Showing posts with label ఆరోగ్య౦. Show all posts
Showing posts with label ఆరోగ్య౦. Show all posts

Friday, 3 May 2019

షుగరు వ్యాధి-పసుపుతో గెలుపు:: డా. జి వి పూర్ణచందు


షుగరు వ్యాధి-పసుపుతో గెలుపు::
డా. జి వి పూర్ణచందు
పసుపు ఆహార ద్రవ్యం,ఔషధం మాత్రమే కాదు, హిందువులకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అది పవిత్రమైంది, శుభకరమైంది కూడా! ఇతర దేశీయులకు పసుపు ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే!  లేదా ఆహార ద్రవ్యానికి పచ్చని రంగునిచ్చేందుకు మాత్రమే వాడుకుంటూ ఉంటారు. భారతీయులు పసుపు ముద్దలో భగవంతుణ్ణి చూస్తారు. తెలుగిళ్ళలో పసుపు ముద్ద వినాయకుడు, పసుపు ముద్ద అమ్మవారు నిత్యపూజలందుకుంటున్నారు.
చిన్నగ్లాసు నీళ్ళలో చిటికెడు పసుపు కలిపి పవిత్ర జలాలుగా భావిస్తారు. ఇంటి నలుమూలలా పసుపు నీళ్ళు చల్లి పవిత్రతను పొందుతారు. మంగళ స్నానాలను పసుపు కలిసిన నీళ్ళతో ఆచరిస్తారు. మాంగల్య బంధానికి పసుపు తాడుని కట్టుకోవటం తెలుగు ప్రజలతో పసుపు ఎంత ముడిపడిందో సాక్ష్యం ఇస్తుంది.  పుస్తెలు లేకపోతే బదులుగా పసుపు కొమ్ము కట్టుకునే తెలుగు సాంప్రదాయం పసుపుని ఎంతో ఉన్నత స్థానంలో నిలిపింది. పసుపు కలిపిన అన్నం (పులిహోర), పసుపు కలిపిన నీళ్ళు, పసుపు కలిపిన కూరలు, పసుపు నీళ్ళలో తడిపిన బట్టలు...ఇలా పసుపుతో పవిత్రీకరించుకుంటారు తెలుగువాళ్ళు.
పసుపు పవిత్రమైనదనీ, శుభకరమైనదనీ భావించటం మతపరమైన అంశం కాదు. అది సంస్కృతి పరమైనదిగా భావించాలి!. పసుపులోని ఔషధ గుణాలే దానికా ప్రాముఖ్యతను కలిగించాయి.  
పసిమి, పసిమిడి, పసిడి, పైడి, పమిడి, భమిడి ఇవన్నీ బంగారానికి సంబంధించిన పదాలు. బంగారం రంగులో ఉంటుంది కాబట్టి పసు ఆ పేరుతో ప్రసిద్ధం అయ్యింది.  పసుపు పచ్చ అనడం కూడా ఉంది. పచ్చ, పచ్చన, పచ్చి, పసరు, పచ్చిక, ఇవన్నీ ఆకుపచ్చ అనే అర్థంలో వాడుతున్న పదాలు. పచ్చ అనే మాటని పసుపు రంగుక్కూడా వాడుతుంటారు. అలా పసుపుపచ్చ అనటం  అలవాటయ్యింది.
పసుపు రంగుని బట్టే కాదు, గుణాన్ని బట్టి కూడా అది బంగారమే! పసుపుని ఔషధంగా ఆహార ద్రవ్యాల్లో వాడుకుంటే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. పసుపుకొమ్ముల్ని ఎండించి, మరపట్టించిన పసుపుతో, బజార్లో దొరికే పసుపుని పోలిస్తే, నూరు శాతం గుణాలు అనుమానమే! అందుకే పసుపులో ప్రధాన ద్రవ్యం కర్కుమిన్ అనే రసాయనాన్ని కూరల్లో కలుపుకొని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కర్కుమిన్ కూడా బజార్లో దొరికేదే కాబట్టి,అక్కడా కల్తీలకు అవకాశం ఉంటుంది. అందుకని, పసుపు కొమ్ముల్ని మరాడించుకోవటమే సర్వ శ్రేష్ఠం. 
పసుపు యాంటీ బయటిక్ అనేది జనవ్యవహారంలో ఉన్న విషయం. అంతకు మించిన ఔషధ ప్రయోజనాలు పసుపు వలన మనకు సమకూరుతున్నాయి. పసుపు పని చేయని వ్యాధిలేదు. భయంకరమైన వ్యాధుల్లో కూడా పసుపు ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కేన్సర్, కీళ్లవాతం, సొరియాసిస్, ఇతర చర్మవ్యాధులు, లివర్, మూత్రపిండాల వ్యాధులు, షుగరు వ్యాధుల్లో పసుపు ప్రభావాన్ని ఆయుర్వేద శాస్త్రం బాగా విశ్లేషించింది. ఆయుర్వేద ప్రభావానే తెలుగు ప్రజలు పసుపును తమ సంస్కృతిపరమైన అంశంగా గౌరవించుకుంటూన్నారు.
పాశ్చాత్య వైద్యంలో పసుపు ఔషధ ద్రవ్యం కాదు. అల్లోపతి ఔషధాల్లో దేనికీ బదులుగా పసుపును వాడుకోవచ్చని చెప్పటానికి లేదు. అరిజోనా విశ్వవిద్యాలయంలో కీళ్లవాతం మీద జరిగిన పరిశోధనల్లో పసుపును రోజూ ఆహార ద్రవ్యంగా తీసుకుంటే కీళ్లవాతం మీద బాగా పనిచేస్తోందని ఆ మధ్య ఒక నివేదికను ఇచ్చారు.
పూర్వం ఆధునిక వైద్యంలో కూడా పసుపును కేన్సర్ నిరోధక ఔషధంగానే భావించేవారు. కానీ, పసుపుని ప్రధానమైన ఔషధంగా ప్రయోగించే ప్రయత్నాలు అంతగా సాగలేదు. అత్యంత తాజాగా 2017 జూన్ 1 మెడ్‘టుడే వెబ్ జర్నల్లో జాన్ జాన్సన్ అనే శాస్త్రవేత్త షుగరు వ్యాధిమీద పసుపు ప్రభావం అనే అద్భుతమైన వ్యాసం వ్రాశాడు. పసుపును ఆహార ద్రవ్యంగా తీసుకుంటే అనేక వ్యాధులమీద దాని సుగుణాలు కనిపిస్తున్నాయంటారాయన.
ఆయుర్వేద శాస్త్రంలో నిశామలకీ చూర్ణం అనే ఔషధం ఉంది. నిశ అంటే పసుపు. ఆమలకి అంటే పెద్ద ఉసిరికాయ. ఈ పెద్ద ఉసిరి కాయల లోపల గింజలు తీసేసి, బెరడునీ, దానికి సమానమైన తూకంలో పసుపుకొమ్ముల్నీ కలిపి మరాడిస్తే అదే నిశామలకీ చూర్ణం. ఇది ఆయుర్వేద వైద్యంలో షుగరు వ్యాధికి ఇచ్చే ప్రసిద్ధ ఔషధం.
నిశామలకి చూర్ణాన్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మిక్సీలు ఉన్నాయి కాబట్టి, ఈ చూర్ణాన్ని తయారు చేసుకోవటం తేలికే! దీన్ని కేవలం షుగరు వ్యాధి వచ్చిన వారి కోసం మాత్రమే అనుకోనవసరం లేదు. షుగరు వ్యాధి రాకుండాను, వచ్చిన వారిలో కీటోసిస్, కారబన్‘కుల్స్ ఏర్పడటం లాంటి ఉపద్రవాలను రాకుండా కూడా కాపాడుతుంది. దీర్ఘ వ్యాధులన్నింటిలోనూ ఒక చెంచా నిశామలకీ చూర్ణాన్ని పాలలో గానీ, మజ్జిగలోగానీ కలిపి రోజూ ఒకటి లేదా రెండుసార్లు త్రాగుతూ ఉంటే మనం ఊహించని మార్పులు కనిపిస్తాయి. పసుపుతో ఉసిరి కూడా తోడు కావటం అనేక వ్యాధుల్లో అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
మనం సంవత్సరం అంతా నిలవుండేలా ఉసిరి తొక్కుపచ్చడి (నల్లపచ్చడి) తయారు చేసుకుంటాం. ఈ తొక్కు పచ్చడిని కొద్దిగా ఇవతలకు తీసుకుని, దానికి సమానంగా పసుపు కలిపి ప్రతిరోజూ అన్నంలో మొదటి ముద్దగా ఒక చెంచాడు మోతాదులో కలుపుకుని తింటే ఎక్కువ గుణవత్తరంగా ఉంటుంది.   
శరీరంలో ఎముకపదార్ధం నష్టపోకుండా పసుపు అడ్డుకుంటుందని ఒక సిద్ధాంతం ఇటీవలే వెల్లడైంది. లివర్ పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రోబర్ట్ మూట్స్ కీళ్ళవాతం చికిత్సలో పసుపు ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించ బోతోందని తెలిపారు. ప్రకృతి సిద్ధంగా దొరికే కొన్ని రసాయనాలు ఔషధ విలువలు కలిగినవి కావడం విశేషమే!
పసుపుని ఆహారంగా వాడుకుంటే నొప్పులు, వాపుల్లో తగ్గుదలను శాస్త్రవేత్తలు గమనించారు. అప్పటినుండీ పసుపు గురించి పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. మాంచెష్టర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్త్రవేత్త డా. అన్న్ బర్టన్ పసుపు కలిసిన కూరలు రోజూ తింటే ఎముకలవ్యాధులు, ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ (ఎముకల్లో ఎముకపదార్థం తగ్గిపోవటం, ఎముకలు మెత్తపడటం) లాంటి బాధలు తగ్గుతాయని పేర్కొన్నారు. శరీరంలో వాపును పేరేపించి, జాయింట్ల మీద దాడి చేసే ప్రొటీన్లను పసుపు అదుపు చేస్తుందని వీరు భావిస్తున్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో 2013లో జరిగిన పరిశోధనలు కూడా పసుపు వలన నొప్పి-వాపు తగ్గుతాయని నిర్థారించాయి. 
పసుపు కేవలం సుగంధ ద్రవ్యం కాదు. ఆహార ద్రవ్యాల్లో పసుపును తగుపాళ్ళలో చేర్చటాన్ని అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తం మీద 2.5 నుండి 3 గ్రాములవరకూ  పసుపును వివిధ ఆహార పదార్ధాల్లో కలిపి తీసుకోగలిగితే పసుపు ఆరోగ్యానికి తలుపులు తెరుస్తుందనీ, వ్యాధులకు తలుపులు మూస్తుందని ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రం పసుపు ప్రాధాన్యతను గుర్తిస్తోంది. అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్, పేగుల్లో వాపు, పేగుపూత, కేన్సర్, కీళ్లవాతం,  బొల్లి, సొరియాసిస్, మతిమరుపు వ్యాధి, షుగరు వ్యాధుల్లో పసుపు ఏ విధంగా పనిచేస్తోందనే విషయం మీద ఇప్పుడు వైద్య శాస్త్ర పరిశోధనలు  దృష్టి సారించాయి. 
శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల పని తీరును పసుపులోని కర్కుమిన్ అనే రసాయనం మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో కీళ్లవాతం, సొరియాసిస్, షుగరు వ్యాధి, రకరకాల కేన్సర్ వ్యాధుల్లో పసుపు ఒక దివ్యౌషధంగా  పనిచేస్తుందనే భావనని చాలామంది శాస్త్రవేత్తలు వ్యక్తపరుస్తున్నారు.
ఒకచెంచా అల్లం ముద్ద, రెండు చెంచాలు మిరియాల పొడి, నాలుగు చెంచాల జీలకర్ర, ఎనిమిది చెంచాల పసుపు, పదహారు చెంచాల ధనియాలపొడి సరిగ్గా ఇదే మోతాదులో కలుపుకుంటే అద్భుతమైన కర్రీ పౌడర్ తయారౌతుంది. దీన్ని అన్ని వంటకాల్లోనూ కలుపుకోవచ్చు. మజ్జిగలో కలిపి తాగితే చాలా రుచిగా ఉంటాయి. ఇష్టమైనవాళ్ళు ఈ మొత్తం పొడిలో అరచెంచా ఇంగువ కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఆయుర్వేద గ్రంథాల్లో వేసవారం అని పిలుస్తారు. ఇది పసుపుని సద్వినియోగపరచుకో గల గొప్ప ఫార్ములా! వైద్య శాస్త్ర రహస్యం. వేసవారాన్ని రోజు మొత్తం మీద ఒకటి లేదా రెండు చెంచాలవరకూ మన కడుపులోకి వెళ్ళేలా తీసుకో గలిగితే తప్పకుండా ప్రయోజనాలు కలుగుతాయి.
పసుపు సమస్త ప్రపంచానికీ సన్మంగళకరమైనది! దాన్ని సద్వినియోగ పరచుకోవటంలో విఙ్ఞత చూపించాలి!

Friday, 31 October 2014

అజీర్తిని జయించే ఆహారం డా. జి వి పూర్ణచందు

అజీర్తిని జయించే ఆహారం

డాజి వి పూర్ణచందు

అజీర్తి కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గటానికి ఒకటీ లేదా రెండు వెల్లుల్లి గర్భాల్ని నమలకుండా మింగేయండిఫలితం కనిపిస్తుంది.
అజీర్తి నివారణకు ఒక ఫార్ములాని చెప్తానుదీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకుని ఎప్పుడు అజీర్తి  అనిపించినా తీసుకుంటూ ఉండటం మంచిదికరక్కాయలు బాగా ఎండినవి మనకు బజార్లో దొరుకుతాయిఈ కాయని పగలగొడెతే లోపల గింజ ఉంటుందిఆ గింజను తీసేసికరక్కాయ బెరడు మాత్రమే మనకు కావాలివంద గ్రాముల కరక్కాయల్లో గింజతీసేస్తే షుమారు యాబై గ్రాముల బెరడు మిగుల్తుంది.  ఈ బెరడుకు సమానంగా పిప్పళ్ళనుసౌవర్చలవణాన్ని తీసుకుని (ఇది దొరక్కపోతే సైంధవ లవణం)మూడింటినీ మెత్తగా దంచిన పొడి అరచెంచా మోతాదులో మ్తీసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే అజీర్తి బాధలు తగ్గతయమంచ జీర్ణశక్తి కలుగతుందిదీన్ని అజీర్ణహర చూర్ణం అని పిలుస్తారు.
ఇలాంటిదే ఇంకో ఫార్ములా కూడా ఉందిసైంధవలవణం కరక్కాయ బెరడుపిప్పళ్ళువాముశొంఠి ఈ ఐదూ పచారీ షాపుల్లో దొరికేవేవీటన్నింటినీ మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండికడుపులో బాగో లేదనిపించినప్పుడుఅజీర్తికర మైనవి తిన్నప్పుడుప్రయాణాల్లో ఉన్నప్పుడూ ఈ పొడిని అరచెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి తాగండిపొట్ట బాగౌతుంది.
అజీర్తి వలన వచ్చే కడుపులో నొప్పి తగ్గటానికిఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి కాయండిబోజనం చేసిన తరువాత కడుపులో నొప్పి వస్తున్నవారికి ఈ ఉప్పు వేసిన నేతిని మొదటి ముద్దగా కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది.
అజీర్తిజీర్ణకోశానికి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా సరేవసకొమ్ముని దంచిన పొడి చిటికెడు తీసుకుని చిక్కని బ్లాక్ టీ లాగా కాచుకుని తాగితేమేలు చేస్తుందికఫం తగ్గుతుందిజ్వర తీవ్రత తగ్గుతుందివిషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుందిమొలలున్న వారికి ఉపశాంతినిస్తుందికడుపులో నులిపురుగులు పోగొడుతుందిమలబద్ధకాన్ని హరిస్తుందిఉబ్బసంలో వచ్చే దగ్గుఆయాసాలను తగ్గిస్తుందిఅతిగా తాగితే వికారం కలిగిస్తుందిస్వల్ప ప్రమాణంలో తీసుకోవాలి.
అజీర్తిని జయించే వాటిలో బిరియానీ ఆకు గొప్పదిఆకుపత్రి అంటారు దీన్ని. బిరియానీలోనో పలావులోనో కలుపు తుంటారుమషాలా ద్రవ్యాలలో ఇది నిరపాయకరమైందిఆరోగ్యాన్నిచ్చేదిఈ ఆకులు కూడా కలిపి మషాలా ద్రవ్యాలను తయారు చేసుకుంటేఅజీర్తిని జయించినట్టే!మలబద్ధతని సరి చేస్తుందికడుపులో నొప్పిని హరిస్తుందిపైత్యాన్ని పోగొడుతుందిబాలింతలకు తల్లిపాలు పెరిగేలా చేస్తుందికడుపులో వాతంగ్యాసూఉబ్బరందుర్గంధతో కూడిన అపాన వాయువులుదుర్గంధంతో కూడిన విరేచనం ఆగుతాయినోటి దుర్వాసన పోతుందిఅల్లం వెల్లుల్లి తగ్గించిఆకుపత్రినీదాల్చిన చెక్కనూ వాడుకుంటూ ఉంటే మంచిదిబియ్యపు నూకను దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పుమిరియాలపొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

జీర్ణశక్తి మందంగా ఉన్నవాళ్ళు దంపుడు బియ్యాన్నో లేక పట్టు తక్కువ బియ్యాన్నో తినటం వలన జీర్ణాశయవ్యవస్థ మరింత దెబ్బతింటుందిగోధుమలూ రాగులూసజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండుకుంటాంవీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూతవుడూ వగైరా తీసేయటం ఉండదుకాబట్టిదంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూరాగులూ సజ్జలూ  వగైరా తృణ ధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిదిజీర్ణాశయం బలగా లేదనుకున్నప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను వండుకుని తింటే పేగులు చెడకుండా ఉంటాయి.
బార్లీ జావసగ్గుబియ్యం జావపేలాలుమరమరాలు(బొరుగులుఇలాంటివి జీర్ణశక్తిని కాపాడతాయిఅజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవటం మంచిదిషుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలుజొన్న అటుకులు చాలా మేలు చస్తాయి.
పెసర పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి కాచిన కట్టులో మిరప కారానికి బదులుగా మిరియాల పొడిని కలుపుకుని అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది.
లేత ముల్లంగి దుంపల జ్యూసు రోజూ ఉదయం పూట తాగుతూ ఉంటే పేగులకు ప్రశాంతత నిచ్చి జీర్ణశక్తిని పెంచుతుంది.
అజీర్తిని తగ్గించే ఒక ఆహార పదార్ధం అష్టగుణమండం: ఇంగువసైంధవలవణంధనియాలుబిరియానీ ఆకు ముక్కలుశొంఠిపిప్పళ్ళు, మిరియాలు... వీటన్నింటినీ సమభాగం తీసుకుని మెత్తగా దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండిబియ్యంలో సగం చాయపెసర పప్పు తీసుకుని నీరు ఎక్కువగా కలిపి జావలాగా కాయండిఒక మనిషికి సరిపడిన జావలో  ఈ పొడిని ఒకచెంచా లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి మరికాసేపు కాచి దింపండిదీన్నే అష్టగుణమండం అంటారుఇది అజీర్తిని తగ్గించే గొప్ప ఔషధంరోజూ తాగినా మంచిదే!
అజీర్తిని పోగొట్టటానికి సూక్ష్మంలో మోక్షంగా పనిచేసే ఇంకో ఉపాయం ఉందికొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని అందులో ఉప్పుమిరియాలపొడి తగినంత కలిపిరోజూ ప్రొద్దున పూట తాగుతూ ఉంటే అజీర్తి పటాపంచ లౌతుందిపైత్యంకడుపులో యాసిడ్పేగుపత వ్యాధుల్లో మంచిదికొత్తిమీర మిరియాలపొడి మిశ్రమాన్ని మెత్తగా నూరి తగినంత ఉప్పు కలిపి భద్రపరచుకోండి. అన్నంలో మొదటి ముద్దగా దీన్ని తింటే అజీర్తి కలగదు.
అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచటంలో ఉప్పుని మించిన ఔషధం లేదుఅయితే ఉప్పుని పరిమితంగా ఒక ఔషధంలాగే వాడుకోవాలిఎందుకంటే ఉప్పు తగ్గినందు వల్ల ఏర్పడే జబ్బుల్లాగే ఉప్పు పెరిగి నందువలన ఏర్పడే జబ్బులు కూడా ఉన్నాయికాబట్టి!  ఉప్పుని ముట్టుకో కూడదన్నట్టు చెప్పటమూ తప్పే! అదే పనిగా తినటమూ తప్పే!
అన్నం తినబుద్ధి కాకపోతున్నప్పుడు బిరియానీ ఆకుని మెత్తగా దంచి మిరియాల పొడి ఉప్పు తగినంత కలిపి  కారప్పొడి చేసుకుని తింటే అన్నహితవు కలుగుతుందిఅన్నహితవు కలగటానికి ప్రతిరోజూ అల్లాన్ని తగినంత ఉప్పు వేసి దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే భోజనంలో ఉండే దోషాలన్నీ పోతాయిఅన్నం తినాలనే కోరిక కలుగుతుందిఅల్లం ఉప్పు కలిపి మెత్తగా నూరి  అన్నంలో ఒక చెంచా మోతాదులో కలుపుకుని నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే అజీర్తి తగ్గుతుందిఅన్నహితవు కలుగుతుందిభోజనం చేసిన తరువాత భుక్తాయాసం కలగకుండా ఉంటుంది.సిరిక్జాయ తొక్కుడు పచ్చడి(నల్లపచ్చడి)  అల్లం మిశ్రమం కలిపి నెయ్యి వేసుకుని ఒకటీ లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా తినటాన్ని అలవాటు చేసుకోవాలిఅజీర్తి లేని వాళ్ళు కూడా ఇది తింటూ ఉంటే జీర్ణ శక్తి పదిలంగా ఉంటుంది.
ఆవపిండి చిటికెడంత కలిపిన వంటకాలను తరచూ తింటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది
ఆహార సమయంలో నీటిని మధ్యమధ్య తాగుతూ ఉంటే అజీర్తి తగ్గిజీర్ణశక్తి పదిలంగా ఉంటూందిఅతిగా నీరు తాగితే జీర్ణశక్తి మందగిస్తుంది.
ఎండిన కిస్మిస్ పళ్ళూ పంచదారతేనె ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచామోతాదులో రెండు పూటలా రోజూ తీసుకుంటే  కడుపులో బాధలు తగ్గి జీర్ణకోశ వ్యవస్థ ఎంతో పదిలంగా ఉంటుంది.
పిప్పళ్లను దోరగా వేయించి మెత్తగా దంచండి పిప్పళ్ళు మీకు పచారీ కొట్లలో దొరుకుతాయిలేదా మూలికలమ్మే వారి దగ్గర దొరుకుతాయితేలికగా దొరికేవేఈ పిప్పలీ చూర్ణానికి ఆరురెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరచుకోండిజీర్ణ వ్యవస్థ బలంగా లేనివారు దీన్ని ఉదయం రాత్రి ఒక్కక్క మాత్ర చొప్పున తీసుకుంటూ ఉంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుందిశరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.
పెరట్లో బొప్పాయి చెట్టు ఉన్నవారు చేసుకోగలిగిన ఫార్ములా ఇదిబొప్పాయి చెట్టుకు గాటు పెడితే పాలు వస్తాయికొద్దిసేపు కష్టపడితే ఒక చెంచా లేదా రెండు చెంచాల పాలు సేకరించవచ్చుఈ బొప్పాయి పాలుంచిన గ్లాసుని వేడి ఇసుకమీద గానీ, సన్న సెగ మీద గానీ ఉంచితే, ఆ వేడికి బొప్పాయి పాలు గడ్డకట్టి పొడిగా అవుతాయిఈ పొడిని చిటికెడంత తీసుకుని గ్లాసు పాలలో గానీమజ్జిగలో గానీ కలుపుకుని తాగితే ఆకలి పరిగెత్తు కొస్తుంది. ‘పెపైన్ అనే ఎంజైమును ప్రకృతి సిద్ధంగా పొందేందుకు ఇది మంచి ఉపాయం.
 పైత్యంఅజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడు,  పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది.


లేత అరటికాయల కూరని మిరియాలపొడితో గానీకాల్చి పెరుగుపచ్చడిగా గానీ చేసుకుని తింటే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.

Tuesday, 7 October 2014

దురద సరదా కాదు- కష్టసాధ్య వ్యాధి :: డా. జి వి పూర్ణచందు.


దురద సరదా కాదు- కష్టసాధ్య వ్యాధి
డా. జి వి పూర్ణచందు.
దూ, జిల, నవ, నస, గాడు, తీంట్రం, కసి, తీట, తీవరం... పాదాలన్నింటికీ ఒకటే అర్థం... దురద!. దురదను వైద్య శాస్త్ర పర౦గా ప్రూరైగో అ౦టారు. గోకాలనిపింప చేసే ఒక అసంకల్పిత చర్య (reflex)ని దురదగా నిర్వచించవచ్చు. మెదడుకు చేరవేసే నాడీ సంకేతం (sensory experience) వలన ఇది అనుభవం లోకొస్తోంది. శరీనికి లేదా మనసుకూ సంతోషదాయకం కాని అనుభవాలలో నొప్పి, దురద ముఖ్యమైనవి. ఒక వస్తువు పుచ్చుకోగానే గుచ్చుకున్నా, కాలినా వెంటనే నొప్పి కలిగి అక్కడినుంచి చటుక్కున ఇవతలకు లాగేసుకుంటాం, అలా లాగేసుకోవటాన్ని withdrawal reflex అంటారు. కానీ, దురద అలాంటిది కాదు. గోకుతూనే ఉండేలా చేస్తుంది. నొప్పీ దురదా చర్మం మీద ఒకేలా పుట్టినా వేర్వేరు అనుభవాలను ఇస్తోన్నాయి.
గోకవలసి రావటం, గోకిన కొద్దీ చమ్మగా అనిపించటం, గోటి గీతలు పడి అవి పుళ్ళై బాధించటం ఇవన్నీ దురద తంటాలు. ఒకరికి ఆవులింతలు వస్తే ఎదుటివారికీ వచ్చినట్టూ, ఒకరికి మూత్రానికి వెళ్ళాలని అనిపిస్తే ఎదుటివారికీ అనిపించినట్టు, దురద కూడా అలా ఇతరుల్లోనూ ద్నవసరమైన దురదను ప్రేరేపిస్తూ ఉంటుంది కూడా!
దురద కలగటానికి బయటనుండి వచ్చే కారణాలు ముందు గమనించాలి. దూలగొండి ఆకుల్లాంటి దురద పుట్టే మొక్కలు, పూలూ, నూగూ, దూగర లాంతివి చర్మానికి తగలటం, శ్ర్ర్రీరం మీద అంగస్ లాంటి చర్మవ్యాధులు సోకటం, కొన్ని రకాల సూక్ష్మకీటక లార్వాలు చర్మం మీద చేరటం, తలలో పేలు ఈపి లాంటివి చేరటం,  హెర్పిస్ లాంటి కొన్ని వైరస్ వ్యాధులు, నల్లులూ, దోమల్లాంటి కీటకాలు కుట్టటం, చర్మంలో ఉండే కొన్ని రసాయన పదార్థాలకు సూర్యరశ్మి సరిపడక పోవటం (ఫోటోడెర్మటైటిస్) గజ్జి, తామర, చిడుము,  చుండ్రు, సోరియాసి, లైకేన్ ప్లేనస్, ఎగ్జీమా, మొటిమలు,  లాంటి చర్మ వ్యాధులూ, సబ్బులు షేవింగ్ క్రీములూ, షాంపూలూ, సెంట్లూ పోలియష్టర్ బట్టలు, క్లోరిన్ ఎక్కువగా కలిసిన నీళ్ళలో నానడం ఇలా దురదను తెచ్చే కారణాలు చాలా ఉన్నాయి. చర్మం మీద దురద వచ్చిందంటే ఇన్ని కారణాలనూ ఒక్కక్క దానే విడివిడిగా పరిశీలించాల్సిందే!  
షుగరు వ్యాధిలో దురద ఒక ప్రధానమైన అంశం. దురద ఉన్నవాళ్లందరికీ డయాబెటీస్ ఉన్నదని గానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళందరికీ దురద ఉంటుందనిగానీ దీని అర్థం కాదు. కానీ, దురదని పెంచి పోషించే వాటిలో ఇది కూడా ఒకటి కాబట్టి ముందుగా షురౌ పరీక్ష చేయించుకోవటం అవసరం. రక్తంలో షుగరు పరిణామం అపరిమితంగా ఉండటం వలన దురద వస్తుంది.  ఠైరాయిడ్ స్రావం రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దురద రావచ్చు.  రక్తహీనత, మూత్రపిండాల వ్యాధులు, కామెర్లు, బయటపడని కేన్సర్,  ముట్లుడిగే (మెనోపాజ్), సమయంలో హార్మోన్ల సమతుల్యతలో తేడాలు ఏర్పడటం ఇలాంటి వ్యాధుల్లో దురద ఒక అనుబంధ లక్షణంగా ఉండవచ్చు.
గర్భవతులకు దురద సహజంగా ఉంటుంది. కడుపులో ఒక అదనపు ప్రాణి పెరుగుతుండటం వలన శరీరం దాన్ని శత్రువుగా భావించి దురదపెడుతుంది. దురద అనేది శత్రువు పొంచిఉన్నదని శరీరం చేసే ఒక హెచ్చరిక కూడా!
ఇవేవీ లేకుండా కేవలం మానసిక కారణాలవలన కూడా దురద రావచ్చు.  వాణ్ణి చూస్తే చాలు నాకు ఒళ్ళు మండి పోత్తుందనో, కంపరం ఎత్తి పోతుందనో అంటూ ఉంటాం. వాణ్ణి చూడంగానే ఈ శారీరిక లక్షణం ఎందుకు కలగాలీ...? దాన్నే మానసిక మైన (psychogenic itch) దురద అంటారు. నాడీ వ్యవస్థ దెబ్బతినటం వలన కొందరిలో Neuropathic itch రావచ్చు. క్లోరోక్విన్ లాంటి మందులు కొందరిలో దురదను ప్రేరేపించవచ్చు. 
దురదలకు, దద్దుర్లకు ఎలెర్జీ నేది ఒక కారణ౦ కావచ్చు. ఎలెర్జీ అ౦టే ఖచ్చితమైన అవగాహన కలిగించటం కూడా అవసరమే! శరీరానికి సరిపడని ఒక ద్రవ్యాన్ని తీసుకున్నప్పుడు అది కలిగి౦చే అపకారాన్ని ఎలెర్జీ అంటారు. మన శరీరానికి  సరిపడని వస్తువును తెలిసి గానీ తెలియక గానీ తీసుకున్న ప్రతిసారీ ఎలెర్జీ లక్షణాలు వస్తూనే ఉంటాయి!
సరిపడని వస్తువును శరీరానికి అది విష౦తో సమాన౦ అవుతు౦ది. విషాన్ని తీసుకున్నప్పుడు లక్షణాలు కలుగుతాయో  శరిరానికి సరిపడని వస్తువును తీసుకున్నప్పుడు కూడా అవే లక్షణాలు కలుగుతాయి. కాకపోతే, ఎక్కువ తక్కువల తేడా ఉ౦డవచ్చు.
సాధారణంగా విషాలను తీసుకున్నప్పుడు శరీర౦ మీద కనిపి౦చే  విషలక్షణాలను ఎలెర్జీ అనరు. విష౦ తిన్నాడు కాబట్టి, విషలక్షణాలు కలిగాయి అ౦తే! కానీ, అ౦దరూ ఇష్ట౦గా, కమ్మగా వ౦డుకుని తినే ఆరోగ్యకరమైన వంకాయి గోంగూర లాంటి ఆహార ద్రవ్యాలు, తీసుకున్నప్పుడు కూడా  విషలక్షణాలు కలిగితే వాటిని ఎలెర్జీ అంటారు.
దురదలు, దద్దుర్లు, దగ్గు, జలుబు, తుమ్ములు, ఉబ్బస౦, నల్లమచ్చలు, బొల్లిమచ్చల్లా౦టివన్నీ ఎలెర్జీ వలన కలిగే లక్షణాలే! ఆరోగ్యాన్నిచ్చే మ౦చి ద్రవ్యాలు కూడా వ్యక్తి శరీరానికి సరిపడకపోవట౦ అనేది వ్యక్తి శరీర౦లోని ఒక పరిస్థితి. అదే ఎలెర్జీకి కారణ౦ అవుతు౦ది.
ఆహార పదార్ధమైనా వ్యక్తికైనా సరిపడకపోవచ్చు. అది వ్యక్తి శరీర తత్వ౦ మీద ఆధారపడి ఉ౦టు౦ది. మన శరీర తత్వాన్ని మన౦ టిక్కు పెట్టి ఎ౦చుకోలేదు కదా... అది మన తాతముత్తాతల ను౦డి వ౦శపార౦పర్య౦గా స౦క్రమి౦చిన అ౦శ౦. పడకపోవట౦ అనే లక్షణాన్ని కలిగిస్తున్నది శరీరతత్త్వమే!
ఎలెర్జీలకు మ౦దులు వాడట౦ అ౦టే వచ్చిన దురదలు, దగ్గూ, జలుబు, ఆయాసం లాంటి బాధలు పోవటానికి మాత్రమే గానీ, శరీర౦లోంచి పడని తత్త్వాన్ని తీసేయటానికి కాదు. ఇది మొదట గమని౦చాలి.
పడని వస్తువును పడే లాగా చేయటానికి చికిత్స ఉ౦డదు.
కాబట్టి, పడని వస్తువును తీసుకున్న ప్రతిసారీ పడకపోవటం వలన కలిగే ఎలెర్జీ లక్షణాలు వస్తాయి. మాత్ర వేసుకో౦డి, మోపెడు గో౦గూర, బుట్టెడు వ౦కాయలు తిన౦డీ...ఎలెర్జీ కలిగితే నన్నడగ౦డిఅనే వైద్య౦ ఎక్కడా ఉ౦డదు. కాబట్టి, సరిపడని వస్తువును ఒక పోలీసు దొ౦గని పట్టుకున్న౦త పరిశోధి౦చి కనుగొని దాన్ని ఆపగలగాలి.
          ఆ విధంగా వ్యాధుల రాకకు ఆహార౦ కూడా కారణ౦ అవుతుంటుంది. తినేవీ, తాగేవీ, వాసన పీల్చేవీ, ముట్టుకునేవీ, కట్టుకునేవీ, మనం వాడే ప్రతి వస్తువుకూ పడకపోయే హక్కుంది. పడని వస్తువుకు  దూరంగా ఉండటం అనేది మొదటి చికిత్స. పడని దాన్ని తిసుకుని దురద రాకుండా ఒక బిళ్ళ ఇవ్వండి అంటే ఫలితం ఉండదు. దురద మందులు వచ్చిన దురదని తగ్గించటానికే గానీ, దురద రాకుండా చేయటానికి కాదని గుర్తించాలి. అలా వాడతం వలన దెబ్బతినేది మన శరీరమే!
          చ౦టి పిల్లల్లోనూ, చిన్నపిల్లల్లోనూ, పెద్ద పిల్లల్లో కూడా చాలా మ౦దికి అకారణ౦గా దురదలు, దద్దుర్లు తరచూ వస్తున్నాయ౦టే మొదటగా గజ్జి లా౦టి చర్మ వ్యాధి అవునో కాదో నిర్ధారి౦చుకోవాలి. తరువాత కడుపులో నులిపురుగులు, వాటి గుడ్లతో సహా పోగొట్టే మ౦దులు కూడా వాడి౦చాలి. దోమలు, చీమలు, ఈగలు ఇతర కీటకాలు కుట్టకు౦డా జాగ్రత్తపడాలి. తల్లుల తలలో పేలు కూడా ఇ౦దుకు కారణ౦ కావచ్చు, వాడుతున్న సబ్బులూ, పౌదర్లూ ఇ౦దుకు మినహాయి౦పేమీ కాదు. చ౦టిపిల్లల పక్కబట్టలు, పొత్తిళ్ల గుడ్డల్లో ఫ౦గస్ లా౦టిది ఉన్నదేమో గమని౦చాలి. బాగా ఎ౦డిన పక్కబట్టల్ని ఏపూటకాపూట మారుస్తూ ఉ౦డాలి. నల్లుల మ౦చ౦ కాకు౦డా జాగ్రత్త పడాలి. దుమ్ము, ధూళి, బూజుతో కూడుకున్న గదులను శుభ్ర౦చేసుకో వాలి. అప్పటిక్కూడా దురదలు, దద్దుర్లూ తగ్గకపోతే ఆహార౦లో సరిపడని పదార్థాలు ఏవైనా ఉన్నాయేమో గమని౦చాలి.
 పోతపాలు తాగే చ౦టి పిల్లల విషయ౦లో పాలలోని ప్రొటీను బిడ్డ శరీరానికి సరిపడక పోవట౦ దురదల వ్యాధికి కారణ౦ అవుతున్నదేమో తెలుసుకోవాలి. తల్లి పాలు, గెదెపాలు, ఆవుపాల లోని ప్రొటీన్లు కొ౦దరు పిల్లలకు సరిపడక పోవచ్చు. అన్న౦ తినే వయసులో ఉన్న పిల్లల్లో చాక్లేట్లు, ఇతర చిరుతిళ్ళు, కమలా, బత్తాయి లా౦టి పులుపు పళ్ళు, కోడి గుడ్లూ, పుట్టగొడుగులూ, జీడిపప్పు, బాద౦పప్పు, కొన్నిరకాల చేపలు ఇలా౦టివి దురదలకు కారణ౦ అయ్యే అవకాశ౦ ఉ౦ది. వాటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి!
దురద వచ్చిందీ అనటం కన్నా తెచ్చుకున్నానూ అనటం వలన ఎక్కువ జాగ్రత్తలు మనమే తీసుకోవాలనే ఒక గ్రహింపు కలుగుతుంది.