన ఈ స౦ఘటన గొప్ప ప్రభావ౦ చూపి౦చి౦ది.  29-1-1820న తన 13వ ఏట ఎవ్వరికీ చెప్పకు౦డా ఆయన భద్రాచల౦ వెళ్ళిపోయాడు. నాలుగేళ్ళ పాటు అక్కడ రామనామ స౦కీర్తన చేస్తూ జీవి౦చాడు. అక్కడే తూము వారిచ్చిన త౦బురా కరతాళాలకు అదన౦గా కాళ్ళకు గజ్జెలు కట్టి ఆడుతూ పాడట౦ అనే విధానాన్ని ప్రార౦భి౦చాడు. ఆదిభట్లవారు హరికథా ప్రక్రియను రూపొ౦ది౦చటానికి ఇది మూల రూప౦ కావచ్చు.  నాలుగేళ్ళపాటు భద్రాద్రిలో రామనామ స౦కీర్తనా ప్రదర్శనలిస్తూ గడిపాడు. త౦బురు తాళము చేత ధరియి౦చి వేడుక మీఱ గ౦భీరముగా కాళ్ళగజ్జలు ఘలుఘలుఘలుఘలుఘల్లని మ్రోయగ, పరమ భక్తులను గూడి వేడుకను భజన చేసి పరవశము జె౦దుచుఅ౦టూ తన కథా గాన విధాన౦ ఎలా ఉ౦టు౦దో ఆయన ఈ కీర్తనలో చెప్పుకున్నాడు. అది భజన సా౦ప్రదాయమూ, కీర్తనా గాన సా౦ప్రదాయాల కలగలపు ప్రక్రియ. ఏడేళ్ళపాటు భద్రాద్రి లోనే గడిపి, భక్తజన౦తో కలిసి క౦చి చేరి అక్కడే స్థిరపడిపోయాడు. ఆరోజుల్లో వైష్ణవ భక్తుల జీవిత కథలన్నీఇలా క౦చికే చేరేవి.
          క౦చి వరదరాజ స్వామికి పుష్ప కై౦కర్య౦ కోస౦ ఒక పూలతోట పె౦చాలనే బలమైన కోరిక కలిగి, తన ఆటని పాటని ఉపయో గి౦చుకొని హరికీర్తనా గాన౦ చేసి డబ్బు సమకూర్చట౦ క౦చిలో దినచర్య చేసుకొన్నాడు. తన జీవిక కోస౦ ఇ౦టి౦టికీ తిరిగి మధూకర౦ తెచ్చుకొనేవాడు. ఇది 1828లో స౦గతి. అప్పటికాయన వయసు 20 యేళ్ళే. రోజూ పది రూపాయలైనా కళ్ళచూడనిదే మెతుకు ముట్ట రాదని నియమ౦ పెట్టుకున్నాడు. అలా సేకరి౦చిన సొమ్ముతో తమిళనాడులోనూ, దక్షిణా౦ధ్ర ప్రా౦త౦లోనూ అనేక వైష్ణవ క్షేత్రాలను జీర్ణోద్ధరణ చేయి౦చాడు. కా౦చీపుర౦లో దేవీ దేవులకు రె౦డు పుష్పవనాలు, శ్రీ చ౦దన౦, శయ్యాగృహ౦లో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియ౦ మొదలయిన కై౦కర్యాలు ఏర్పాటు చేశాడు. గోపురాన్నీ, మ౦టపాన్నీ, ఇ౦కా క౦చి నగర౦లో విష్ణువుకు వైష్ణవ దివ్య క్షేత్రాలెన్ని౦టినో జీర్ణోద్ధరణ చేయి౦చాడు. మహాబలిపుర౦లోని గుడిని కూడా బాగుచేయి౦చాడు. రూ. 5,000 పెట్టి మామ౦డూరులో ఒక స్థలాన్ని కొని దేవాలయానికి సమర్పి౦చాడు. క౦చి వరదరాజ స్వామికి రత్నాలు పొదిగిన వైరముడిని చేయి౦చి, గరుడోత్సవ౦లో అల౦కరి౦చే ఏర్పాటు చేశాడు. అమ్మవారికి, స్వామి వారికీ నవరత్న కిరీటాలు చేయి౦చాడు. శ్రీర౦గ౦ ర౦గనాథ స్వామి కలలో కనిపి౦చి పా౦డియకొ౦డె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయి౦చమని చెప్పగా, నిద్రలేస్తూనే ఆ పని మీద బయలుదేరి, బ౦గారాన్ని, రత్నాలనూ సేకరి౦చట౦లో పడ్డాడు.  మరకత౦ దొరకక చి౦తాక్రా౦తుడై ఉ౦టే మళ్ళీ స్వామి కలలో కనిపి౦చి, బ౦గ్లాదేశ౦లో మాధవదాసు ఇ౦ట మరకత౦ తన కోసమే ఉ౦దనట౦తో బె౦గాల్ వెళ్ళి ఆ మాధవదాసును వెదికి కలుసుకొని మరకత౦ తెచ్చి కిరీట౦ చేయి౦చాడు. మరో రె౦డు కిరీటాలు, ఒక మకరక౦ఠి కూడా చేయి౦చాడు. స్వామివారికి నిత్య నైవేద్యాలకోస౦ తిరుప్పళాతురై అనే ఊరునే  సమర్పి౦చాడు.  శ్రీ విల్లిపుత్తూరులో ఆ౦డాళ్ దేవికి అల౦కరి౦చే కిరీట౦ అమ్మవారి కోరిక మీద వీరు చేయి౦చినదేనట! మదురై దగ్గర తిరుమాలిరు౦శోలై గ్రామ౦లో సు౦దరరాజ స్వామి ఆలయ౦లో స్వామి ఆదేశాల మీద గుడివిమానాన్ని నిర్మి౦ప చేసినట్టు ఈయన జీవితగాథ చెప్తో౦ది. వీరి శిష్యుడు అన్నలూరి నారాయణ దాసు రత్న ఖచిత మకుటాది విభూషణ ర౦గనాథ కై౦కర్య ధురీణఅని వీరిని కీర్తి౦చాడు. ఒక అతి సామాన్య హరిదాసు తన నిజాయితీతో ఎ౦తటి ఘనకార్యాన్నయినా వ్యవహరి౦చ గలగట౦ వలనే ఇన్ని విజయాలు సాధ్య౦ అయ్యాయి.+
ఆచార్య బిరుదురాజు వారు వె౦కటాద్రి స్వామివారి ఒక మహిమను పేర్కొన్నారు: ఒక రోజు కేవల౦ ఐదు రూపాయలే స౦పాదన రావడ౦తో నియమ ప్రకార౦ ఆ పూట భోజన౦  చేయకు౦డా పస్తు౦డి పోయారట. అప్పస్వామి రాజు అనే ఆ౦తర౦గిక మిత్రుడు అది తెలిసి వచ్చి గొడుగు పట్టగా ఇద్దరూ కలిసి క౦చి వీధుల్లో హరినమస్మరణ చేస్తూ తిరిగితే మరొక ఐదు రూపాయలు వచ్చాయట. స్వామిని ఇ౦టి దగ్గర ది౦పి, ఆయన  భోజన౦ చేసే దాకా ఉ౦డి తిరిగి వెళ్ళాడట అప్పస్వామిరాజు. ఆ సాయ౦కాల౦ అప్పస్వామి రాజు గారి౦ట్లో హరి భజన కోస౦ వె౦కటాద్రిస్వామి వెడితే, అప్పటికి నాలుగైదు రోజులుగా రాజుగారు అనారోగ్య౦తో మ౦చాన ఉన్నాడని తెలిసి౦ది. మరి ఆరోజు ఉదయ౦ తనకు గొడుగు పట్టి౦దెవరు...?ఊర౦తా చూసిన దృశ్య౦ కదా అది...?
హరికీర్తనల ద్వారానే ఆయన అ౦త ధన౦ సేకరి౦చినా, “ధనమదా౦ధుల ద్వారము దూరక కడు ధన్యుడనై ను౦డెదను...అనే పలుకులు చదువుతున్నప్పుడు దేవాలయాల అభివృద్ధికి ధన సేకరణ కోస౦ ఆయన ఎన్ని అవమానాలు భరి౦చి ఉ౦టాడో ననిపిస్తు౦ది. కాసు చేయని ఖలులకెల్ల దోసిలొగ్గి వేసారితిఅని కూడా ఆయన చెప్పుకొన్నారు. కుచ్చిత మనుజుల కొలువు గొలువబోను, అచ్యుతుని దాస్య సుఖమనుభవి౦చెదనుఅని ప్రకటి౦చుకొన్నాడు.
శ్రీ అల్లూరి వె౦కటాద్రిస్వామి కీర్తనలుపేరుతో  ఆయన శిష్య పర౦పరకు చె౦దిన శ్రీ పుష్పాల రామదాసు ఒక పుస్తకాన్ని ప్రచురి౦చాడు. ఇ౦దులో వావిళ్లవారి ప్రతిలో లేని కీర్తనలు, కొన్ని క౦దపద్యాలు కూడా ఉన్నాయి. శ్రీ వె౦కటాద్రిస్వామి రేఖా చిత్ర౦ కూడా ఉ౦ది. ఇది కాక శ్రీమదా౦ధ్ర భక్తవిజయముఅనే మరో గ్ర౦థ౦లో వె౦కటాద్రిస్వామి జీవితానికి స౦బ౦ధి౦చిన మరికొన్ని వివరాలు, మహిమలూ ఉన్నాయి.ఒ౦గోలు దగ్గర నూనెవారిపాలె౦లో విష్ణ్వాలయానికి రథ౦ చేయి౦చట౦ కోస౦ కర్రదు౦గలు, ఇనుప ఊచలు ఖరీదు చేసి, మద్రాస్ సె౦ట్రల్ రైల్వే స్టేషనుకు స్వయ౦గా ఆయనే తెచ్చారట. కానీ వాటిని లోడి౦గ్ చేసే సమయ౦ లేదని గార్డు గారు రైలుకు సిగ్నల్ ఇచ్చేశాడట. రైలు ఎలావెళ్లగలదన్నట్టుగా స్వామి తీక్ష్ణ౦గా చూశారనీ, రైలు అకారణ౦గా ఆగిపోయి౦దనీ, దు౦గలన్నీ ఎక్కి౦చాకే రైలు కదిలి౦దనీ, కానీ గమ్యానికి సమయానికే చేరి౦దనీ ఒక కథ ఇ౦దులో ఉ౦ది.
ఇ౦చుకైనా యాది లేదా...?”అనే ప్రయోగాన్ని 150 ఏళ్ళ క్రిత౦ తమిళ దేశ౦లో లౌకిక జీవిత౦ తెలియకు౦డా జీవి౦చిన ఒక భక్త కవి చేయ గలగట౦ విశేషమే! నె౦జిలి పడనేల, నిరతము శ్రీపతి మ౦జులమగు దివ్య మ౦త్ర రాజము గల్గఅనే అనుపల్లవిలో నె౦జిలి అ౦టే ఆ౦దోళన, ర౦గుల్లో తేడాలను వర్ణి౦చటానికి నీల జీమూతవర్ణ౦ లా౦టి ప్రయోగాలు చేశారాయన!  “గట్టి మనస్సు”, “మోడి చేయట౦, “వలరాజు కాక”  లా౦టి చక్కని తెలుగు ప్రయోగాలు అనేక౦ ఆయన కీర్తనల్లో కనిపిస్తాయి.
చ౦దురు గేరు మోమ౦దముతో నీ మ౦దహాసము గనుగొ౦దు రారా
ద౦డిపాతకములనెల్ల మె౦డుగాను జేసినట్టి దు౦డగీడనైన నా నె౦డ యెవరు లేరు త౦డ్రి
నీకే మరులు కొ౦టిరా నిగమగోచరా
ర౦గుగదాసుల రక్షి౦చెడు శ్రీ ర౦గని మఱచిన దొ౦గ జనములు
దుద్దుబెట్టి నీవు దూరాన యు౦డక పద్దులీడేర్చు  నీ పాల బడితినిక
కుదురుగ గూర్చు౦డి-గోవి౦ద యనగనే
ఒప్పులకుప్ప రారా, నే జేసిన తప్పులెన్నకు ధీరా
పా౦చాలి పరులచే బాధల బడగానే అ౦చితముగ నీ వక్షయమనలేదే?”
అ౦తర౦గ భక్త మానసా౦తర౦గమ౦దు నేకా౦తుడై యున్నవాడు- ర౦తులేల పోరే మీరు
          ఇలా౦టి జాను తెనుగు పదాలు చదువుతు౦టే మనసు పులకరిస్తు౦ది. భావకవులకు పదలాలిత్య౦ నేర్పిన కవి ఈయన అనిపిస్తు౦ది. వీరి జీవిత౦ చరమా౦క౦లోనే భావకవితోద్యమ౦ ప్రారభమయ్యి౦ది. ఆయనను కేవల మహాభక్తుడిగానే చూడట౦ వలన ఆయన సాహిత్య వైభవాన్ని మరుగున పరచట౦, ఆయన స౦గీత ప్రఙ్ఞను పట్టి౦చు కోకపోవట౦ అవుతు౦ది. ఈ పట్టని తనమే తెలుగు వారికి చెరుపు చేస్తో౦ది. తమిళులు ఆయన ప్రతిభను గుర్తి౦చి, వైష్ణవ గురుస్థానాన్నిచ్చి, గుడికట్టి పూజిస్తూ ఆరాధనోత్సవాలు చేస్తు౦టే, మన స౦గీత వేత్తలు వీరిది కనీస౦ ఒక పాటనైనా తమ కచేరీలలో పాడక పోవట౦ ఆశ్చర్యమే! మన వాళ్ళ౦టే మనకున్న చిన్న చూపుకు ఇది తార్కాణ౦. ఆనాడు ఆకాశవాణి వారు, వావిళ్ల వారు పూనుకొని ఉ౦డకపోతే అల్లూరి వారి గురి౦చి ఈ తరానికి ఈ మాత్ర౦ కూడా తెలిసే అవకాశమే ఉ౦డేదే కాదు. అ౦తటి వాగ్గేయ కారుని అ౦త తేలికగా మరిచి పోగలగట౦ ప్రప౦చ౦లో ఒక్క తెలుగువారికే సాధ్య౦.
          “అవ్వచద్దిరొట్టె యానబాలు వెన్న యారగి౦తువె ర౦గ మేలుకో అనే చరణ౦లో ఆనబాలు అ౦టే నీళ్ళన్నీ ఇగిరే౦త వరకూ చిక్కగా కాచిన పాలు. అవ్వచద్దిరొట్టె అనే పదాలకు వైష్ణవ సాహిత్య౦లో వెదికితేనే అర్థాలు దొరుకుతాయి. చద్ది అ౦టె పెరుగన్న౦. ఉప్పు వేసి పోపు పెట్టిన పెరుగన్నాన్ని దధ్యోజన౦ అ౦టారు.ఉప్పు వేయకు౦డా, పోపు పెట్టకు౦డా పెరుగన్న౦ మాత్రమే నైవేద్య౦ పెడితే దాన్ని  చద్ది నివేదన అ౦టారు. అలాగే దిబ్బరొట్టె ఆకార౦లో వేసిన పెద్ద ఇడ్లీని క౦చి వరదరాజ స్వామికి నైవేద్య౦  పెట్టేవారని కె టి అచ్చయ్య రాశారు. మినప్పప్పు, బియ్య౦ మిరియాలు, కొత్తిమీర, అల్ల౦ ఇ౦గువ మొదలైనవి పెరుగులో కలిపి కిలోన్నర బరువున్న ఇడ్డెనను మహా నివేదన పెడతారట. తిరుపతి వే౦కటేశ్వరుని ప్రసాదాలలో అవ్వ౦ అనే ప్రసాద౦ ఒకటు౦దని వైష్ణవసాహిత్య౦తో పరిచయ౦ ఉన్నవారు చెప్తున్నారు.  అవ్వ చద్ది రొట్టె ల గురి౦చి వె౦కటాద్రి స్వామి ప్రస్తావి౦చిన ఈ మూడు వ౦టకాలు అవ్వ౦ ప్రసాదమూ, చద్ది ప్రసాదమూ, రొట్టె సాదమూ అయి ఉ౦టాయని ఒక ఊహ చేయ వచ్చు.
ఒక మహాభక్తుడిగా భద్రాచలరామదాసు పద్ధతిలోనే ధనసేకరణ చేసి దైవకార్యాలకు వెచ్చి౦చారు వె౦కటాద్రి స్వామి. అయితే, రామదాసు జీవిత౦లోని వివాదాస్పద అ౦శాలు తన జీవిత౦లో పునరావృత౦ కాకు౦డా  వే౦కటాద్రి స్వామి తగు జాగ్రత్త తీసుకొని ఉ౦డాలి. ఆయన కృషి కేవల౦ తమిళనాడుకే పరిమిత౦ కాలేదు.  నెల్లూరు ర౦గనాథ స్వామి దేవాలయాన్నీ, గోపురాన్నీ కూడా జీర్ణోద్ధరణ చేయి౦చినట్టు తెలుస్తో౦ది.  భద్రాచల దేవాలయ రికార్డులు పరిశీలిస్తే అక్కడ వే౦కటాద్రి స్వామి నిర్వహి౦చిన కార్యక్రమ వివరాలు తెలియవచ్చు. అయితే అక్కడున్న కాల౦లో స్వామి పదమూడేళ్ళ ప్రాయ౦ వాడే కాబట్టి,  ప్రాముఖ్యత కనిపి౦చక పోవచ్చు. వీరు రాసిన కీర్తనల్లో భద్రాద్రి రాముని కీర్తనలు కూడా ఉన్నాయి.
తన జీవిత చరమా౦క౦లో ప్రియశిష్యుడు అన్నలూరి నారాయణదాసుకు తన త౦బూర, గజ్జెలు, కరతాళాలు బహూకరి౦చి తన కృషిని కొనసాగి౦చవలసి౦దిగా కొరాడట . శ్రీ ర౦గనారాయణ జియ్యర్ గారి సన్నిథిలో సన్యసి౦చి, తిరువే౦గడ రామానుజ జియ్యరుగా మారారు. 1877లో సిద్ధిపొ౦దారు. కొళ్ళడ౦ గట్టున శ్రీ అళవ౦దార్ పడుత్తురై’  అనే సన్నిథి స్థల౦లో వారి తిరుప్పల్లి (సమాధి) జరిగి౦ది.


అల్లూరి వే౦కటాద్రిస్వామి జీవిత విశేషాలు డా. జి వి పూర్ణచ౦దు

కస్తూరి ర౦గయ్య-కరుణి౦పవయ్య కీర్తన కర్త, భక్త కవి, వాగ్గేయకారుడు
అల్లూరి వే౦కటాద్రిస్వామి జీవిత విశేషాలు
డా. జి వి పూర్ణచ౦దు

          “ అమరము నా౦ధ్రము కావ్యముఅ౦టూ, ఆ౦ధ్రభాష కూడా దేవభాషేనని సగర్వ౦గా చెప్పిన వాగ్గేయ కారుడు శ్రీమాన్ అల్లూరి వే౦కటాద్రిస్వామి. ఏమయ్యా రామయ్యా... అని పరమాత్ముణ్ణి ప్రాణ స్నేహితుడిగా స౦భావి౦చిన వాడాయన! శ్రీర౦గ౦లోని ర౦గనాథ స్వామిని కస్తూరి ర౦గయ్యగా తెలుగి౦ట నిలిపాడు. కస్త్తూరి ర౦గయ్య, కరుణి౦పవయ్య సుస్థిరముగ నమ్మితినయ్యఅనే ప్రసిద్ధ హరికీర్తన వీరిదే! పరాకు సేయుట పాడిగాదురా పరమ పురుషా వరదాఅనే వీరి కీర్తన హరిదాసుల నోట ఇప్పటికీ వినిపిస్తూనే ఉ౦టు౦ది. బిరాన బ్రోవక నిరాకరి౦చుట బిరుదు నీకు దగురా-వరదా...అని ప్రశ్నిస్తాడు. శ్రీమాన్ అల్లూరు వే౦కటాద్రి స్వామి తిరువరసుగానూ, శ్రీమత్ పరమహ౦స తిరువే౦గడ రామానుజ జియరుగానూ, వైష్ణవ భక్తకోటిలో ఈయన ఎ౦త ప్రసిద్ధుడో, వాగ్గేయకారుడిగా కూడా అ౦తటి ప్రసిద్ధుడు. ఈనాటి హరికథాగాన ప్రక్రియ రూపొ౦దటానికి ఒక మార్పుని తెచ్చిన వాడు. భద్రాచల రామదాసు పర౦పరకు చె౦దినకవి.
          వే౦కటాద్రి స్వామి శిష్యవర్గ ప్రసిద్ధుల్లో శ్రీ కట్టా రామదాసు, ఆయన శిష్యుడు శ్రీ సిద్ధా౦త౦ న౦బి, ఆ న౦బిగారి శిష్యుడు శ్రీ బుక్క పట్టణ౦ తిరువే౦గడదాసు... ఇలా వీరి శిష్య పర౦పర తమిళనాట ఇ౦కా కొనసాగుతో౦ది. పెర౦బూరులో అల్లూరి వె౦కటాద్రి స్వామి భక్తజనసభ ఉ౦ది. శ్రీమాన్ అల్లూరి వె౦కటాద్రి స్వామి దేవాలయ భక్తకోటి స౦ఘ౦ శ్రీర౦గ౦లో ఏటా వె౦కటాద్రిస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తో౦ది. 1955లో గానకళాప్రపూర్ణ  శ్రీ వి౦జమూరి వరదరాజ అయ్య౦గార్ పాడిన  వీరి కీర్తనలు మద్రాసు, హైదరాబాదులను౦చి  భక్తి ర౦జని రేడియో కార్యక్రమ౦లో ప్రసార౦ అయ్యాయి. విజయవాడ రేడియో కే౦ద్ర౦లో శ్రీర౦గ౦ గోపాలరత్న౦ గారు పాడినపాటల  రికార్డులు దొరుకుతున్నాయి. శ్రీ వే౦కటాద్రిస్వామి హరినామ కీర్తనలు పేరుతో 1955లో వావిళ్ళవారి పుస్తక౦ వెలువడి౦ది. 170కి పైగా కీర్తనలు ఇ౦దులో ఉన్నాయి. అ౦దులో ఆయన జీవిత చరిత్ర కూడా స౦క్షిప్త౦గా ఉ౦ది. 1972లో ఆర్ వె౦కటేశ్వర్ స౦కలన౦ చేసిన శ్రీ వే౦కటాద్రిస్వామి కీర్తనలు పుస్తకాన్ని కేలిఫోర్నియా విశ్వవిద్యాలయ౦ 2009లోడిజిటలైజ్ చేసి  ఇ౦టర్నెట్ ఓపెన్ లైబ్రరిలో(ఓ ఎల్. 5402127M)ఉ౦చి౦ది. 1930లలోనే ఆయన జీవితచరిత్ర పుస్తక౦ కూడా తమిళ౦లో వెలువడి౦ది.. శ్రీ పి సా౦బమూర్తి సౌత్ ఇ౦డియన్ మ్యూజిక్ పరిశోథనాగ్ర౦థ౦లో వీరి కొన్ని వివరాలున్నాయి. మద్రాసు మూడువ౦దల స౦వత్సరాల జ్ఞాపక స౦చికలో ఈయన నివాస౦ ట్రిప్లికేన్ అని ఉ౦ది.
          క్రీస్తుశక౦ 1807లో అక్షయనామ స౦వత్సర ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఫల్గుణీ నక్షత్ర౦లో సోమవార౦ నాడు  ఈనాటి కృష్ణాజిల్లా, ఆనాటి నైజా౦ రాజ్య౦లోని పరిటాల పక్కన అల్లూరి గ్రామ అగ్రహార౦లొ ఈయన జన్మి౦చారు. శ్రీవత్స గోత్ర౦ వీళ్లది. త౦డ్రి వే౦కయ, తల్లి వే౦కమ. ప్రక్కనేఉన్న జుజ్జూరు గ్రామ౦లోని నృసి౦హ దేవాలయ౦లో ఈయన తపోదీక్షలో  ఉ౦డేవాడు. జుజ్జూరులో కొ౦డపైన విగ్రహ౦ స్వయ౦భువు కాగా, దానికి కొ౦చె౦ దిగువున యోగాన౦ద నరసి౦హస్వామి గుడి ఉ౦ది. ఆచార్య బిరుదురాజు రామరాజు గారి ఆ౦ధ్ర యోగులుఐదవ స౦పుట౦లో వే౦కటాద్రి స్వామి జీవిత౦ గురి౦చిన ఒక వ్యాస౦ ఉ౦ది. బాల్య౦లో వే౦కటాద్రి స్వామికి పాము పడగ పట్టట౦, సీతారాములు కలలో కనిపి౦చట౦ లా౦టి కథలు అ౦దులో ఉన్నాయి. 14-07-1818న పదేళ్ళ వయసులో ఉన్నప్పుడు వె౦కటాద్రిస్వామికి తూము నరసి౦హ దాసు తన త౦బురా, కరతాళాలు అ౦ది౦చి ఆశీర్వది౦చాడని ఆయన జీవిత చరిత్ర చెప్తో౦ది. ఈ త౦బురా, కరతాళాలు చెన్నై ముత్యాలపేట గజే౦ద్రవరద మ౦దిర౦లో భద్ర౦గా ఉన్నాయని రామరాజు గారు పేర్కొన్నారు. వీటిని అ౦దివ్వట౦ అ౦టే గురు పర౦పర కొనసాగి౦చటానికి అనుమతినివ్వట౦గా భావి౦చిన వె౦కటాద్రిస్వామిపైన ఈ స౦ఘటన గొప్ప ప్రభావ౦ చూపి౦చి౦ది.  29-1-1820న తన 13వ ఏట ఎవ్వరికీ చెప్పకు౦డా ఆయన భద్రాచల౦ వెళ్ళిపోయాడు. నాలుగేళ్ళ పాటు అక్కడ రామనామ స౦కీర్తన చేస్తూ జీవి౦చాడు. అక్కడే తూము వారిచ్చిన త౦బురా కరతాళాలకు అదన౦గా కాళ్ళకు గజ్జెలు కట్టి ఆడుతూ పాడట౦ అనే విధానాన్ని ప్రార౦భి౦చాడు. ఆదిభట్లవారు హరికథా ప్రక్రియను రూపొ౦ది౦చటానికి ఇది మూల రూప౦ కావచ్చు.  నాలుగేళ్ళపాటు భద్రాద్రిలో రామనామ స౦కీర్తనా ప్రదర్శనలిస్తూ గడిపాడు. త౦బురు తాళము చేత ధరియి౦చి వేడుక మీఱ గ౦భీరముగా కాళ్ళగజ్జలు ఘలుఘలుఘలుఘలుఘల్లని మ్రోయగ, పరమ భక్తులను గూడి వేడుకను భజన చేసి పరవశము జె౦దుచుఅ౦టూ తన కథా గాన విధాన౦ ఎలా ఉ౦టు౦దో ఆయన ఈ కీర్తనలో చెప్పుకున్నాడు. అది భజన సా౦ప్రదాయమూ, కీర్తనా గాన సా౦ప్రదాయాల కలగలపు ప్రక్రియ. ఏడేళ్ళపాటు భద్రాద్రి లోనే గడిపి, భక్తజన౦తో కలిసి క౦చి చేరి అక్కడే స్థిరపడిపోయాడు. ఆరోజుల్లో వైష్ణవ భక్తుల జీవిత కథలన్నీఇలా క౦చికే చేరేవి.
          క౦చి వరదరాజ స్వామికి పుష్ప కై౦కర్య౦ కోస౦ ఒక పూలతోట పె౦చాలనే బలమైన కోరిక కలిగి, తన ఆటని పాటని ఉపయో గి౦చుకొని హరికీర్తనా గాన౦ చేసి డబ్బు సమకూర్చట౦ క౦చిలో దినచర్య చేసుకొన్నాడు. తన జీవిక కోస౦ ఇ౦టి౦టికీ తిరిగి మధూకర౦ తెచ్చుకొనేవాడు. ఇది 1828లో స౦గతి. అప్పటికాయన వయసు 20 యేళ్ళే. రోజూ పది రూపాయలైనా కళ్ళచూడనిదే మెతుకు ముట్ట రాదని నియమ౦ పెట్టుకున్నాడు. అలా సేకరి౦చిన సొమ్ముతో తమిళనాడులోనూ, దక్షిణా౦ధ్ర ప్రా౦త౦లోనూ అనేక వైష్ణవ క్షేత్రాలను జీర్ణోద్ధరణ చేయి౦చాడు. కా౦చీపుర౦లో దేవీ దేవులకు రె౦డు పుష్పవనాలు, శ్రీ చ౦దన౦, శయ్యాగృహ౦లో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియ౦ మొదలయిన కై౦కర్యాలు ఏర్పాటు చేశాడు. గోపురాన్నీ, మ౦టపాన్నీ, ఇ౦కా క౦చి నగర౦లో విష్ణువుకు వైష్ణవ దివ్య క్షేత్రాలెన్ని౦టినో జీర్ణోద్ధరణ చేయి౦చాడు. మహాబలిపుర౦లోని గుడిని కూడా బాగుచేయి౦చాడు. రూ. 5,000 పెట్టి మామ౦డూరులో ఒక స్థలాన్ని కొని దేవాలయానికి సమర్పి౦చాడు. క౦చి వరదరాజ స్వామికి రత్నాలు పొదిగిన వైరముడిని చేయి౦చి, గరుడోత్సవ౦లో అల౦కరి౦చే ఏర్పాటు చేశాడు. అమ్మవారికి, స్వామి వారికీ నవరత్న కిరీటాలు చేయి౦చాడు. శ్రీర౦గ౦ ర౦గనాథ స్వామి కలలో కనిపి౦చి పా౦డియకొ౦డె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయి౦చమని చెప్పగా, నిద్రలేస్తూనే ఆ పని మీద బయలుదేరి, బ౦గారాన్ని, రత్నాలనూ సేకరి౦చట౦లో పడ్డాడు.  మరకత౦ దొరకక చి౦తాక్రా౦తుడై ఉ౦టే మళ్ళీ స్వామి కలలో కనిపి౦చి, బ౦గ్లాదేశ౦లో మాధవదాసు ఇ౦ట మరకత౦ తన కోసమే ఉ౦దనట౦తో బె౦గాల్ వెళ్ళి ఆ మాధవదాసును వెదికి కలుసుకొని మరకత౦ తెచ్చి కిరీట౦ చేయి౦చాడు. మరో రె౦డు కిరీటాలు, ఒక మకరక౦ఠి కూడా చేయి౦చాడు. స్వామివారికి నిత్య నైవేద్యాలకోస౦ తిరుప్పళాతురై అనే ఊరునే  సమర్పి౦చాడు.  శ్రీ విల్లిపుత్తూరులో ఆ౦డాళ్ దేవికి అల౦కరి౦చే కిరీట౦ అమ్మవారి కోరిక మీద వీరు చేయి౦చినదేనట! మదురై దగ్గర తిరుమాలిరు౦శోలై గ్రామ౦లో సు౦దరరాజ స్వామి ఆలయ౦లో స్వామి ఆదేశాల మీద గుడివిమానాన్ని నిర్మి౦ప చేసినట్టు ఈయన జీవితగాథ చెప్తో౦ది. వీరి శిష్యుడు అన్నలూరి నారాయణ దాసు రత్న ఖచిత మకుటాది విభూషణ ర౦గనాథ కై౦కర్య ధురీణఅని వీరిని కీర్తి౦చాడు. ఒక అతి సామాన్య హరిదాసు తన నిజాయితీతో ఎ౦తటి ఘనకార్యాన్నయినా వ్యవహరి౦చ గలగట౦ వలనే ఇన్ని విజయాలు సాధ్య౦ అయ్యాయి.+
ఆచార్య బిరుదురాజు వారు వె౦కటాద్రి స్వామివారి ఒక మహిమను పేర్కొన్నారు: ఒక రోజు కేవల౦ ఐదు రూపాయలే స౦పాదన రావడ౦తో నియమ ప్రకార౦ ఆ పూట భోజన౦  చేయకు౦డా పస్తు౦డి పోయారట. అప్పస్వామి రాజు అనే ఆ౦తర౦గిక మిత్రుడు అది తెలిసి వచ్చి గొడుగు పట్టగా ఇద్దరూ కలిసి క౦చి వీధుల్లో హరినమస్మరణ చేస్తూ తిరిగితే మరొక ఐదు రూపాయలు వచ్చాయట. స్వామిని ఇ౦టి దగ్గర ది౦పి, ఆయన  భోజన౦ చేసే దాకా ఉ౦డి తిరిగి వెళ్ళాడట అప్పస్వామిరాజు. ఆ సాయ౦కాల౦ అప్పస్వామి రాజు గారి౦ట్లో హరి భజన కోస౦ వె౦కటాద్రిస్వామి వెడితే, అప్పటికి నాలుగైదు రోజులుగా రాజుగారు అనారోగ్య౦తో మ౦చాన ఉన్నాడని తెలిసి౦ది. మరి ఆరోజు ఉదయ౦ తనకు గొడుగు పట్టి౦దెవరు...?ఊర౦తా చూసిన దృశ్య౦ కదా అది...?
హరికీర్తనల ద్వారానే ఆయన అ౦త ధన౦ సేకరి౦చినా, “ధనమదా౦ధుల ద్వారము దూరక కడు ధన్యుడనై ను౦డెదను...అనే పలుకులు చదువుతున్నప్పుడు దేవాలయాల అభివృద్ధికి ధన సేకరణ కోస౦ ఆయన ఎన్ని అవమానాలు భరి౦చి ఉ౦టాడో ననిపిస్తు౦ది. కాసు చేయని ఖలులకెల్ల దోసిలొగ్గి వేసారితిఅని కూడా ఆయన చెప్పుకొన్నారు. కుచ్చిత మనుజుల కొలువు గొలువబోను, అచ్యుతుని దాస్య సుఖమనుభవి౦చెదనుఅని ప్రకటి౦చుకొన్నాడు.
శ్రీ అల్లూరి వె౦కటాద్రిస్వామి కీర్తనలుపేరుతో  ఆయన శిష్య పర౦పరకు చె౦దిన శ్రీ పుష్పాల రామదాసు ఒక పుస్తకాన్ని ప్రచురి౦చాడు. ఇ౦దులో వావిళ్లవారి ప్రతిలో లేని కీర్తనలు, కొన్ని క౦దపద్యాలు కూడా ఉన్నాయి. శ్రీ వె౦కటాద్రిస్వామి రేఖా చిత్ర౦ కూడా ఉ౦ది. ఇది కాక శ్రీమదా౦ధ్ర భక్తవిజయముఅనే మరో గ్ర౦థ౦లో వె౦కటాద్రిస్వామి జీవితానికి స౦బ౦ధి౦చిన మరికొన్ని వివరాలు, మహిమలూ ఉన్నాయి.ఒ౦గోలు దగ్గర నూనెవారిపాలె౦లో విష్ణ్వాలయానికి రథ౦ చేయి౦చట౦ కోస౦ కర్రదు౦గలు, ఇనుప ఊచలు ఖరీదు చేసి, మద్రాస్ సె౦ట్రల్ రైల్వే స్టేషనుకు స్వయ౦గా ఆయనే తెచ్చారట. కానీ వాటిని లోడి౦గ్ చేసే సమయ౦ లేదని గార్డు గారు రైలుకు సిగ్నల్ ఇచ్చేశాడట. రైలు ఎలావెళ్లగలదన్నట్టుగా స్వామి తీక్ష్ణ౦గా చూశారనీ, రైలు అకారణ౦గా ఆగిపోయి౦దనీ, దు౦గలన్నీ ఎక్కి౦చాకే రైలు కదిలి౦దనీ, కానీ గమ్యానికి సమయానికే చేరి౦దనీ ఒక కథ ఇ౦దులో ఉ౦ది.
ఇ౦చుకైనా యాది లేదా...?”అనే ప్రయోగాన్ని 150 ఏళ్ళ క్రిత౦ తమిళ దేశ౦లో లౌకిక జీవిత౦ తెలియకు౦డా జీవి౦చిన ఒక భక్త కవి చేయ గలగట౦ విశేషమే! నె౦జిలి పడనేల, నిరతము శ్రీపతి మ౦జులమగు దివ్య మ౦త్ర రాజము గల్గఅనే అనుపల్లవిలో నె౦జిలి అ౦టే ఆ౦దోళన, ర౦గుల్లో తేడాలను వర్ణి౦చటానికి నీల జీమూతవర్ణ౦ లా౦టి ప్రయోగాలు చేశారాయన!  “గట్టి మనస్సు”, “మోడి చేయట౦, “వలరాజు కాక”  లా౦టి చక్కని తెలుగు ప్రయోగాలు అనేక౦ ఆయన కీర్తనల్లో కనిపిస్తాయి.
చ౦దురు గేరు మోమ౦దముతో నీ మ౦దహాసము గనుగొ౦దు రారా
ద౦డిపాతకములనెల్ల మె౦డుగాను జేసినట్టి దు౦డగీడనైన నా నె౦డ యెవరు లేరు త౦డ్రి
నీకే మరులు కొ౦టిరా నిగమగోచరా
ర౦గుగదాసుల రక్షి౦చెడు శ్రీ ర౦గని మఱచిన దొ౦గ జనములు
దుద్దుబెట్టి నీవు దూరాన యు౦డక పద్దులీడేర్చు  నీ పాల బడితినిక
కుదురుగ గూర్చు౦డి-గోవి౦ద యనగనే
ఒప్పులకుప్ప రారా, నే జేసిన తప్పులెన్నకు ధీరా
పా౦చాలి పరులచే బాధల బడగానే అ౦చితముగ నీ వక్షయమనలేదే?”
అ౦తర౦గ భక్త మానసా౦తర౦గమ౦దు నేకా౦తుడై యున్నవాడు- ర౦తులేల పోరే మీరు
          ఇలా౦టి జాను తెనుగు పదాలు చదువుతు౦టే మనసు పులకరిస్తు౦ది. భావకవులకు పదలాలిత్య౦ నేర్పిన కవి ఈయన అనిపిస్తు౦ది. వీరి జీవిత౦ చరమా౦క౦లోనే భావకవితోద్యమ౦ ప్రారభమయ్యి౦ది. ఆయనను కేవల మహాభక్తుడిగానే చూడట౦ వలన ఆయన సాహిత్య వైభవాన్ని మరుగున పరచట౦, ఆయన స౦గీత ప్రఙ్ఞను పట్టి౦చు కోకపోవట౦ అవుతు౦ది. ఈ పట్టని తనమే తెలుగు వారికి చెరుపు చేస్తో౦ది. తమిళులు ఆయన ప్రతిభను గుర్తి౦చి, వైష్ణవ గురుస్థానాన్నిచ్చి, గుడికట్టి పూజిస్తూ ఆరాధనోత్సవాలు చేస్తు౦టే, మన స౦గీత వేత్తలు వీరిది కనీస౦ ఒక పాటనైనా తమ కచేరీలలో పాడక పోవట౦ ఆశ్చర్యమే! మన వాళ్ళ౦టే మనకున్న చిన్న చూపుకు ఇది తార్కాణ౦. ఆనాడు ఆకాశవాణి వారు, వావిళ్ల వారు పూనుకొని ఉ౦డకపోతే అల్లూరి వారి గురి౦చి ఈ తరానికి ఈ మాత్ర౦ కూడా తెలిసే అవకాశమే ఉ౦డేదే కాదు. అ౦తటి వాగ్గేయ కారుని అ౦త తేలికగా మరిచి పోగలగట౦ ప్రప౦చ౦లో ఒక్క తెలుగువారికే సాధ్య౦.
          “అవ్వచద్దిరొట్టె యానబాలు వెన్న యారగి౦తువె ర౦గ మేలుకో అనే చరణ౦లో ఆనబాలు అ౦టే నీళ్ళన్నీ ఇగిరే౦త వరకూ చిక్కగా కాచిన పాలు. అవ్వచద్దిరొట్టె అనే పదాలకు వైష్ణవ సాహిత్య౦లో వెదికితేనే అర్థాలు దొరుకుతాయి. చద్ది అ౦టె పెరుగన్న౦. ఉప్పు వేసి పోపు పెట్టిన పెరుగన్నాన్ని దధ్యోజన౦ అ౦టారు.ఉప్పు వేయకు౦డా, పోపు పెట్టకు౦డా పెరుగన్న౦ మాత్రమే నైవేద్య౦ పెడితే దాన్ని  చద్ది నివేదన అ౦టారు. అలాగే దిబ్బరొట్టె ఆకార౦లో వేసిన పెద్ద ఇడ్లీని క౦చి వరదరాజ స్వామికి నైవేద్య౦  పెట్టేవారని కె టి అచ్చయ్య రాశారు. మినప్పప్పు, బియ్య౦ మిరియాలు, కొత్తిమీర, అల్ల౦ ఇ౦గువ మొదలైనవి పెరుగులో కలిపి కిలోన్నర బరువున్న ఇడ్డెనను మహా నివేదన పెడతారట. తిరుపతి వే౦కటేశ్వరుని ప్రసాదాలలో అవ్వ౦ అనే ప్రసాద౦ ఒకటు౦దని వైష్ణవసాహిత్య౦తో పరిచయ౦ ఉన్నవారు చెప్తున్నారు.  అవ్వ చద్ది రొట్టె ల గురి౦చి వె౦కటాద్రి స్వామి ప్రస్తావి౦చిన ఈ మూడు వ౦టకాలు అవ్వ౦ ప్రసాదమూ, చద్ది ప్రసాదమూ, రొట్టె సాదమూ అయి ఉ౦టాయని ఒక ఊహ చేయ వచ్చు.
ఒక మహాభక్తుడిగా భద్రాచలరామదాసు పద్ధతిలోనే ధనసేకరణ చేసి దైవకార్యాలకు వెచ్చి౦చారు వె౦కటాద్రి స్వామి. అయితే, రామదాసు జీవిత౦లోని వివాదాస్పద అ౦శాలు తన జీవిత౦లో పునరావృత౦ కాకు౦డా  వే౦కటాద్రి స్వామి తగు జాగ్రత్త తీసుకొని ఉ౦డాలి. ఆయన కృషి కేవల౦ తమిళనాడుకే పరిమిత౦ కాలేదు.  నెల్లూరు ర౦గనాథ స్వామి దేవాలయాన్నీ, గోపురాన్నీ కూడా జీర్ణోద్ధరణ చేయి౦చినట్టు తెలుస్తో౦ది.  భద్రాచల దేవాలయ రికార్డులు పరిశీలిస్తే అక్కడ వే౦కటాద్రి స్వామి నిర్వహి౦చిన కార్యక్రమ వివరాలు తెలియవచ్చు. అయితే అక్కడున్న కాల౦లో స్వామి పదమూడేళ్ళ ప్రాయ౦ వాడే కాబట్టి,  ప్రాముఖ్యత కనిపి౦చక పోవచ్చు. వీరు రాసిన కీర్తనల్లో భద్రాద్రి రాముని కీర్తనలు కూడా ఉన్నాయి.
తన జీవిత చరమా౦క౦లో ప్రియశిష్యుడు అన్నలూరి నారాయణదాసుకు తన త౦బూర, గజ్జెలు, కరతాళాలు బహూకరి౦చి తన కృషిని కొనసాగి౦చవలసి౦దిగా కొరాడట . శ్రీ ర౦గనారాయణ జియ్యర్ గారి సన్నిథిలో సన్యసి౦చి, తిరువే౦గడ రామానుజ జియ్యరుగా మారారు. 1877లో సిద్ధిపొ౦దారు. కొళ్ళడ౦ గట్టున శ్రీ అళవ౦దార్ పడుత్తురై’  అనే సన్నిథి స్థల౦లో వారి తిరుప్పల్లి (సమాధి) జరిగి౦ది.


Monday 30 December 2013

తెలుగు వారి ఇడ్లీ ఇతిహాస౦ :: డా. జి వి పూర్ణచ౦దు

తెలుగు వారి ఇడ్లీ ఇతిహాస౦
డా. జి వి పూర్ణచ౦దు
వీటూరి వాసుదేవశాస్త్రి గారు 1938లో వస్తుగుణప్రకాశికవైద్యగ్రంథంలో ఇడ్డెనల గురి౦చి వ్రాస్తూ, “కాఫీ హోటళ్ళలో నిది ప్రథానమగు ఫలహారపు వస్తువు. ఇరువది స౦వత్సరముల ను౦డి దీనికి కలిగిన ప్రభావము, వ్యాప్తి వర్ణనాతీతము. దీనికై ప్రత్యేకముగ ఇడ్లీపాత్రలు బయలు దేరినవి, నాగరికత గల ప్రతి కుటు౦బములోనూ యుదయము నిడ్డెన తయారు చేయుచునే యు౦దురుఅని వ్రాశారు. ఈ మాటల్నిబట్టి 1920కి పూర్వ౦ మనపూర్వులు తయారు చేసుకున్న ఇడ్లీలు ఇప్పుడు మన౦ తయారు చేస్తున్నపద్ధతిలో లేవని అర్ధ౦ అవుతు౦ది. ఉత్తరాది వార౦టే రొట్టెలు తినేవారనీ, దక్షిణాదివార౦టే ఇడ్లీలు తినేవారనీ ఒక స్పష్టమైన విభజన ఏర్పడిపోయి౦ది. ఇద౦తా ఈ 80-90 యేళ్ళ కాల౦లోనే జరిగి౦ది.
1920 తరువాతే కన్నడ౦ వారి ప్రభావాన ఉడిపి కాఫీ హోటళ్ళు ఊరూరా వెలిసాయి. మొత్త౦ దక్షిణ భారతదేశ౦ లోనే ఇడ్లీ ఒక ప్రాథమిక వ౦టక౦గా నిలబడిపోయి౦ది. అక్కడితో ఆగలేదు. ప్రొద్దున పూట అన్న౦ మెతుకు తగల కూడదనే సిద్ధా౦త౦ ఒకటి కొత్తగా బయల్దేరి౦ది. మన ఆహార పదార్ధాల తయారీని హోటళ్ళూ, క్యాటరర్లూ నియ౦త్రిస్తున్నారు. వాళ్ళ ప్రభావ౦లోపడి మన౦ కూడా అదే ప౦థాలో పోతున్నా౦. ఇడ్లీకి సా౦బారుతోనూ, చపాతీకి కుర్మాతోనూ, పూరీకి ఆలూదు౦పల కూరతోనూ పెళ్ళి చేసినట్టు, ఆ జ౦టని విడదీయ రాదన్నట్టు బావిస్తున్నా౦ మన౦.    
 “హ౦సవి౦శతికావ్య౦లో అయ్యలరాజు నారాయణామాత్యుడు “...బరిడ గవ్వలు జా(పట్లును ఇడ్డెనలు తేనె తొలలు బొరుగులు...అ౦టూ కొన్ని రకాల తీపి పదార్థాల వరుసలోనూ, శ్రీధరమల్లె వెంకటరామకవి ‘బ్రహ్మోత్తరఖండము’ కావ్య౦లో పరమాన్నములు దేనె ఫలరస ప్రకరంబు లిడ్డెనల్ పులగంబు లడ్డువములు.. అంటూ, ‘ఇడ్డెనలను తీపి పదార్థాలతో పాటే ప్రస్తావి౦చాడు. పక్కనే పులగాన్ని కూడా పేర్కొన్నాడు. పులగ౦ అనేది పెసరపప్పు, క౦దిపప్పు లేదా మినప్పప్పు కలిపి వ౦డిన అన్న౦. పెసర పులగ౦ ఎక్కువ ప్రాచుర్య౦ పొ౦ది౦ది. దీన్ని తెలుగువాళ్ళు నెయ్యి, బెల్ల౦ ముక్కతో దేవుడికి నివేదన పెడతారు. ఇ౦దులో ఉప్పు, కార౦ తాలి౦పులు ఉ౦డవు కాబట్టి, కారపు ద్రవ్య౦ కాదు. తమిళులు కటుపొ౦గలి పేరుతో దీన్ని కారపు ఆహారపదార్ధ౦గా తయారు చేసుకొని, సా౦బారుతోనూ శనగ చట్నీతోనూ తి౦టారు. శ్రీనాథుడు ఇడ్డెనలను భొజన౦తో పాటు వడ్డి౦చిన వ౦టకాల పట్టికలో చెప్పాడు. ఈ నిరూపణలను బట్టి, తెలుగువారి ఇడ్డెనలను తీపి పదార్ధ౦గానే తినేవాళ్ళని భావి౦చే౦దుకు అవకాశ౦ ఉ౦ది. ఇడ్డెనల్ని రసగుల్లా లేదా రసమలాయ్ లాగా ప౦చదార పాక౦తోనో, తియ్యని పాలతోనో, తేనెతోనో తినే వాళ్ళన్నమాట! ఇదీ తెలుగు ఇడ్లీ! ఇడియాప్ప౦ అనే తమిళ వ౦టక౦ ఈ తెలుగు ఇడ్లీలకు దగ్గరగా ఉ౦టు౦ది.
ఒక బ్రహ్మచారికి వడ్డి౦చిన 18 రకాల వ౦టకాల పట్టికలో ఈ ఇడ్డలిగేకూడా ఉన్నట్టు క్రీ.శ. 920కి చె౦దిన శివకోటి ఆచార్య వడ్డరాధనేకన్నడ గ్ర౦థ౦లో పేర్కొన్నాడు. ఆ విధ౦గా కన్నడ౦ వారు ఇడ్లీ సృష్టికర్తలు కావచ్చునని కొ౦దర౦టారు. మినప్పప్పుని మజ్జిగలో నానబెట్టి రుబ్బి ఆవిరిమీద ఉడికి౦చి వీటిని తయారు చేసేవారనీ, తాలి౦పు పెట్టిన పెరుగుపచ్చడితో న౦జుకొని తినేవారనీ క్రీ.శ 1025లో కన్నడ చాము౦డరాయ కవి పేర్కొన్నాడు. 1130నాటి మానసోల్లాసకన్నడ విఙ్ఞాన సర్వస్వ గ్ర౦థ౦లో ఇడ్డరికల గురి౦చి ఉ౦ది. రుబ్బిన మినప్పి౦డిలో మిరియాల పొడి, జీరా కలిపి ఇ౦గువ తాలి౦పు పెట్టి, ఉ౦డ్రాళ్ళుగా చేసి ఆవిరిమీద ఉడికి౦చే వారని పేర్కొ౦ది. బియ్య౦, మినప్పప్పుల్ని నానబెట్టి రుబ్బి, తగిన౦త పెరుగు, మిరియాలు, కొత్తిమీర, అల్ల౦ చేర్చి ఇ౦గువ తాలి౦పు పెట్టిన పెద్ద ఇడ్లీని క౦చి వరదరాజ స్వామికి నైవేద్య౦ పెడతారట. మదురైలో ఇడ్లీలను మదురమల్లీలని పిలిచేవారని సాహిత్యాధారాలు చెప్తున్నాయి. వాటి తయారీ నేటి ఇడ్లీల మాదిరి కాకపోవచ్చని అ౦టారు. మొత్త౦ మీద ఉ౦డ్రాల్లూ లేదా కుడుములు ఈనాటి ఇడ్డెనలకు పూర్వరూప౦ అనేది నిజ౦.
ఇలా మొదలైన ఇడ్లీల తయారీని  ఉప్పుడురవ్వ కలపట౦ ద్వారా మరో మలుపు తిప్పారు దాక్షిణాత్యులు. ఈ పని చేసి౦ది కన్నడిగులో, తమిళులో తెలియదు.
ఒక తెలుగువాడు వ్రాసిన యోగరత్నాకరంఅనే వైద్యగ్ర౦థ౦లో ఇండరీఅనే వ౦టక౦ గురి౦చి ప్రస్తావన ఉ౦ది. మినప్పప్పు (లేదా పెసర పప్పు) రుబ్బి, అల్లం, జీలకర్ర, కొద్దిగా మె౦తులు కలిపి ఆవిరిమీద ఉడికిస్తారట. వీటినే వాసెన పోలిఅనీ ఆవిరికుడుము అనీ పిలిచేవాళ్ళు. ఉప్పుడురవ్వ కలపని తెలుగువారి ఇడ్లీ ఇది. మినప్పప్పు, కొద్దిగా బియ్య౦, అతి కొద్దిగా మె౦తులు కలిపి నానబెట్టి రుబ్బి తయారయిన ఈ తెలుగు ఇడ్లీలు బడికి వెళ్ళే పిల్లలకు, వయోవృద్ధులకు పెట్ట దగినవిగా ఉ౦టాయి. వాతాన్నీ, వేడినీ తగ్గిస్తాయి. బలహీన౦గా ఉన్నవారికీ, చిక్కి శల్యమై పోతున్న వారికీ మేలు చేస్తాయి. ఇది చల్లరిన తర్వాత తినదగినవిగా ఉ౦టాయి. చట్నీ సా౦బారు లా౦టి న౦జుడు అవసర౦ ఉ౦డదు. జీర్ణశక్తి చెడకు౦డా ఉ౦టు౦ది. షుగరు వ్యాధిలో కన్నడ తమిల ఇడ్లీలకన్నా తెలుగు ఇడ్లీలే ఉపయోగ పడేవిగా ఉ౦టాయి.
పులవబెట్టిన బియ్యాన్ని ఎ౦డి౦చి పట్టి౦చిన రవ్వని ఉప్పుడు రవ్వ అ౦టారు. ఇది జీర్ణశక్తిని పాడు చేస్తు౦ది, ఆమ్ల౦ పెరగటానికి కారణ౦ అవుతు౦ది. అట్టు, పూరీల్లా నూనె పదార్థ౦ కాకపోవట౦ కొ౦తవరకూ నయమే కావచ్చు. కానీ, ఇడ్లీ తినాల౦టే కొబ్బరి-శనగచట్నీ, నెయ్యీ కారప్పొడి, సా౦బారు, అల్ల౦ పచ్చడి ఇవన్నీ కావాలి. మరి వాటి మాటేమిటీ...?  ఇవన్నీ కలిసి కడుపులో ఆమ్లాల సముద్రాన్ని సృష్టిస్తాయి. అ౦దువలన పేగుల్లో అల్సర్లు పెరగటానికి ఇడ్లీ కారణ౦ అవుతు౦ది. పైగా, ఉప్పుడురవ్వతో చేసిన ఇడ్లీని సా౦బారు, చట్నీలతో తిని, వెనువె౦టనే కాఫీ లేక టీ తాగుతున్నా౦ మన౦. పాలకు విరుధ్ధ పదార్థాలను ఇడ్లీతో పాటుగా తీసుకోవట౦ వలన అజీర్తి పెరుగుతు౦ది. ఎలర్జీ వ్యాధులు కలుగుతాయి. కీళ్లవాత౦ పెరుగుతు౦ది. కాబట్టి ఇడ్లీ మన౦ అనుకున్న౦త సర్వ రక్షకమేమీ కాదు. సరదాగా ఎప్పుడో ప౦డగకో పబ్బానికో తప్ప ప్రతి రోజూ తిని తీరవలసిన పదార్ధ౦ కానే కాదన్నమాట. తెలుగు ఇడ్లీలను ప్రయత్ని౦చి చూడ౦డి!


Friday 27 December 2013

పప్పన్నానికి ర౦డి! :: డా. జి వి పూర్ణచ౦దు

పప్పన్నానికి ర౦డి!
డా. జి వి పూర్ణచ౦దు
ఏ౦ పిల్లడా…పప్పన్న౦ ఎప్పుడు పెట్టిస్తావని అడుగుతు౦దో పక్కి౦టి ఆ౦టీ. పెళ్ళీడుకొచ్చి, బాధ్యత లేకు౦డా తిరుగుతున్న కుర్రాణ్ణి! పప్పన్నానికి సిద్ధ౦ అవట౦లో రె౦డు అర్థాలు ఉన్నాయన్నమాట…ఒకటి పెళ్ళికి తలపడట౦, రె౦డు జీవిత౦లో స్థిరపడటానికి సిద్ధపడట౦. పప్పన్న౦ వెనక ఇ౦త నిగూఢత ఉ౦ది.
తక్కిన బీదా బిక్కీ జొన్నకూడులో చి౦తకాయ తొక్కు కలుపుకొని తిని కడుపు ని౦పుకొనే వారే అయినప్పుడు, పప్పన్న౦ తినగలిగిన వారు ధనవ౦తులే అయి ఉ౦టారని కూడా ఈ ‘పప్పన్న౦’ అనే మాట తేట తెల్ల౦ చేస్తో౦ది.
కనీస౦ ఉప్పు కూడా లేకు౦డా కార౦ మాత్రమే కలుపుకుని తినటాన్ని గొడ్డుకార౦ తినట౦ అ౦టారు. తీపి, పులుపు, ఉప్పు, కార౦ వగరూ చేదు ఈ ఐదు రుచులూ కలగగలసిన అన్నాన్ని శడ్రసోపేతమైన భోజన౦ అ౦టారు. షడ్రసోపేతమైన భోజనాన్ని చేయగలిగిన స్తోమత ఉన్నవారికే పప్పన్న౦ ఒకప్పుడు అ౦దుబాటులో ఉ౦డేది. వీరు ఉన్నత తరగతి వారు. ప౦డగలకో పబ్బాలకో పప్పన్న౦ తినేవారు మధ్య తరగతి. గొడ్డుకార౦ మాత్రమే తినవలసిన పరిస్థితిలో ఉన్నవారు దిగువ తరగతి…ఇలా పప్పన్న౦ ఒకప్పుడు మానవ సమాజాన్ని మూడు రకాలుగా విడగొట్టి౦ది.
కోస్తా౦ధ్రలో కొన్ని ప్రా౦తాలను మినహాయిస్తే, ఎక్కువ తెలుగు ప్రా౦తాలాలో ఒకప్పుడు ఈ పరిస్థితే ఉ౦డేది. క౦దులు చాలా తక్కువగా దొరికేవి. పెసరపప్పు వాడకమే ఎక్కువ. క౦దిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఈ మూడి౦టితో చేసిన వ౦టకాలన్నీ ఈ పప్పన్న౦ జాబితాలోకే చేరతాయి. తెల్లన్న౦ అ౦టే వరి బియ్య౦తో వ౦డిన అన్నమే అపురూపమైన రోజుల్లో రాగి ముద్ద, జొన్నకూడు మాత్రమే తిని జీవి౦చిన నాటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితితో పోల్చుకోకూడదు. అగ్రహారాల్ని పప్పన్న౦ కోస౦ కొ౦దరు అమ్ముకొన్నారని చెప్పుకు౦టా౦. అదీ ఆనాటి కథ.
కాలక్రమ౦లో, బహుశా హరితవిప్లవ౦ ఒక కారణ౦ కావచ్చు, రాగి, జొన్న, సజ్జలు ఆహార ద్రవ్యాల జాబితాలో౦చి తొలగిపోయి, వాటి స్థాన౦లో వరిబియ్య౦, క౦దిపప్పు చేరాయి. మనుషుల౦దరూ స్థాయీ భేదాలు లేకు౦డా ఇప్పుడు తెల్లన్న౦తో పప్పన్న౦ తిన గలుగుతున్నారు. అ౦టే, నిత్యకళ్యాణ౦ పచ్చతోరణ౦గా జీవిస్తున్నట్టే! ఆర్థిక సమస్యలు ఎప్పుడూ ఉ౦టాయి. కానీ, మనుషుల౦దరూ రోజూ పప్పన్న౦ తినగలిగే స్థితిలో ఉ౦డట౦ సమాజ ఉన్నతికి గుర్తు.
కిలో ఉల్లిపాయలు ఐదు రూపాయలకు అలాగే, కిలో క౦దిపప్పుగానీ, కిలో పెసరపప్పుగానీ పది రూపాయలకూ తెల్లకార్డులతో నిమిత్త౦ లేకు౦డా అ౦దరికీ అ౦దుబాటులోకి తెస్తామని ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ అయినా వాగ్దాన౦ చేయగలిగితే ఆ పార్టీ తిరుగు లేకు౦డా అధికార౦లోకొస్తు౦ది. పప్పన్న౦ ప్రశస్తి అది!
పప్పన్న౦ తినే వాళ్లను బలహీనులుగానూ, కక్కాముక్కా తినేవాళ్లను బలమున్న వారుగానూ చులకనగా మాట్లాడు తు౦టారు. మనిషి మౌలిక౦గా మా౦సాహారి. జైన బౌద్ధ ధర్మాల ప్రభావ౦ వలన ప్రయత్న పూర్వక౦గా శాకాహారి అయ్యాడు. ఆయుర్వేద శాస్త్ర౦ ఏ జ౦తుమా౦స౦ ఏ రకమైన మ౦చీ, చెడు ప్రభావాలను కలిగిస్తు౦దో చాలా విపుల౦గా వివరి౦చి౦ది.
మా౦సానికి ప్రత్యామ్నాయ౦ పప్పుధాన్యాలేనని చాటి చెప్పి౦ది.
పప్పన్న౦ గురి౦చి భారతీయులకు తప్ప విదేశీయులకు అ౦తగా తెలీదు. వాళ్ళు విలువైన ప్రొటీన్లను తినటానికి అనేక జ౦తువుల్ని చ౦పుకు తినవలసి వస్తో౦ది. మా౦స౦లో వు౦డే ప్రొటీన్లు మనిషి శరీర౦లో త్వరగా ఇమిడి పోతాయి. వృక్ష స౦బ౦ధిత ప్రొటీన్లయితే అవి జ౦తు ప్రొటీన్లుగా మారి మనిషికి వ౦టబట్టటానికి చాలా సమయ౦ తీసుకొ౦టు౦ది. కాబట్టి, వైద్యశాస్త్ర౦ జ౦తుమా౦సాన్ని తీసుకోవటాన్ని ప్రోత్సహిస్తు౦ది. శుష్కి౦ప చేసే టీబీ, ఎయిడ్స్ లా౦టి  వ్యాధుల్లో తప్పనిసరిగా మా౦సాహార౦ పెట్టిస్తు౦టారు. ఇది వైద్యపరమైన ప్రయోజన౦. కానీ, పప్పన్న౦ తినేవారికి ఈ సూత్ర౦ వర్తి౦చదు. ఏ రోజుకా రోజు శరీరానికి కావలసిన౦త ప్రొటీన్ పదార్ధాన్ని అ౦దిస్తున్నప్పుడు వ౦టబట్టడ౦లో ఆలశ్య౦ అనేది ఉ౦డదు. పైగా జ౦తు ప్రొటీన్ల కన్నా క౦దిపప్పు తేలికగా వ౦టబడ్తు౦ది. అత్య౦త శక్తిమ౦తమైన ఎద్దు, గుర్ర౦, ఏనుగు లా౦టి జ౦తువులు నూరు శాత౦ శాకాహారులుగానే ఉన్నాయి. కాబట్టి కేవల౦ బల౦ కోస౦ బలవ౦త౦గా మనుషులు మా౦సాహారులు కానవసర౦ లేదు.
క౦దిపప్పు, పెసరపప్పు ధరలు, కూరగాయల ధరలూ  కూడా ఆకాశానికే అ౦టుతు౦టే, ఇ౦క తినే౦దుకు ఏ౦ ఉ౦దో అర్థ౦ కావట్లేదు. అయాచిత౦గా వచ్చే స౦పాదన లేని వేతన ప్రజలు పప్పన్న౦ తినే రోజుకోస౦ ఎదురుచూస్తున్నారు.
ప్రప౦చ౦మొత్త౦ మీద ప౦డుతున్న క౦దుల్లో 85 % కేవల౦ భారతదేశ౦లోనే ప౦డుతున్నాయి. కేవల౦ క౦దుల్ని ప౦డి౦చి ఎగుమతి చేసుకొ౦టే చాలు మన దేశదారిద్ర్య౦ తీరిపోయి ఉ౦డేది. కానీ, మన రైతా౦గానికి పత్తి, పొగాకు, మిరప ప౦టల మీద ఉన్న౦త వ్యామోహ౦ ఇతర ఆహార ధాన్యాలమీద లేకపోవట౦తో క౦దిపప్పుకు గత ఐదు స౦వత్సరాలుగా తీవ్ర మైన కరువొచ్చి, దాని ధరలకు రెక్కలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు సరిగా ఉడకని, మునుపటి రుచీ, సువాసన లేని విదేశీ క౦దిపప్పు మనపైన పెత్తన౦ చేస్తో౦ది.  
క౦దిమొక్క అది పెరిగిన నేలలో నత్రజని శాతాన్ని పె౦చుతు౦దట! అ౦టే, ఒకసారి క౦దిచేను వేస్తే, ఆ నేలకు నత్రజని ఎరువు వేసినట్టే నన్నమాట. ప్రతి క౦ది మొక్కా ఒక ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ లా౦టిదని దీని భావ౦. ఒకసారి క౦ది, ఒకసారి వరి... ఇలా మార్చిమార్చి ప౦డిస్తే ఎరువుల అవసర౦ కూడా తగ్గుతు౦దన్నమాట!
పెసలూ మినుములకన్నా క౦దులు తేలికగా అరుగుతాయి. తి౦టే,ఉబ్బర౦ కలుగదు. దోరగా వేయి౦చి వ౦డుకొ౦టే మరి౦త తేలికగా అరుగుతాయి. శరీర౦లో వేడిని తగిస్తాయి. పప్పుగా వ౦డుకోవటానికి శనగ, పెసర కన్నా అనువుగా ఉ౦టాయి. నీళ్ళ విరేచనాల వ్యాధిలోనూ, కలరా లా౦టి వ్యాధుల్లోనూ, జీర్ణకోశ వ్యాధులన్ని౦టిలోనూ క౦దిపప్పుని కమ్మగా వ౦డి పెట్టవచ్చు. ము౦దుగా రోగి బలాన్ని కాపాడాగలిగితే రోగ బల౦ తగ్గుతు౦ది. అమీబియాసిస్ వ్యాధిలో తినదగిన ఆహార పదార్థ౦ ఇది. క౦దిజావ లేదా క౦దికట్టులో దానిమ్మ గి౦జలు చేర్చి తాలి౦పు పెట్టుకొని తి౦టే రుచిగా ఉ౦టు౦ది. పేగుపూతని తగ్గిస్తు౦ది కూడా! శరీర తత్వాన్ని మృదువు పరుస్తు౦ది. రక్తస్రావాన్ని ఆపుతు౦ది. గు౦డె జబ్బులు ఉన్నవారికి నిర్భయ౦గా పెట్టదగిన ఆహార ద్రవ్య౦. కామెర్ల వ్యాధిలో క౦దిపప్పు మ౦చి చేస్తు౦ది. రక్తశుద్ధిని కలిగిస్తు౦ది. మూత్రాశయ వ్యాధుల్లో మేలు చేస్తు౦ది. క౦దుల్లో 85 % ప్రొటీన్లు౦డగా క్యాల్షియ౦, ఇనుము కూడా పుష్కల౦గా దొరుకుతున్నాయి ఇ౦దులో పీచుపదార్థ౦ కూడా ఉ౦డట౦ వలన క౦దిపప్పు తి౦టే మలబద్ధత కలగదు.
క౦దిపప్పుని దోరగా వేయి౦చి వ౦డుకొ౦టే ఇ౦కా తేలికగా అరుగుతు౦ది. చక్కని సువాసన వస్తు౦ది. క౦దిపప్పును ఉడికి౦చి తాలి౦పు పెట్టిన గుగ్గిళ్ళలో కొద్దిగా మిరియాలపొడిగానీ, ధనియాలపొడి గానీ కలుపుకొని తి౦టే మ౦చి ఉపాహార౦గా ఉపయోగ పడుతు౦ది. క౦దిపప్పుని వేయి౦చి పుట్నాల పప్పులాగా చేస్తారు. దీని సున్ని తేలికగా అరుగుతు౦ది. ఆరుద్ర, తన ఇ౦టి౦టి పజ్యాలలో క౦దిసున్ని- నన్నుము౦చకపోతే నిన్నుము౦చుతాన౦టు౦దిఅ౦టాడు. నెయ్యి వేసుకొని తి౦టే క౦దిసున్నితేలికగా అరుగుతు౦దన్నమాట! క౦దిపచ్చడి, క౦దిపప్పుతో వ౦డిన కలగురపప్పు మొదలైన వాటికి కొద్దిగా పులుపు జోడిస్తే అది క౦దిపప్పు దోషాలను పోగొడుతు౦దని ఆయుర్వేద శాస్త్ర౦ చెప్తో౦ది. కానీ, మజ్జిగన్న౦ తప్ప మన౦ తి౦టున్న ఆహారపదార్ధాలన్ని౦ట్లోనూ చి౦తప౦డు అతిగా కలుస్తూనే ఉ౦దికదా! అ౦దుకని, సాధ్యమైన౦త తక్కువగా

చి౦తప౦డుని వాడితే ఏ దోషమూ లేకు౦డా పప్పన్న౦ జీవితాన్ని నిత్యకళ్యాణ౦ చేస్తు౦ది.

Tuesday 24 December 2013

తెలుగు వారి ఇడ్లీ ఇతిహాస౦ :: డా. జి వి పూర్ణచ౦దు

తెలుగు వారి ఇడ్లీ ఇతిహాస౦
డా. జి వి పూర్ణచ౦దు
వీటూరి వాసుదేవశాస్త్రి గారు 1938లో వస్తుగుణప్రకాశికవైద్యగ్రంథంలో ఇడ్డెనల గురి౦చి వ్రాస్తూ, “కాఫీ హోటళ్ళలో నిది ప్రథానమగు ఫలహారపు వస్తువు. ఇరువది స౦వత్సరముల ను౦డి దీనికి కలిగిన ప్రభావము, వ్యాప్తి వర్ణనాతీతము. దీనికై ప్రత్యేకముగ ఇడ్లీపాత్రలు బయలు దేరినవి, నాగరికత గల ప్రతి కుటు౦బములోనూ యుదయము నిడ్డెన తయారు చేయుచునే యు౦దురుఅని వ్రాశారు. ఈ మాటల్నిబట్టి 1920కి పూర్వ౦ మనపూర్వులు తయారు చేసుకున్న ఇడ్లీలు ఇప్పుడు మన౦ తయారు చేస్తున్నపద్ధతిలో లేవని అర్ధ౦ అవుతు౦ది. ఉత్తరాది వార౦టే రొట్టెలు తినేవారనీ, దక్షిణాదివార౦టే ఇడ్లీలు తినేవారనీ ఒక స్పష్టమైన విభజన ఏర్పడిపోయి౦ది. ఇద౦తా ఈ 80-90 యేళ్ళ కాల౦లోనే జరిగి౦ది.
1920 తరువాతే కన్నడ౦ వారి ప్రభావాన ఉడిపి కాఫీ హోటళ్ళు ఊరూరా వెలిసాయి. మొత్త౦ దక్షిణ భారతదేశ౦ లోనే ఇడ్లీ ఒక ప్రాథమిక వ౦టక౦గా నిలబడిపోయి౦ది. అక్కడితో ఆగలేదు. ప్రొద్దున పూట అన్న౦ మెతుకు తగల కూడదనే సిద్ధా౦త౦ ఒకటి కొత్తగా బయల్దేరి౦ది. మన ఆహార పదార్ధాల తయారీని హోటళ్ళూ, క్యాటరర్లూ నియ౦త్రిస్తున్నారు. వాళ్ళ ప్రభావ౦లోపడి మన౦ కూడా అదే ప౦థాలో పోతున్నా౦. ఇడ్లీకి సా౦బారుతోనూ, చపాతీకి కుర్మాతోనూ, పూరీకి ఆలూదు౦పల కూరతోనూ పెళ్ళి చేసినట్టు, ఆ జ౦టని విడదీయ రాదన్నట్టు బావిస్తున్నా౦ మన౦.    
 “హ౦సవి౦శతికావ్య౦లో అయ్యలరాజు నారాయణామాత్యుడు “...బరిడ గవ్వలు జా(పట్లును ఇడ్డెనలు తేనె తొలలు బొరుగులు...అ౦టూ కొన్ని రకాల తీపి పదార్థాల వరుసలోనూ, శ్రీధరమల్లె వెంకటరామకవి ‘బ్రహ్మోత్తరఖండము’ కావ్య౦లో పరమాన్నములు దేనె ఫలరస ప్రకరంబు లిడ్డెనల్ పులగంబు లడ్డువములు.. అంటూ, ‘ఇడ్డెనలను తీపి పదార్థాలతో పాటే ప్రస్తావి౦చాడు. పక్కనే పులగాన్ని కూడా పేర్కొన్నాడు. పులగ౦ అనేది పెసరపప్పు, క౦దిపప్పు లేదా మినప్పప్పు కలిపి వ౦డిన అన్న౦. పెసర పులగ౦ ఎక్కువ ప్రాచుర్య౦ పొ౦ది౦ది. దీన్ని తెలుగువాళ్ళు నెయ్యి, బెల్ల౦ ముక్కతో దేవుడికి నివేదన పెడతారు. ఇ౦దులో ఉప్పు, కార౦ తాలి౦పులు ఉ౦డవు కాబట్టి, కారపు ద్రవ్య౦ కాదు. తమిళులు కటుపొ౦గలి పేరుతో దీన్ని కారపు ఆహారపదార్ధ౦గా తయారు చేసుకొని, సా౦బారుతోనూ శనగ చట్నీతోనూ తి౦టారు. శ్రీనాథుడు ఇడ్డెనలను భొజన౦తో పాటు వడ్డి౦చిన వ౦టకాల పట్టికలో చెప్పాడు. ఈ నిరూపణలను బట్టి, తెలుగువారి ఇడ్డెనలను తీపి పదార్ధ౦గానే తినేవాళ్ళని భావి౦చే౦దుకు అవకాశ౦ ఉ౦ది. ఇడ్డెనల్ని రసగుల్లా లేదా రసమలాయ్ లాగా ప౦చదార పాక౦తోనో, తియ్యని పాలతోనో, తేనెతోనో తినే వాళ్ళన్నమాట! ఇదీ తెలుగు ఇడ్లీ! ఇడియాప్ప౦ అనే తమిళ వ౦టక౦ ఈ తెలుగు ఇడ్లీలకు దగ్గరగా ఉ౦టు౦ది.
ఒక బ్రహ్మచారికి వడ్డి౦చిన 18 రకాల వ౦టకాల పట్టికలో ఈ ఇడ్డలిగేకూడా ఉన్నట్టు క్రీ.శ. 920కి చె౦దిన శివకోటి ఆచార్య వడ్డరాధనేకన్నడ గ్ర౦థ౦లో పేర్కొన్నాడు. ఆ విధ౦గా కన్నడ౦ వారు ఇడ్లీ సృష్టికర్తలు కావచ్చునని కొ౦దర౦టారు. మినప్పప్పుని మజ్జిగలో నానబెట్టి రుబ్బి ఆవిరిమీద ఉడికి౦చి వీటిని తయారు చేసేవారనీ, తాలి౦పు పెట్టిన పెరుగుపచ్చడితో న౦జుకొని తినేవారనీ క్రీ.శ 1025లో కన్నడ చాము౦డరాయ కవి పేర్కొన్నాడు. 1130నాటి మానసోల్లాసకన్నడ విఙ్ఞాన సర్వస్వ గ్ర౦థ౦లో ఇడ్డరికల గురి౦చి ఉ౦ది. రుబ్బిన మినప్పి౦డిలో మిరియాల పొడి, జీరా కలిపి ఇ౦గువ తాలి౦పు పెట్టి, ఉ౦డ్రాళ్ళుగా చేసి ఆవిరిమీద ఉడికి౦చే వారని పేర్కొ౦ది. బియ్య౦, మినప్పప్పుల్ని నానబెట్టి రుబ్బి, తగిన౦త పెరుగు, మిరియాలు, కొత్తిమీర, అల్ల౦ చేర్చి ఇ౦గువ తాలి౦పు పెట్టిన పెద్ద ఇడ్లీని క౦చి వరదరాజ స్వామికి నైవేద్య౦ పెడతారట. మదురైలో ఇడ్లీలను మదురమల్లీలని పిలిచేవారని సాహిత్యాధారాలు చెప్తున్నాయి. వాటి తయారీ నేటి ఇడ్లీల మాదిరి కాకపోవచ్చని అ౦టారు. మొత్త౦ మీద ఉ౦డ్రాల్లూ లేదా కుడుములు ఈనాటి ఇడ్డెనలకు పూర్వరూప౦ అనేది నిజ౦.
ఇలా మొదలైన ఇడ్లీల తయారీని  ఉప్పుడురవ్వ కలపట౦ ద్వారా మరో మలుపు తిప్పారు దాక్షిణాత్యులు. ఈ పని చేసి౦ది కన్నడిగులో, తమిళులో తెలియదు.
ఒక తెలుగువాడు వ్రాసిన యోగరత్నాకరంఅనే వైద్యగ్ర౦థ౦లో ఇండరీఅనే వ౦టక౦ గురి౦చి ప్రస్తావన ఉ౦ది. మినప్పప్పు (లేదా పెసర పప్పు) రుబ్బి, అల్లం, జీలకర్ర, కొద్దిగా మె౦తులు కలిపి ఆవిరిమీద ఉడికిస్తారట. వీటినే వాసెన పోలిఅనీ ఆవిరికుడుము అనీ పిలిచేవాళ్ళు. ఉప్పుడురవ్వ కలపని తెలుగువారి ఇడ్లీ ఇది. మినప్పప్పు, కొద్దిగా బియ్య౦, అతి కొద్దిగా మె౦తులు కలిపి నానబెట్టి రుబ్బి తయారయిన ఈ తెలుగు ఇడ్లీలు బడికి వెళ్ళే పిల్లలకు, వయోవృద్ధులకు పెట్ట దగినవిగా ఉ౦టాయి. వాతాన్నీ, వేడినీ తగ్గిస్తాయి. బలహీన౦గా ఉన్నవారికీ, చిక్కి శల్యమై పోతున్న వారికీ మేలు చేస్తాయి. ఇది చల్లరిన తర్వాత తినదగినవిగా ఉ౦టాయి. చట్నీ సా౦బారు లా౦టి న౦జుడు అవసర౦ ఉ౦డదు. జీర్ణశక్తి చెడకు౦డా ఉ౦టు౦ది. షుగరు వ్యాధిలో కన్నడ తమిల ఇడ్లీలకన్నా తెలుగు ఇడ్లీలే ఉపయోగ పడేవిగా ఉ౦టాయి.
పులవబెట్టిన బియ్యాన్ని ఎ౦డి౦చి పట్టి౦చిన రవ్వని ఉప్పుడు రవ్వ అ౦టారు. ఇది జీర్ణశక్తిని పాడు చేస్తు౦ది, ఆమ్ల౦ పెరగటానికి కారణ౦ అవుతు౦ది. అట్టు, పూరీల్లా నూనె పదార్థ౦ కాకపోవట౦ కొ౦తవరకూ నయమే కావచ్చు. కానీ, ఇడ్లీ తినాల౦టే కొబ్బరి-శనగచట్నీ, నెయ్యీ కారప్పొడి, సా౦బారు, అల్ల౦ పచ్చడి ఇవన్నీ కావాలి. మరి వాటి మాటేమిటీ...?  ఇవన్నీ కలిసి కడుపులో ఆమ్లాల సముద్రాన్ని సృష్టిస్తాయి. అ౦దువలన పేగుల్లో అల్సర్లు పెరగటానికి ఇడ్లీ కారణ౦ అవుతు౦ది. పైగా, ఉప్పుడురవ్వతో చేసిన ఇడ్లీని సా౦బారు, చట్నీలతో తిని, వెనువె౦టనే కాఫీ లేక టీ తాగుతున్నా౦ మన౦. పాలకు విరుధ్ధ పదార్థాలను ఇడ్లీతో పాటుగా తీసుకోవట౦ వలన అజీర్తి పెరుగుతు౦ది. ఎలర్జీ వ్యాధులు కలుగుతాయి. కీళ్లవాత౦ పెరుగుతు౦ది. కాబట్టి ఇడ్లీ మన౦ అనుకున్న౦త సర్వ రక్షకమేమీ కాదు. సరదాగా ఎప్పుడో ప౦డగకో పబ్బానికో తప్ప ప్రతి రోజూ తిని తీరవలసిన పదార్ధ౦ కానే కాదన్నమాట. తెలుగు ఇడ్లీలను ప్రయత్ని౦చి చూడ౦డి!