Saturday 19 July 2014

అన్నానికి దండాలు డా. జి వి పూర్ణచందు

అన్నానికి దండాలు        డా. జి వి పూర్ణచందు    
భోజనాని విచిత్రాణి పానాని వివిధాని చ/వాచః శ్రోతానుగామిన్యస్త్వచః స్పర్శసుఖాస్థథా...అంటూ మొదలయ్యే సూత్రం సుశ్రుత సంహిత చికిత్సా స్థానంలో ఉంది. మంచి కట్టు, బొట్టు కలిగిన నవయౌవన స్త్రీ పక్కనుండగా, చక్కని పాటలు, వినసొంపైన మాటలు వింటూ, విచిత్రమైన భోజనాలు, అనేక రకాల వంటకాలు, చిత్రమైన పానీయాలు తీసుకొని, తాంబూలం వేసుకొని, పూవులూ సుగంథ లేపనాదులు మత్తెక్కిస్తుంటే, స్పర్శాసుఖమైన ఆలోచనలతో, మనసుకు ఉత్సాహం ఇచ్చే చేష్టలతో సంతోష0గా ఉన్న ఎవరికయినా లైంగికశక్తి అనేది గుర్రంతో సమానంగా ఉంటుందని సుశ్రుతుల వారు పేర్కొన్నారు. లైంగిక సమర్థత విషయంలో గుర్రానిది పెట్టింది పేరు. గుర్రాన్ని వాజీ అంటారు. గుర్రమంత సమర్థతనిచ్చే ద్రవ్యాలను వాజీకరా(aphrodisiacs)లని పిలుస్తారు. పైన చెప్పిన కమ్మని భోజనాదులన్నీ మంచి వాజీకరాలేనని దీని అర్థం. అన్నం శబ్దానికి పోషించేదీ, ఆయుష్షునిచ్చేది, సంరక్షించేది లాంటి అర్థాలున్నా, సంసార జీవితాన్ని సుఖమయం చేసేదనే రెండువేలయేళ్ళనాటి సుశ్రుతాచార్యుడి నిర్వచనం గొప్పది.
                ‘భావప్రకాశవైద్యగ్రంథంలో భక్తమన్నంతథాంధస్చ క్వచిత్కూరంచ కీర్తితంఅనే శ్లోకంలో అన్నానికి భక్త’, ‘అంథ’, ‘ఓదన’, ‘భిస్సా’, ‘దీదివిఅనే పేర్లున్నాయనీ, కొన్నిచోట్ల కూరంఅని కూడా అంటారనీ ఉంది. అంథ, కూరం శబ్దాలకు అన్నం అనే అర్థమే ఉందని ఈ వైద్యగ్రంథం చెప్తో0ది. పదాల పుట్టుకకు సంబంధించిన నిఘంటువుల్లో కరిఅంటే తమిళంలో నలుపు అనీ, కారం కోసం మిరియాలు వాడేవారు. కాబట్టి, నల్లగా ఉండేదనే అర్థంలో తమిళంలో కూరపదం ఏర్పడిందని, అదే ఇంగ్లీషులో కర్రీగా మారిందనీ పేర్కొన్నారు. మిరియం, పసుపు లాగా రంగునిచ్చే వర్ణకమో, రంజకమో కాదు. మిరియాలు వేస్తే ఏ ఆహారపదార్థమూ నల్లగా మారదు. తెలుగు పదసంపదను పరిశీలించకు0డా కొన్ని అబద్ధాలను ప్రచారం చేశారనేది వాస్తవం
ఆప్టే సంస్కృత నిఘంటువు(పే.129)లో అన్నం అంటే, ఒక జాతి ప్రజలు, ఆంధ్రులు అనే అర్థాలున్నాయి. ఆంధ్ర భృత్యా: అనే మాటను ఉదహరించి, ‘ఆంధ్రరాజవంశముఅని దానికి అర్థాన్ని చెప్పారు. ఆంధ్రభృత్యులుగా శాతవాహనులు తమని తాము చెప్పుకొన్నది తాము ఆంధ్రరాజుల మనే అర్థంలోనేనని, ఈ ఆంధ్రులను అన్నం అనే పేరుతో కూడా పిలిచారని ఆప్టే నిఘంటువు వలన తెలుస్తో0ది. అలాగే, అంధ అనే పదానికి అన్నం, ఆంధ్రులు అనే అర్థాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వయంగా ఆంధ్రుల్నే అన్నం పేరుతో పిలిచినట్టు నిఘంటువులే పేర్కొంటున్నాయి. మరణం లేని వారనే అర్థంలో అమృతాంధసులనే పదం కనిపిస్తు0ది. కానీ, మన పెద్దలు జైన కథల్లోని అంథకుడి వృత్తాంతం తీసుకొని మనల్నిశాపగ్రస్థులుగా చిత్రించారు. పురాణేతిహాస బ్రాహ్మణాలు భాషాజాతి పరంగా మనకు చేసిన అన్యాయం ఇది. ప్రోటో ఇండో యూరోపియన్ పదరూపాల్లో అంథ్శబ్దానికి మనిషి అనే అర్థమే ఉంది. anthropology అనే మానవ సంబంధ శాస్త్ర0లో anth అంటే మనిషి. అంతేగానీ గుడ్డి కాదు. అంథ్ అంటే మనిషి. అంథ్ అంటే ఆంధ్రుడు. అంథ్ అంటే, అన్నం. అన్నం అంటే ఆంధ్రుడు. ఆంధ్ర శబ్ద0 భాషా జాతిగా మొత్త0 తెలుగు ప్రజలకు వర్తి0చే పదం. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రజలు ఆహారాన్ని అన్నం అనట0 ఉంది.
అన్నం గురించినవిశేషాలు మరికొన్ని ఉన్నాయి. వియత్నాం దేశాన్ని 1945 వరకూ అన్నం దేశంఅనీ వియత్నామీయుల్ని అన్నామైట్స్ అనీ పిలిచేవారు. బావోదాయి చక్రవర్తి వీయేత్-నమ్అనే ప్రాచీన కాలం నాటి పేరు వ్యాప్తిలోకి తెచ్చాడని చరిత్ర.. 16వ శతాబ్దిలో క్రైస్తవ మిషనరీల ద్వారా ఈ దేశం బైట ప్రపంచానికి తెలిసి0ది. అన్నన్ అంటే, చైనా భాషలొ దక్షిణ భాగంఅని అర్థం. అత్యంత ఆశ్చర్యకరంగా ద్రావిడపదానికి దక్షిణానికి వెళ్ళినవారు అనే అర్థమే ఉంది. ఆంధ్రుల్ని అన్నం పేరుతో వ్యవహరించటానికి అంతర్జాతీయ కారణాలు ఏవో ఉండి ఉంటాయని దీన్నిబట్టి అనిపిస్తో0ది. లోతుగా పరిశీలించాల్సిన అంశమే ఇది. ఫార్సీ భాషలో అన్నం అంటే, మేఘాలు. గేలిక్ భాషలో ఆత్మ. తమిళంలో హంస. టర్కీలో అమ్మ. అరెబిక్ భాషలో దేవుని వరం అని! తహ్మీమా అనమ్అనే బంగ్లాదేశీ ఆంగ్ల రచయిత్రి పేరులో అనమ్అర్థం ఇదే
సరైన వేళకు అన్నం తింటే, ఆయువు, వీర్య పుష్టీ, బలం, శరీరకా0తి, ఇవి పెరుగుతాయి. దప్పిక, తాపం, బడలిక అలసట తగ్గుతాయి. శరీరేంద్రియాలన్నీ శక్తిమంతం అవుతాయిబియ్యాన్ని దోరగా వేయించి వండితే తేలికగా అరుగుతుంది. జ్వరాలలో పెట్టదగినదిగా ఉంటుంది. గాడిద పాలతో వండిన అన్నం క్షయ పక్షవాత రోగాలలో మేలు చెస్తుంది. ఆవుపాలతో వండితే వీర్యకణాల వృద్ధి కలుగుతుంది. రాత్రిపూట వండిన అన్నంలో నిండా పాలు పోసి తోడుపెట్టి ఉదయాన్నే తింటే, చిక్కి శల్యమైపోతున్న పిల్లలు ఒళ్ళు చేస్తారు తిన్నది వంట బట్టని అమీబియాసిస్ వ్యాధి, గ్యాస్ట్రయిటిస్ అనే పేగుపూత వ్యాధి తగ్గుతాయి. వేయి0చిన బియ్యాన్ని మజ్జిగలో వేసి వండిన అన్నం విరేచనాల వ్యాధిలో ఔషధమేవాము కలిపిన మజ్జిగ పోసుకొని అన్నం తింటే శరీరంలోని విషదోషాలకు విరుగుడుగా ఉంటుంది.
హోటళ్లలోనూ, విందు భోజనాల్లోనూ మనవాళ్ళు తినే వాటికన్నా పారేసేవి ఎక్కువ ఉంటాయి. డబ్బు వారిదే అయినా వనరులు సమాజానివి కదా... ఆ పారేసి0దంతా ఇతరుల నోటిదగ్గర కూడు అనే గ్రహి0పు అయాచితంగా సంపాది0చిన మన కొత్త ధనిక వర్గానికి లేదు. అనవసరంగా అంతంతగా వండినందుకు, అలాగే, తినకుండా పారేసి నందుకు ఇద్దరికీ శిక్షలు విధించే చట్టం ఉంటేగానీ, ప్రకృతి వనరుల దుర్వినియోగం ఆగదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.
                .

No comments:

Post a Comment