Saturday 22 February 2014

3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభల వాయిదా ప్రకటన

         
ఆ౦ధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో
కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ సహకారంతో

ప్రప౦చ తెలుగు రచయితల స౦ఘ౦

 ఆధ్వర్య౦లో
      3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు
          మన యువతరంలో సాంస్కృతిక స్ఫూర్తికోసం, తెలుగు జాతి సమధిక వికాసానికి అంకితంగా గత సెప్టేంబరు నెలలో నిర్వహించాలని తలపెట్టిన  3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు వాయిదా పడిన విషయం విదితమే! దరిమిలా 2014 మార్చి1,2,3 తేదీలలో జరిపేందుకు నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రతినిధులుగా నమోదు అయిన వారందరికీ తెలియచేయటం కూడా జరిగింది. కానీ, ప్రస్తుతం మహా సభల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేని కారణంగా ఈ మహా సభలను అనువైన సమయంవరకూ వాయిదా వేయక తప్పటం లేదని ప్రకటించటానికి చింతిస్తున్నాం. ఈ అసౌకర్యానికి మన్నించవలసిందిగా ప్రార్థన.
          అనుకూల పరిస్థితులు ఏర్పడగానే తెలుగు నవజీవన పునరుత్తేజక మహాసభలుగా తీర్చిదిద్దుతూ వీటిని నిర్వహించుకుందాం. పెద్దమనసుతో సహకరించవలసిందిగా కొరుతున్నాం. కొత్త తేదీలను త్వరలోనే తెలియపరచగలమని మనవి.
          గతంలో చెల్లించిన ప్రతినిథి రుసుము యథాతథంగా రేపు జరగనున్న సభలకూ వర్తిస్తుందనీ, ప్రతినిధులకు గతంలోప్రకటించిన సౌకర్యాలలో కూడా ఎలాంటి మార్పూ ఉండదనీ తెలియజేస్తున్నాం.

నమస్కృతులతో...
మండలి బుద్ధప్రసాద్                                                                              ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్  
గౌరవాధ్యక్షులు                                                                        కార్యనిర్వాహక అధ్యక్షులు
గుత్తికొండ సుబ్బారావు                                                                           డా. జి వి పూర్ణచందు

అధ్యక్షులు                                                                             ప్రధానకార్యదర్శి

No comments:

Post a Comment