Language, Literature, Culture and Food heritage of Telugu People.-------- Susruta Ayurvedic Hospital, 1st Floor, Satnam Towers, opp. Buckinghampet Post Office Governorpeta, Vijayawada – 520002 9440172642, Email ID: purnachandgv@gmail.com,
Monday, 7 December 2020
Dr. GV Poorna Chandu Talks | Over Significance of Teaching in Mother Ton...
సాహిత్యసింధు డా. జి. వి. పూర్ణచందు ప్రసిద్ధ సాహితీవేత్త, ఆయుర్వేద వైద్య నిపుణులు, తెలుగువారి ఆహార చరిత్రవేత్త. శతాధిక గ్రంథకర్త. విజయవాడ వాస్తవ్యులు, 150 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 70 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న “హంస” పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 70కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. వీరి సాహిత్యం పైన 3 రోజుల పాటు జరిగిన సెమినార్లో ప్రసిద్ధ సాహితీ వేత్తలు సమర్పించిన విశ్లేషణా పత్రాలను పూర్ణచంద్రోదయం పేరుతో పుస్తకంగా వెలువరించారు. ఆహారవేదం, తెలుగే ప్రాచీనం, నైలూ నుండి కృష్ణ దాకా, తెలుగుకోసం లాంటి విశేష పరిశోధనా గ్రంథాల రచయిత. భువనవిజయం-రాయలనాటి కథలు,గాథలు వీరి ఇటీవలి రచన. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 6 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. 25 బృహత్తర పరిశోధనా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు
Wednesday, 2 December 2020
ఆంధ్రత్వం, ఆంధ్రభాషలు తపఃఫలాలని భావించిన తెలుగు ప్రముఖుడు శ్రీ అప్పయ్య దీక్షితుల వారి జీవిత చరిత్రను వారి 500వ జయంతి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర ప్రచురణల సంస్థ ప్రచురించింది.ఈ కరోనా కట్టడి సమయంలో నేను వ్రాసిన 4 గ్రంథాల్లో ఇది ఒకటి. హరిచరణ స్మరణ పరాయణ శ్రీనారాయణ తీర్థులవారి జీవిత చరిత్రను, భోజనం భాగ్యం ఆహార వైద్య గ్రంథాన్ని, నవకరోనా - నిజాలు వైద్య గ్రంథాన్ని కూడా శ్రీ రాఘవేంద్ర సంస్థ వారు ప్రచురిస్తున్నారు. డిసెంబరు 25, 26, 27 తేదీలలో జూమ్ ద్వారా మాడభూషి సాహిత్య కళా పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న "డా. జి వి పూర్ణచందు జీవితం సాహిత్యం వ్యక్తిత్వం" సదస్సులో ఆవిష్కృత మవుతున్నాయి. విశాలాంధ్ర ఆదివారం సంచికలో నేను వ్రాసిన పద్యానుభవం వ్యాసాలను ఎమెస్కో సంస్థ వారు పద్యరాగాలు పేరుతొ ప్రచురిస్తున్నారు. ఈ పుస్తకం కూడా ఆ సదస్సులో ఆవిష్కరణ అవుతుంది. దీర్ఘకాలంగా అచ్చువేయకుండా నేను అలసత్వం వహించిన ముక్కాలు 2వ భాగం 6భాషల్లో అనువాదం తో పుస్తకంగా ఈ సభలోనే విడుదల చేస్తున్నాను. పెద్దల ఆశీస్సులు ప్రార్థిస్తున్నాను. హరహర మహాదేవ పాఠకులకు అందుబాటులో ఉంది. దాన్ని శ్రీరాఘవేంద్రరావుగారు నెంబర్ +919849181712ద్వారా పొందవచ్చు.
సాహిత్యసింధు డా. జి. వి. పూర్ణచందు ప్రసిద్ధ సాహితీవేత్త, ఆయుర్వేద వైద్య నిపుణులు, తెలుగువారి ఆహార చరిత్రవేత్త. శతాధిక గ్రంథకర్త. విజయవాడ వాస్తవ్యులు, 150 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 70 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న “హంస” పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 70కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. వీరి సాహిత్యం పైన 3 రోజుల పాటు జరిగిన సెమినార్లో ప్రసిద్ధ సాహితీ వేత్తలు సమర్పించిన విశ్లేషణా పత్రాలను పూర్ణచంద్రోదయం పేరుతో పుస్తకంగా వెలువరించారు. ఆహారవేదం, తెలుగే ప్రాచీనం, నైలూ నుండి కృష్ణ దాకా, తెలుగుకోసం లాంటి విశేష పరిశోధనా గ్రంథాల రచయిత. భువనవిజయం-రాయలనాటి కథలు,గాథలు వీరి ఇటీవలి రచన. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 6 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. 25 బృహత్తర పరిశోధనా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు
Subscribe to:
Comments (Atom)