Thursday 1 October 2015

కృష్ణాజిల్లా రచయితల సంఘం పురస్కారాల సభ

కృష్ణాజిల్లా రచయితల సంఘం పురస్కారాల సభ

ప్రతి ఏడాదీ ఐదుగురు సాహితీ  ప్రముఖులకు కృష్ణాజిల్లా రచయితల సంఘం అందించే పురస్కారాలను 2013-2014, 2014-15 సంవత్సరాలకు గాను మొత్తం 10 మంది ప్రముఖులకు అందిస్తున్నాము.

10 వేల రూపాయల నగదు, సత్కారం, సైటేషన్ బహూకరణ జరుగుతుంది.

అక్టోబర్ 10 సాయంత్రం 6గంటలకు విజయవాడ హోటల్ ఐలాపురంలో ఈ సభ జరుగుతోంది.

పురస్కారాల వివరాలు:

శ్రీ మండలి వెంకట కృష్ణారావు సాహితీ పురస్కారం (వ్యవస్థాపకులు: శ్రీ మండలి బుద్ధప్రసాద్)
     శ్రీ గొల్లపూడి మారుతీరావు
     ఆచార్య రవ్వా శ్రీహరి

శ్రీ ఆలూరి బైరాగి సాహితీ పురస్కారం (వ్యవస్థాపకులు: ఆచార్య యార్లగడ్ద లక్ష్మీప్రసాద్)
     శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు
     శ్రీ యాకూబ్

శ్రీ గుత్తికొండ సుబ్బారావు సాహితీ సేవాపురస్కారం (వ్యవస్థాపకులు: శ్రీ గుత్తికొండ సుబ్బారావు)
     డా. తుర్లపాటి రాజేశ్వరి
     శ్రీ రాథేయ

శ్రీ పోలవరపు కోటేశ్వర రావు కథా పురస్కారం (వ్యవస్థాపకులు: శ్రీ గోళ్ళ నారాయణరావు)
     శ్రీమతి డి కామేశ్వరి
     శ్రీ అట్టాడ అప్పల నాయుడు

శ్రీ ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారం (వ్యవస్థాపకులు: ఆచార్య ప్రతిభ)
     శ్రీ సి రాఘవాచారి
     శ్రీ వీరాజీ

పురస్కార గ్రహీతలకు ధన్యవాదాలు, అభివాదాలు.

సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం

డా. జి వి పూర్ణచందు,
ప్రధాన కార్యదర్శి

No comments:

Post a Comment